కడప కోటలో తెలుగుదేశం పాగా?

Publish Date:Apr 5, 2024

Advertisement

కడప రాజకీయాలపై వైఎస్ కుటుంబం ముద్ర బలంగా ఉంది. అందుకే  వైసీపీ ఆవిర్భావం నుంచీ కడప ఆ పార్టీకి పెట్టని కోటగా మారింది. అంతకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి వెంటే నడిచిన జిల్లా ఆయన తరువాత జగన్ వెంట నడుస్తూ వస్తోంది. వైఎస్ మరణం వరకూ కడప జిల్లా మొత్తం వైఎస్ వెనుకే నిలబడిందని చెప్పవచ్చు. ఆయన మరణం తరువాత అంతటి మద్దతు జిల్లాలో వైసీపీకి లభించింది. ఇందుకు జగన్ వైఎస్ రాజకీయవారసుడిగా కడప జిల్లా వాసులు భావించడమే కారణం.

రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో అంటే 2014లో కడప జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ కేవలం ఒక్క రాజం పేట స్థానం నుంచే విజయం సాధించింది.  2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఆ ఒక్క స్థానం కూడా దక్కలేదు. వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మరి 2024 ఎన్నికలలో పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నకు 2019 ఎన్నికల కంటే తెలుగుదేశం బెటర్ గా పెర్ఫార్మ్ చేసినా జిల్లాపై పట్టు మాత్రం వైసీపీదేనని పరిశీలకులు అంటున్నారు. కడప మినహా మిగిలిన రాయలసీమ జిల్లాలన్నిటిలో తెలుగుదేశం గట్టిగా పుంజుకుంటే కడప జిల్లాలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి పెద్దగా మెరుగుపడినట్లు కనిపించదు. గత ఎన్నికలలో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించడంలో విఫలమైన తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలలో ఒకటి రెండు స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వేలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికలలో కడప జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలుచుకుంటుందని చెప్పదగ్గ నియోజకవర్గం ఒక్క మైదుకూరు మాత్రమేనని సర్వేలు చెబుతున్నాయి. అలాగే రాజంపేట, కమలాపురం నియోజకవర్గాలలో వైసీపీకి గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.  అయితే  కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతుండటంతో జిల్లాలో వైసీపీ ఏదో ఒక మేరకు నష్టపోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. 

వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల బరిలోకి దిగడంతో రాష్ట్రంలోనే ఈ సీటు హాట్ సీట్ గా మారిపోయింది. జగన్ కు స్వయానా చిన్నాన్న అయిన వైఎస్ వివేకా హత్య విషయంలో వివేకా కుమార్తె సునీత, జగన్ కు సొంత చెల్లెలు అయిన షర్మిలను ముక్తకంఠంతో అవినాష్ దోషి అని ఆరోపిస్తూ, అటువంటి వ్యక్తికి జగన్ అండగా నిలబడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత బాబాయ్ ను కిరాతకంగా హత్య చేసిన వ్యక్తులకు వత్తాసుగా నిలబడిన జగన్ కు, ఆయన పార్టీకీ ఓట్లు వేయవద్దంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా షర్మిలే అవినాష్ కు ప్రత్యర్థిగా కడప బరిలో దిగడంతో.. ఆమె వైసీపీ ఓట్లను ఏ మేరకు చీల్చుతారన్నదానిపై కడప లోక్ సభ నియోజకవర్గ ఫలితం ఆధారపడి ఉంటుంది.  మొత్తం మీద గత ఎన్నికలలో లా జీరో స్థానంతో సరిపెట్టుకోవడం కాకుండా తెలుగుదేశం బలంగా పుంజుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి.  

By
en-us Political News

  
అడ్డ కత్తెరలో పోక చెక్క అనే సామెత అతికినట్లు అక్షరాలా సరిపోయే ఏకైక దేశం పాకిస్తాన్. ఎందుకంటే 2026 నోబుల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడ్ని ఎంపిక చేయాలని శనివారం (జూన్ 21) అన్న పాకిస్థాన్ ఆదివారం (జూన్ 22) మాట మార్చేసింది.
జగన్ కి శవరాజకీయాలే కలిసివస్తున్నాయా అంటు? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. జగన్ తండ్రి మరణం ద్వారా వెలుగులోకి వచ్చారు. వైఎస్సార్ బతికి ఉంటే ఆయన రాజకీయాల్లో ఇంతగా కనిపించేవారు కారని అంటారు.
ధనిక రాష్ట్రంగా మొదలైన తెలంగాణ.. లక్షల కోట్లు అప్పుల పాలైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రేపు జరిగే మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
వైసీపీ అధినేత జగన్ కారు డ్రైవర్‌ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి నల్లపాడు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
హైదరాబాద్‌‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆస్పత్రి ఛైర్మన్‌ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పైలాన్‌ను ఆవిష్కరించారు.
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండపై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై గిరిజన సంఘాలు ఫిర్యాదు చేశాయి.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ పురోగతి సాధించింది. టెర్రరిస్టులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
మాజీ సీఎం జగన్ ఇటీవల గుంటూరు జిల్లా సత్తెనపల్లి పర్యటనలో రోడ్డు సింగయ్య అనే వ్యక్తి మృతి షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
కాంగ్రెస్ ని బేసిగ్గా ఖాన్.. గ్రెస్ అని అంటారు. ఎందుకంటే ఈ పార్టీ తొలి  నుంచి ముస్లిం ప్రీతి  పాత్ర‌మైన పార్టీగానే పేరు సాధిస్తూ వ‌చ్చింద‌ని చెబుతారు.
ఈ ప్ర‌పంచానికి ఏదో అయ్యింది. త‌న చేతుల‌కు ఇన్నేసి ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ను అంటించుకుంటోన్న ట్రంప్ ని ఏకంగా నోబుల్ శాంతి బ‌హుమ‌తికి అది కూడా పాకిస్థాన్న లాంటి ఉగ్ర పిశాచ దేశం ప్ర‌తిపాదించ‌డం అంటే. ఈ
ట్యాపింగ్ వ్య‌వ‌హారం కేసీఆర్ అండ్ కోని మ‌రింతగా వెంటాడేలా తెలుస్తోంది. రీసెంట్ గా ప్ర‌ణీత్ రావును విచారించింది సిట్. ఆరు వంద‌ల మంది ప్రొఫైల్స్ ఎలా త‌యారు చేశారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి మనుషులు తనను వెంబడించారని వివేకా హత్య కేసులోని ఎం -2 నిందితుడు సునీల్ యాదవ్ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.