Publish Date:May 17, 2025
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 101వ మిషన్ పీఎస్ఎల్వీ సీ61 సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం పూర్తి కాలేదు. ఆదివారం ఉదయం 5.59 గంటలకు రాకెట్ను ప్రయోగించిన తర్వాత మూడో దశ అనంతరం రాకెట్లో తలెత్తిన సాంకేతిక సమస్య తలెత్తినట్లు ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. నిర్ధిష్ట్ షెడ్యూల్ ప్రకారం పీఎస్ఎల్వీ సీ61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే.. మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్ను సమీక్షిస్తున్నారు.
ప్రయోగం ఇంకా పూర్తికాలేదని, మూడో దశ తర్వాత రాకెట్లో సమస్య వచ్చిందనీ ఇస్రో చైర్మన్ తెలిపారు. శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి...1696.24 కేజీల బరువు కలిగిన ఈవో ఎస్ -09 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపడానికి శనివారం (మే 17) ఉదయం 7.59 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. కౌంట్ డౌన్ ప్రక్రియ 22 గంటలు సాగిన అనంతరం ముందుగా నిర్ణయించిన మేరకు ఆదివారం ( మే 18) ఉదయం సరిగ్గా 5.59 గంటలకు రాకెట్ ను ప్రయోగించారు. అయితే రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన కొద్ది సేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం పూర్తి కాలేదు. పూర్తి వివరాలను తరువాత వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/technical-problem-in-pslv-c61-39-198268.html
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని లేకపోతే భవిష్యత్లో ఆక్సిజన్ మాస్కులు పెట్టుకునే పరిస్థితి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోల్కొండ ఏరియా హాస్పిటల్లో మంత్రి మొక్కలు నాటారు.
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని లేకపోతే భవిష్యత్లో ఆక్సిజన్ మాస్కులు పెట్టుకునే పరిస్థితి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోల్కొండ ఏరియా హాస్పిటల్లో మంత్రి మొక్కలు నాటారు.
వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ గిరిజనులను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన ఆయన నెల్లూరు ఐదో ఎస్సీ, ఎస్టీ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రతిష్ఠాత్మక సంస్థలు తరలి వస్తున్నాయి. తాజాగా మరో ప్రతిష్ఠాత్మ విద్య సంస్థ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. అమరావతిలో న్యాయ విశ్వవిద్యాలయం లా యూనివర్శిటీ ఏర్పాటు కానుంది.
వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ గిరిజనులను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన ఆయన నెల్లూరు ఐదో ఎస్సీ, ఎస్టీ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేసి, పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు న్యాయశాస్త్ర ప్రవేశ పరీక్ష (లాసెట్)కు హాజరయ్యారు. ఒంగోలులోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఆయన లాసెట్ పరీక్ష రాశారు.
జగన్ కోటరీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డికి విజిలెన్స్ నోటీసులు జారీ అయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పని చేశారు.
తొక్కిసలాటతో తప్పెవరిది? జనం ఇంతగా ఎగబడుతున్నారేంటి? పుష్ప 2 రిలీజ్ సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందగా... ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఇప్పటికీ కోలుకోలేదు. ఇక వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో తొక్కిసలాట జరిగి టీటీడీ చరిత్రలోనే అతి భారీ ప్రాణ నష్టం సంభవించింది.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరులో కేసు నమోదైంది. ఇష్టారీతిగా నోరు పారేసుకోవడమే కాకుండా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై పట్టభిపురం పోలీసులు స్టేషన్ లో కేసు నమోదైంది.
పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం అగ్ర ప్రాథాన్యత ఇస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా చంద్రబాబు చేసిన ట్వీట్ లో ప్రకృతి ఏ ఒక్కరి సొత్తూ కాదన్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తిరుమa లడ్డూ ప్రసాదం లో వినియోగించే నెయ్యి కలుషితం అంశంపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది.
సెలవు దినాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ కుటుంబం తో గడపాలని, లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని చూస్తారు. కానీ ఈ గవర్నమెంట్ టీచర్ రూటే సెపరేటు. గురువుగా తన విద్యార్థులకు విజ్ణాన బోధతో పాటు వినోదం, విహారలతో విషయపరిజ్ణానం అందించాలని భావిస్తారు.
తిరుమల చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నియమితులైనగా మరళికృష్ణ బుధవారం (జూన్ 4) బాధ్యతలు స్వీకరించారు.