Publish Date:Oct 15, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దొంగ ఓట్ల వ్యవహారంతో పాటు కన్నీటి కథలు కూడా భారీగానే నడుస్తున్నాయ్. బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత తన భర్తను తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యారొక సభలో. అయితే ఈ కన్నీటి కహానీలు కేటీఆర్, హరీష్ కావాలనే దగ్గరుండి నడిపిస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు పొన్నం తదితరులు. తమకు సునీత మీద సానుభూతి ఉందంటూనే.. ఆమెను కావాలనే రెచ్చగొట్టి ఏడిపించి సీన్ క్రియేట్ చేస్తున్నది మాత్రం హరీష్, కేటీఆరే అంటూ విమర్శలు చేస్తున్నారు.
అసలు బీఆర్ఎస్ తమ అభ్యర్ధిగా సునీతను నిలబెట్టిందే ఇందుకు అంటున్నారు. వాస్తవానికి జూబ్లీ బైపోల్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తొలుత పార్టీ అనుకున్న వ్యక్తులు వేరు అంటూ గుర్తు చేస్తున్నారు. జూబ్లీ బైపోల్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తొలుత కేటీఆర్ సతీమణి శైలిమ పేరు, ఆ తరువాత పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి పేరు కూడా బీఆర్ఎస్ పరిశీలించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.
అయితే శైలిమ, విష్ణువర్దన్ రెడ్డిలలో ఒకరిని నిలిపినా.. జూబ్లీ ఉప ఎన్నిక జరుగుతుందే కానీ, బీఆర్ఎస్ కు అవసరమైన సెంటిమెంట్ పండదన్న భావనతోనే మాగంటి సునీతకు టికెట్ ఇచ్చారని అంటున్నారు. బేసిగ్గా బీఆర్ఎస్ ఆయువు పట్టు మొత్తం సెంటిమెంటులో దాగి ఉంటుంది. అయితే ప్రాంతీయ సెంటిమెంటు, లేకుంటే ఇదిగో ఇలాంటి సెంటిమెంట్లు ఆధారంగా వారు తమ కారు నడిపిస్తుంటారు. ఎందరో బలిదానాల పునాదుల మీద కట్టుకున్న పార్టీ కదా? అలాగే ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
బీఆర్ఎస్ దంతా ఎమోషన్ చుట్టూ ఆడే డ్రామానే అంటారు వారు. ఇవేవీ కాకపోతే.. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబును అప్పు తెచ్చుకుని మరీ ఆయనపై విమర్శలు గుప్పించి పబ్బంగడుపుకోవడం చూస్తున్నాం కదా అని ఎద్దేవా చేస్తున్నారు. మొత్తం సెంటిమెంట్ ఆధారంగానే బీఆర్ఎస్ రాజకీయం ఉంటుందనీ, అటువంటి పార్టీకి అందివచ్చిన అవకాశంలా సునీత కన్నీళ్లు చెంతనే ఉంటే వాడుకోకుండా ఎలా ఉంటారు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tears-raising-political-heat-in-jubleehills-by-poll-39-207978.html
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.