జగన్ గడ్డపై టిడిపి జెండా!

Publish Date:Aug 14, 2025

Advertisement

పులివెందులలో వైసీపీ డిపాజిట్ గల్లంతు 
ఒంటిమిట్టలో తెలుగుదేశానికి భారీ మెజారిటీ

జగన్ అడ్డాపై టిడిపి జెండా ఎగిరింది. అదీ  మామూలుగా కాదు. కనీవినీ ఎరుగని రీతిలో. కడప ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జడ్పీటీసీ  ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిం చారు. పులివెందులలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంతయింది.  ఇంతవరకు కడప జగన్ అడ్డా అంటూ గొప్పలు చెప్పుకున్న వైసీపీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. రెండు జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు ఉంటాయని  ఊహించిన టీడీపీ నాయకులు ముందు నుంచే వ్యూహాత్మకంగా పావులు కదిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక విషయంలో టీడీపీ నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిలో భాగంగానే పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం  ఇంచార్జ్ బీటెక్ రవి సతీమణిని రంగంలోకి దింపి వైసీపీని అయోమయంలో పడేశారు.

దీనికితోడు వైసీపీ ఆనుపానులు తెలిసిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి జడ్పీటీసీ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. 1995 నుంచి జడ్పీటీసీ ఎన్నికల్లో 2016 మినహా ఎప్పుడూ కూడా ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం రాలేదు. ఈ సారి ఇరు పార్టీలు ఇచ్చే తాయిలాలు పుచ్చుకుని ఈ అవకాశం టీడీపీ వల్లనే వచ్చిందనే భావన ప్రజల్లో ఉంది. దానికి కృతజ్ఞతగా ఆ పార్టీకి ఈసారి తెలుగుదేశం అభ్యర్థికి మద్దతుగా నిలిచారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

జెడ్పటీసి ఎన్నికల  విధానం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పులివెందులలో ఏ ఎన్నికలోనూ టిడిపి గెలవలేదు. 2 001లో జరిగిన ఎన్నికల్లో అయితే పోటీనే లేకుండా ప్రస్తుత వైసిపి అభ్యర్థి హేమంత్ రెడ్డి తండ్రి మహేశ్వర్ రెడ్డి  ఏకగ్రీవంగా గెలుపొందారు . అంటే జెడ్పీటీసీ  ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పులివెందల జడ్పిటీసీ స్థానం వైసిపి సొంతం అన్నట్లుగా గెలుస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ఆ చరిత్ర తిరగరాసి వైసీపీకి చేదు అనుభవాన్ని చవిచూపించడంలో టిడిపి వ్యూహం పలించిందనే చెప్పాలి. పులివెందుల ఉపఎన్నిక మొదటి నుంచి వైసీపీ, టిడిపిల మధ్య రభస  జరుగుతూనే వచ్చింది. పోలింగ్ రోజు వైసీపీ నేత ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడం, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లను హౌస్ అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది.  దీనిపై వైసీపీ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రీపోలింగ్ వరకు ఉత్కంఠగా సాగిన పోరులో  పులివెందులలో టీడీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది.

పులివెందుల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గెలవడమే కాదు ఆమెకు వచ్చిన ఓట్లు కూడా ఒక చరిత్రే. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన లతా రెడ్డికి 6716 ఓట్లు వస్తే,  వైసీపీ నుండి పోటీ చేసిన హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి.  అంటే 6033 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం విజయం సాధించింది. ఇంత పెద్ద మెజార్టీ రావడం చూస్తే  టిడిపిని సాధారణ ఓటర్లు బాగా ఆదరించారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వైసీపీ కి ఇంత తక్కువ ఓట్లు రావడం, టిడిపికి ఊహించని స్థాయిలో ఓట్లు రావడం చూస్తే కడపలో జగన్ కు చెక్ పెట్టే పరిస్థితి త్వరలోనే ఉంటుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

 పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం జెండా  రెపరెపలాడడం లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మార్క్ కనిపిస్తోంది. పులివెందులలో మంచి రాజకీయ సంబంధాలు, బంధుత్వాలు కలిగిన ఆయన ఈ ఎన్నికల్లో తన ప్రభావం ఏంటో  చూపించారని చెప్పవచ్చు. గతంలో దివంగత వైయస్ వివేకానందరెడ్డిపై ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుత జడ్పిటిసిగా  గెలిచిన అభ్యర్థి లతా రెడ్డి భర్త బీటెక్ రవి పోటీ చేసినప్పుడు కూడా ఆదినారాయణ రెడ్డి మంత్రాంగం ఫలించింది. అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డికి తానేంటో  రుచి చూపించారు. ఇప్పుడు  జెడ్పీటీసి ఉప ఎన్నికలను అంతా తానై పదిరోజుల పాటు  పులివెందులలో తిష్ట వేసి ఊరు ,వాడ వీధి ,సందు అందరితో మాట్లాడి ఓటర్లను తమ వైపు మలుచుకోవడమే కాకుండా, ఓట్లు టిడిపి అభ్యర్థికి పోలయ్యే  విధంగా వ్యూహం రూపొందించారు.

పులివెందుల ఉప ఎన్నికపై  జిల్లా, స్థానిక నాయకులు సమష్టిగా కష్టపడ్డారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆదేశానుసారం ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించలేదు. సర్వ శక్తులు కూడగట్టుకొని విజయం సాధించడంలో ఎవరి మేరకు వారు సత్తా చాటారు. టిడిపి అభ్యర్థి భర్త పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్చార్జి బీటెక్ రవితో పాటు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి   నిరంతరం ఎన్నికల నిర్వహణలో పోలింగ్ వరకు వారి వ్యూహాలను అనుసరిస్తూ వారికున్న సంబంధాలను అభ్యర్థి గెలుపుకోసం కోసం సానుకూలంగా మలుచుకుంటూ వచ్చారు. వీరితోపాటు  జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా  చైతన్య రెడ్డి లు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. చైతన్య రెడ్డి తో పాటు టిడిపి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ,కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి లు పులివెందులలో ప్రచారం చేసి టిడిపి అభ్యర్ధి విజయం కోసం కష్టపడ్డారు . ప్రచారంలో బిజెపి నేత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తో పాటు పలువురు  బిజెపి నాయకులు కూడా పాల్గొన్నారు.  వీరితోపాటు కూటమిలో ఉన్న మరి కొందరు నాయకులు , కార్యకర్తలు గట్టిగా ప్రయత్నం చేశారు.


ఒంటిమిట్ట లోనూ టిడిపి విజయం కేతనంతో  ఉమ్మడి కడప జిల్లాలో తన సత్తా ఏంటో తెలుగుదేశం నిరూపించుకుంది. సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో ని 10 స్థానాల్లో ఏడు స్థానాలను కూటమి విజయం సాధించింది. పులివెందులతో పాటు ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో కూడా టిడిపి అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఇక్కడ టిడిపి, వైసిపిల మధ్య రసవత్తర పోరు జరిగినట్టు అనిపించినా, వైసీపీ నాయకులు ఆశలు పెట్టుకొని గట్టిగా ప్రయత్నించినా గెలుపు వారికి దరిదాపుల్లో లేకుండా పోయింది .టిడిపి అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి భారీ మెజార్టీ లభించింది. వైసిపి అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి 6,513 ఓట్లు మాత్రమే రాగా టిడిపి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12,780ఓట్లు వచ్చాయి. దీంతో టిడిపి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6267ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఒంటిమిట్టలో టిడిపి నాయకులు పడ్డ కష్టాలు, కసరత్తు ఫలించింది . ఒంటిమిట్ట గెలుపు పట్ల  టిడిపి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  పులివెందుల, ఒంటిమిట్ట గెలుపు జిల్లా టిడిపి లో కొత్త ఉత్తేజం నింపింది.

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.