బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు తెలుగుదేశం పార్టీయే పోటీ?

Publish Date:Oct 8, 2024

Advertisement

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి స్పేసే లేదంటూ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ బీరాలు పలికింది. అయితే ఆ పార్టీ ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలన్న ఆశలకు తెలుగుదేశం పార్టీయే గండి కొట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఖమ్మంలో నిర్వహించిన సభకు అశేష జనం  హాజరై ఆ సభను దిగ్విజయం చేశారు.

అప్పటి వరకూ విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం నామమాత్రమన్న భావన సర్వత్రా ఉండేది. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం పార్టీపై ప్రజలలో విశ్వాసం చెక్కు చెదరలేదనీ, క్యాడర్ ఇన్ టాక్ట్ గా తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుని ఉందని చెబుతూ వచ్చారు. కేవలం క్యాడర్ కు దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోవడం వల్లే తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి అంతంత మాత్రమేనన్న భావన ప్రజలలో నెలకొందని తెలుగుదేశం నాయకత్వం నమ్మింది. 2023 డిసెంబర్ లో చంద్రబాబు నాయుడు ఖమ్మం వేదికగా నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన జనసందోహాన్ని చూసి తెలంగాణలే మేమేం తోపులం అని అప్పటి వరకూ భావిస్తూ వచ్చిన బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ ఒక్క సారి ఉలిక్కిపడింది. సరే ఆ తరువాత గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉండటం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. అయితే నాడు ఖమ్మం సభతో తెలంగాణలో తెలుగుదేశం బలం ఏమిటన్నది అందరికీ తెలిసి వచ్చింది. 

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన తరువాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా పార్టీకి పునర్వైభవం తీసుకువస్తానని ప్రకటించారు. అందుకోసం కార్యాచరణ సైతం సిద్ధం చేశారు. తరచూ హైదరాబాద్ వచ్చి రాష్ట్ర పార్టీ పరిస్థితిపై చర్చిస్తాననీ, సమీక్షిస్తాననీ, నెలకొసారి అయినా రాష్ట్రంలో పర్యటిస్తానని చంద్రబాబు చెప్పారు.  దీంతో వివిధ కారణాలతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని వీడి వేర్వేరు పార్టీలలో సర్దుకున్న వారిలో పలువురు నేతలు సొంత గూటికి రావడానికి ఉత్సాహం చూపుతున్నారు. వీరిలో అత్యధికులు ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నవారే కావడం  గమనార్హం. వీరిలో మొదటిగా హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తాను తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. హైదరాబాద్ లో చంద్రబాబుతో భేటీ అయిన తీగల కృష్ణారెడ్డి ఆ భేటీ అనంతరం తాను తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించడమే కా కుండా రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి చంద్రబాబు మార్గదర్శకత్వంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సంచలన ప్రకటన చేశారు. తీగలే కాకుండా మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా ఉన్నారు. తన మనవరాలి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించడానికే ఆయనను కలిసినట్లు చెప్పినా.. మల్లారెడ్డి కూడా త్వరలో తెలుగుదేశం గూటికి చేరుతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షపదవికి ఆయన కూడా రేసులో ఉండే అవకాశం ఉందంటున్నారు. వీరే కాకుండా నందిగం కృష్ణారావు వంటి వారు కూడా బీఆర్ఎస్ ను వీడి సైకిలెక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.  

ఈ సందర్భంగా పరిశీలకులు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ చెక్కు చెదరలేదని, తెలంగాణ ఉద్యమ వేడి, తెలంగాణ సాధించుకున్న సంబరాల మధ్య జరిగిన 2014 ఎన్నికలలో కేడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 20పైగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న సంగతిని గుర్తు చేస్తున్నారు.  ఇప్పుడు కూడా తెలంగాణ సంతుల్య అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిందేనన్న అభిప్రాయం తెలంగాణ సమాజంలో ఉందని చెబుతున్నారు. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి అంతా  ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే  జరిగిందని గుర్తు చేస్తున్నారు.  హైటెక్ సిటీ,సైబరాబాద్ వంటివి చంద్రబాబు పాలనలోనే వచ్చాయని చెబుతున్నారు.   

 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పటి టీడీపీ నాయకుడే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్టీఆర్, బాబు మంత్రివర్గాలలో పనిచేసారు. ఈనాటి తెలంగాణ నాయకుల్లో అత్యధికులు ఒకప్పటి టీడీపీ నుంచివచ్చినవారే. వారి మాతృసంస్థ టీడీపీ నే.

తెలంగాణను పీడిస్తున్న పటేల్,పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా ఎన్టీఆర్ తెలంగాణ ప్రజల అభిమానాన్ని పొందారు. ఇక చంద్రబాబు వచ్చిన తరువాత ఐటీ పరిశ్రమ అభివృద్ధి జరిగి మధ్యతరగతి ప్రజలను ఉన్నత స్థాయికి ఎదిగారు. సైబరాబాద్ నిర్మాణంతో నగరం విస్తరణలో పాటు సాంకేతిక పెరిగింది. పర్యాటక ప్రాంతంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఉపాధి ఇచ్చే కామధేనువుగా మారింది. ఆ విషయాన్ని తెలంగాణ సమాజం మరచిపోలేదు. అందుకే జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు తెలంగాణలో చంద్రబాబుకు మద్దతుగా వెల్లువెత్తిన ఆందోళనలు రాష్ట్రంలో తెలుగుదేశంకు ఉన్న మద్దతును, బలాన్ని చాటాయి. ఇప్పుడు చంద్రబాబే స్వయంగా తెలంగాణలో పార్టీ పునర్వైభవానికి పిలుపునిచ్చారు. ఆయన పిలుపుతో పలువురు నేతలు సైకిలెక్కేయడానికి సిద్ధపడ్డారు. ముందు ముందు మరింత మంది తెలంగాణ నేతలు హోం కమింగ్ అంటూ ప్రస్తుతం వారు ఉన్న పార్టీలను వదిలి తెలుగుదేశం గూటికి చేరడం ఖాయమని తీగల కృష్ణారెడ్డి మాటలను బట్టి అవగతమౌతోంది.  తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రానున్న రోజులలో మారనున్నాయని, వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు గట్టి పోటీ ఇచ్చేది తెలుగుదేశం పార్టీయేనని అంటున్నారు. 

ఇది కూడా చదవండి.. తెలంగాణలో తెలుగుదేశం.. అదే ఆదరణ.. అదే ప్రభంజనం

By
en-us Political News

  
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.