తెలుగుదేశం మహానాడు తోలి రోజు సూపర్ హిట్

Publish Date:May 28, 2025

Advertisement

తెలుగుదేశం పెద్ద పండుగ మహానాడు ఈ సారి కడపలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి రోజు మంగళవారం (మే26) పూర్తిగా పార్టీ అజెండాలపైనే సాగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు లోకేశ్  తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం,   స్త్రీశక్తి,  పేదల సేవలో సోషల్‌ రీఇంజినీరింగ్‌, అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత అన్న ఆరు శాసనాలను ప్రతిపాదించారు. అలాగే పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే నిలబడింది, ప్రజల కోసమే పని చేసిందని చెప్పారు. నాలుగు దశాబ్దాల పైబడిన తెలుగుదేశం ప్రస్థానంలో పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ పార్టీ జెండాను వదల కుండా మోసిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పిన లోకేష్.. మరో నాలుగు దశాబ్దాలు పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించేందుకు అవసరమైన అంశాలపై మహానాడు వేదికగా సమగ్ర చర్చ జరగాలన్నారు.

ఇక పార్టీ అధినేత చంద్రబాబు అయితే  పార్టీ పటిష్ఠత, రాష్ట్రఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తన ఆలోచనలు, ప్రణాళికలను తొలిరోజు మహానాడు వేదికపై ఆవిష్కరించారు.  అదే సమయంలో చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కూడా గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తేడాలను కళ్లకు కట్టారు. ఇక కార్యకర్తల విషయంలో జగన్ అధికారంలో ఉన్నసమయంలో ఒకలా.. అధికారం కోల్పోయిన తరువాత మరోలా మాట్లాడుతున్న తీరును చక్కగా ఎండగట్టారు.  అదే సమయంలో తెలుగుదేశం కార్యకర్తల నిబద్దత, పోరాటాలు, త్యాగాలను గుర్తు చేసుకోవడమే కాకుండా.. పార్టీ కోసం కార్యకర్తలు చేసిన త్యాగాలను వృధాకానివ్వబోమని భరోసా ఇచ్చారు. అయితే అది ఒట్టి భరోసా మాత్రమే కాదని ఇప్పటికే ఆచరణలో చేసి చూపడంతో కార్యకర్తలలోనే కాదు, ప్రజలలోనూ వారి పట్ల విశ్వసనీయత పెరిగింది.  మొత్తం మీద మహానాడు తొలి రోజు సూపర్ సక్సెస్ అయ్యింది. రాష్ట్రం నలుమూలల నుంచీ తరలి వచ్చిన కార్యకర్తల ఉత్సాహం ఇనుమడింప చేసేలా పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఇతర నాయకులు, మహానాడు వేదికగా చేసిన తీర్మానాలు ఉన్నాయి. 

By
en-us Political News

  
సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీ తల్లికి వందనం పథకాన్ని తెలుగుదేశం కూటమి సర్కార్ గురువారం (జూన్ 12) నుంచి అమలు చేయనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టి గురువారం నాటికి సరిగ్గా ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని ఆరంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. హైదరాబాద్‌ జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
జగన్ సొంత మీడియా చానెల్ లో చర్చ సందర్భంగా అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు వీవీఆర్‌ కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) ఆదేశించింది.
మంత్రి పదవి దక్కక పోవడంతో తీవ్ర నిరాశ లో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి . ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రి వర్గ విస్తరణ ఎట్టకేలకు ఇటీవల జరిగింది. అది కూడా పాక్షికంగానే. తెలంగాణ క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో మూడు స్థానాలను అధిష్టానం భర్తీ చేసింది.
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జారి పడి గాయపడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరామర్శించారు.
జగన్ పొదిలి పర్యటన రసాబాసగా మారింది. పోగాకు వేలం కేంద్రం సందర్శన అంటూ పొదిలిలో పర్యటించిన జగన్ కు నిరసనల సెగ గట్టిగా తగిలింది.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేష్‌కు పార్టీపరంగా ప్రమోషన్ ఎప్పుడు?..అనే ప్రశ్న ఇప్పుడు అటు పార్టీలోను...ఇటు రాజకీయ వర్గాల్లో ఇంట్రస్టింగ్ టాపిక్‌గా మారిపోయింది. లోకేష్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా ప్రకటించాలని మహానాడు వేదికగా టీడీపీ నేతలు ప్రతిపాదనలు పెట్టారు.
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుకలలో డ్రగ్స్ వినియోగం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. మంగ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ రంగరెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామ శివారులో మంగళవారం (జూన్ 10) రాత్రి జరిగాయి.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచి బయలుదేరి ఆయన నేరుగా బీఆర్కే భవన్ కు చేరుకున్నారు.
ముందు వెనుకలాలోచించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడి.. ఇప్పుడు అరెస్టు భయంతో ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు జర్నలిస్టు కృష్ణంరాజు.
మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే విధించింది.
వైఎస్ జగన్ హయాంలో ఏపీ ఐటీ శాఖ మంత్రిగా వెలగబెట్టిన గుడివాడ అమర్నాథ్ గుడ్డు కథ ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురైంది. గుడివాడ అమర్నాథ్ కు గుడ్డు మంత్రి అన్న బిరుదును కూడా సంపాదించుకున్నారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సర్వాధికారి.. అందులో సందేహం లేదు. ఇప్పుడే కాదు.. పార్టీలో ఆయనకు ఏ పదవీ లేనప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులకు ఆయన మాటే వేదం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.