Publish Date:Jun 16, 2025
అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద విషాదచ్ఛాయలు ఇంకా మరువక ముందే.. విమానాలలో వరుసగా తలెత్తుతున్న లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు విమాన ప్రయాణమంటేనే బెంబేలెత్తేలా చేస్తున్నాయి. తాజాగా చెన్నైకు బయలు దేరిర బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 787 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కు మళ్లించి లండన్ లోని హీత్రూ మిమానాశ్రయంలో దించారు.దీంతో పెను ప్రమాదం తప్పింది. సరిగ్గా అహ్మదాబాద్ విమానానికి జరిగినట్లే ఈ బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం కూడా టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ ఫ్లాప్ అడ్జస్ట్ మెంట్ లోపం అని పేర్కొన్నారు. విమానం 9000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఈ లోపాన్ని కనుగొన్న పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కు మళ్లించి హిత్రూ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.
అలాగే ఉత్తర ప్రదేశ్ నుంచి కోల్ కతా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో కూడా సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ సకాలంలో ఆ లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఘజియాబాద్ లోని హిండన్ విమానాశ్నయం నుంచి టేకాఫ్ చేసే సమయంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని రన్ వే పేనే నలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై స్పందించిన ఎయిర్ ఇండియా సాంకేతిక సమస్య కారణంగా విమానం ఆలస్యంగా నడిచినట్లు పేర్కొంటూ, ప్రయాణికులకు ఉచిత రీషెడ్యూలింగ్, టికెట్ రద్దు చేసుకుంటే.. పూర్తి డబ్బులు వాపస్ ఇస్తామని ప్రకటించింది.
ఇక ఆదివారం (జూన్ 15) అమెరికాలో ని బోస్టన్ లోగాన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న జెటెబ్లూ విమానం రన్ వే నుంచి జారి పక్కకు దూసుకెళ్లింది. పైలట్ అప్రమత్తత కారణంగా ఘోర విప్తత్తు తప్పింది.
ఇక జర్మనీ నుంచి హైదరాబాద్ రావాల్సిన లుఫ్తాన్సా ఎల్హెచ్ 752 విమానం బయలుదేరిన కొద్ది సేపటికి యూటర్న్ తీసుకుని వెనక్కు మళ్లించి ఫ్రాక్ ఫర్డ్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. హైదరాబాద్ లో ల్యాండింగ్ కు అనుమతి లేకపోవడమే ఇందుకు కారణమని లుఫ్తాన్సా సంస్థ ప్రకటించింది. అయితే.. బాంబు బెదరింపు కారణంగానే విమానాన్ని వెనక్కు మళ్లించినట్లు తెలుస్తోంది. వరుస సంఘటనలతో విమానప్రయాణమంటేనే జనం బెంబేలెత్తుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/techinical-lapse-in-british-airways-flight-39-200018.html
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒక జర్నలిస్టు బలవన్మరణానికి పాల్పడ్డారు.
గత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చలేని నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియమ్స్ కంపెనీని వీడనుండటంతో.. సీఈవో టిమ్కు కుక్కు అదనపు బాధ్యతలను అప్పగించింది.
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ వడోదరాలోని మహిసాగన్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది.
గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ.500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి.
గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామం గల గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎరువుల కొరత లేకుండా రాష్ట్రానికి సహకరిస్తామని తెలిపింది. యూరియా కోటా పెంచాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్రానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదికతో చర్యలు ప్రారంభించారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీలో ప్రభుత్వం రైతాంగానికి తీపి కబురు చెప్పింది. బుధవారం (జులై 9) వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధాన్యం పాత బకాయిలు రూ.1000 కోట్లలో రూ. 672 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోంది. తొలి అడుగుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం తుది దశకు వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలను వినూత్నంగా అభివృద్ధి చేస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ బుధవారం అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. భోజనం కోసం వచ్చిన సామాన్య ప్రజలతో పాటు నిలుచుని, జేబులో నుండి ఐదు రూపాయలు చెల్లించి క్యాంటీన్లో భోజనం అందుకున్నారు.
ఏపీ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టులో పది రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సభాపతి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
మొన్నటి విశ్వవసు నామ సంవత్సర ఉగాది పంచాంగం చదువుతుండగా ఆ పండితుడు చెప్పిందేంటంటే జగన్ కి స్త్రీ మూలక సమస్యలు ఎక్కువగా వస్తాయని. ఆ సరికే ఆయన తన తల్లి చెల్లితో పీక లోతు పోరాటం చేస్తున్నారు. కేసులు గట్రా వ్యవహారాలు నడుస్తున్నాయ్.