Publish Date:Nov 16, 2013
క్రమశిక్షణకు మారుపేరుగా ప్రజల నుంచి ప్రశంసలు అందుకునే తెలుగుదేశం పార్టీలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు చేదోడు వాదోడుగా వుండే ఎర్రబెల్లి దయాకరరావు ఈమధ్యకాలంలో పార్టీ క్రమశిక్షణ గీతను దాటడం ఎవరూ ఊహించని పరిణామంగా అందరూ భావించారు.
తన సహచరులు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాదరావు మీద ఎర్రబెల్లి ఘాటైన పదజాలంతో విరుచుకుపడటం పార్టీలో ఆందోళనకు కారణమైంది. ఏవైనా సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకునే తెలుగుదేశం పార్టీలో మీడియాకెక్కి విమర్శించుకునే కాంగ్రెస్ పార్టీ తరహా సంస్కృతి బయల్దేరడాన్ని ఎవరూ హర్షించలేకపోయారు. పార్టీకి విధేయుడిగా వుండే ఎర్రబెల్లి తన పొరపాటును దిద్దుకుంటారని అందరూ భావించారు. ఈ విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకోకపోయినా పరిస్థితి సర్దుకున్న వాతావరణం ఏర్పడింది.
అయితే తాజాగా ఎర్రబెల్లి మరోసారి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మీద ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడటం, ఇది వారిద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీయడం, ఇద్దరూ వ్యక్తిగత విమర్శల వరకూ వెళ్ళడంతో ఈ అంశంలో చంద్రబాబు జోక్యం చేసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. ఏదైనా సమస్య ఏర్పడితే దాన్ని పార్టీలో చర్చించి పరిష్కరించుకోవాలే తప్ప ఇలా మీడియాకెక్కి తిట్టుకోవడం భావ్యం కాదని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. పార్టీలో అంతర్గత క్రమశిక్షణా రాహిత్యం పెరిగిపోతోందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతున్న సమయంలో చంద్రబాబు రంగంలోకి దిగడం మంచి పరిణామమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
పార్టీలో సీమాంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య తలెత్తుతున్న విభేదాల విషయంలో చంద్రబాబు ఇంతవరకూ జోక్యం చేసుకోకపోవడం వల్లే నాయకులు కట్టు తప్పుతున్నారని, ఇప్పుడు చంద్రబాబు రంగంలోకి దిగడం వల్ల ఇలాంటి వివాదాలకు ఫుల్స్టాప్ పడే అవకాశం వుందని భావిస్తున్నారు. ఇకముందు ఎర్రబెల్లి మీడియాకెక్కి విమర్శలు చేసే అవకాశం వుండదని తెలుగుదేశం పార్టీలో భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-mlas-cold-war-39-27514.html
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.