మహానాడు గ్రాండ్ సక్సెస్.. ఇక కడప జిల్లా టీడీపీకి అడ్డా : సీఎం చంద్రబాబు

Publish Date:May 29, 2025

Advertisement

 

కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడప టీడీపీ మహానాడుగ ముగింపు సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఎన్నోసార్లు కడపకు వచ్చానని.. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీ మహానాడుకు రావడం చూసి కొండంత ధైర్యం వచ్చిందన్నారు. కడపలో మహానాడు పెడితే చాలామంది అనుమానించారని సీఎం అన్నారు. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అని నిరూపించేందుకే మహానాడు ఇక్కడ పెట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని గడపలో జరిగిందని.. రెస్పాన్స్ అదిరిందన్నారు. మహానాడు సూపర్ హిట్ అయ్యిందని అన్నారు. కడప రాజకీయం మారబోతోందని.. కడప గడపలో మార్పు కనిపిస్తుందని గత ఎన్నికల ప్రచారంలో చెప్పానన్నారు. అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని  కొనియాడారు. 

ఈ ఎన్నికల్లో కడపతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన విజయం సాధించామన్నారు. ఉమ్మడి కడపలో పదికి ఏడు స్థానాలు గెలిచామని చెప్పుకొచ్చారు. ఇప్పటి నుంచి కష్టపడితే 2029 ఎన్నికల్లో పదికి పదికి స్థానాలు గెలుచుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.  జూన్‌ 12 నాటికి 500 సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. వాట్సప్‌లో హాయ్‌ అని పెడితే పనులు జరుగుతాయి. 2027 డిసెంబరు నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. దేశానికి ఉగ్రవాదుల వల్ల చాలా నష్టం. రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం. ఆర్థిక ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తాం. రాజకీయాల ముసుగులో ల్యాండ్‌, శాండ్‌, మైన్స్‌ దోచేశారు. 

డ్రగ్స్‌, గంజాయి అమ్మితే అదే చివరి రోజని హెచ్చరిస్తున్నా. ఆడబిడ్డల జోలికి వస్తే అవే వారికి అంతిమ గడియలు. గత పాలనలో భూతానికి పరిశ్రమలు వెనకడుగు వేశామన్నారు. భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నామని హామీ ఇచ్చా. రాష్ట్రాన్ని గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత నాది. రాయల సీమను రాష్ట్రానికి మణిహారంగా మారుస్తాం. రాయలసీమ అభివృద్ధికి బ్లూప్రింట్‌ ఉంది. ఆరు నెలల్లో కడప హజ్‌హౌస్‌ పూర్తి చేస్తాం. కర్నూలుకు హైకోర్టు బెంచ్‌ తప్పకుండా వస్తుంది. జూన్‌ 12లోగా కడపలో రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ పనులు ప్రారంభిస్తాం’’ అని సీఎం ప్రకటించారు. ప్రజలకు డబ్బులతో పాటు ఆరోగ్యం ఉంటేనే నిజమైన అభివృద్ధిని తెలిపారు.

By
en-us Political News

  
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్ కుమార్ కీలక ప్రకటన సమాచారం వెల్లడించారు.
మొన్నామ‌ధ్య కేసీఆర్ మాగంటి నివాసానికి వ‌చ్చి ఆయ‌న బంధువుల‌ను ప‌ర‌మార్శించిన విష‌యం గుర్తుందా?  అప్పుడు కేసీఆర్ ఎంత ప్ర‌శాంతంగా ఉన్నారో.. ఇప్పుడు కాళేశ్వ‌రం క‌మిష‌న్ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైన‌పుడు కూడా సేమ్ అలాగే ఉన్నారు. మీడియా క‌ళ్ల‌న్నీ కేసీఆర్ పైనే. కానీ కేసీఆర్ మాత్రం ఏ మీడియానూ చూడ‌లేదు. ఎవ‌రికీ ఎలాంటి బైట్ ఇవ్వ‌లేదు.
సుప్రీంకోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావుకి ఊరట లభించింది. రాజధాని మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో  సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిలు కోరుతూ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంను ఆశ్రయించారు.
వైసీపీ అధినేత జగన్ సమయం సందర్భం లేకుండా ప్రదర్శిస్తున్న దూకుడు విమర్శలపాలవుతోంది. వాస్తవానికి పార్టీ ఓటమి తర్వాత జగన్ ప్రజల్లోకి రావడమే అరుదైపోయింది. ఇటీవల తెనాలిలో దళిత యువకుల పరామర్శ పేరుతో బయటకు వచ్చి వైసీపీని మరింత డ్యామేజ్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారిలో త‌న భ‌ర్త‌ను క‌ల‌వ‌డానికి రాజ‌స్థాన్ నుంచి యూకే వెడుతున్న నూత‌న వ‌ధువు ఖుష్బూ ఒక‌రు.
విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు మోడీ సంతాపం ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం (జూన్ 13) అహ్మదాబాద్ చేరుకున్నారు
విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాధ. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. రాజస్థాన్ కు చెందిన ప్రతీక్ జోషి గత ఆరేళ్లుగా లండన్ లోనే పని చేస్తున్నారు.
అహ్మదాబాద్ లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిన దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మందితో పాటు, విమానం కూలిన ప్రదేశంలోని నివాస భవనాల్లో ఉన్న పలువురు మరణించిన సంగతి తెలిసిందే.
అహ్మ‌దాబాద్ విమాన ప్రమాదంలో 8200 గంటల విమాన ప్రయాణం అనుభవం ఉన్న పైలట్ సుమిత్ సభర్వాల్, అలాగే కోపైలట్ కో పైలట్ క్లైవ్ కుంద‌ర్ మరణించారు. ఈ ఘోర విమాన ప్రమాదంలో 298 మంది చనిపోయారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటంతో భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు. శుక్రవారం (జూన్ 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది.
జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.