ఏపీలో పొత్తుల గోల..!!

Publish Date:Aug 23, 2018

Advertisement

 

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పనిచేసాయి.. కానీ తరువాత పరిస్థితులు మారిపోయాయి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తుపెట్టుకుంటే, బీజేపీ నమ్మించి మోసం చేసిందంటూ టీడీపీ, బీజేపీ కి దూరమైంది.. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతుంది.. ఇక జనసేన కూడా టీడీపీ పాలన సంతృప్తికరంగా లేదంటూ టీడీపీకి దూరమైంది.. దీంతో వచ్చే ఎన్నికల్లో అసలు ఏ పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? అని ఇప్పటినుండే చర్చలు మొదలయ్యాయి.

 

 

ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ తో పొత్తుకి సిద్దమైందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే కొందరు ఈ పొత్తుని తప్పుపడుతున్నారు.. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ, అలాంటిది ఇప్పుడదే కాంగ్రెస్ తో ఎలా కలుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.. కానీ టీడీపీ శ్రేణులు మాత్రం దీనికి ధీటైన సమాధానం చెప్తున్నాయి.. టీడీపీ, తెలుగు వారికి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి పుట్టిన పార్టీ.. అప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేసింది కాబట్టి కాంగ్రెస్ మీద పోరాడం.. ఇప్పుడు విభజన హామీల విషయంలో బీజేపీ అన్యాయం చేసింది కాబట్టి బీజేపీ మీద పోరాడుతున్నాం అంటున్నారు.. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలు అన్నీ కేంద్రం చేతుల్లో ఉన్నాయి.. ప్రధాన జాతీయ పార్టీలు ఉంది రెండు బీజేపీ, కాంగ్రెస్.. బీజేపీ ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇస్తానంటుంది.. మరి అలాంటప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో కలిస్తే తప్పేంటని కొందరు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. అయితే కాంగ్రెస్ తో పొత్తు విషయంపై తుది నిర్ణయం మాత్రం చంద్రబాబుదే అని స్పష్టం చేస్తున్నారు.. రాజకీయాల విశ్లేషకులు మాత్రం ఈ పొత్తు వల్ల రెండు పార్టీలకు లాభమే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. తెలంగాణాలో అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్ కు, టీడీపీ ఓటు బ్యాంకు కూడా తోడైతే అధికారంలోకి వచ్చే అవకాశం పెరుగుతుంది.. అలాగే విభజన అనంతరం ఏపీలో ఒక్క సీట్ గెలవని కాంగ్రెస్ ఇప్పుడు కాస్త బలపడింది.. గత ఎన్నికల్లో 7 లక్షలు ఓట్లు సాధించిన కాంగ్రెస్, ఈ సారి 15 నుండి 20 లక్షల ఓట్లు సాధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. ఇది టీడీపీకి ఉపయోగపడుతుందనేది విశ్లేషకుల భావన.

 

 

మరోవైపు బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీల పొత్తుల గురించి చర్చలు జరుగుతున్నాయి.. వైసీపీ ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తరువాత కానీ బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్టు చర్చలు జరుగుతున్నాయి.. అయితే దీన్ని మూడు పార్టీలు ఖండిస్తున్నాయి.. కానీ కొందరు నేతలు మాత్రం పొత్తు గురించి సంకేతాలు ఇస్తున్నారు.. గతంలో, పవన్ వచ్చే ఎన్నికల్లో జగన్ కి మద్దతిస్తారని సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసారు.. తాను పవన్‌ను చాలా దగ్గరగా గమనించానని, ఆయన విజన్ ఉన్న నాయకుడని చెప్పిన వరప్రసాద్.. త్వరలో వైసీపీ, జనసేనలు కలుస్తాయని అభిప్రాయపడ్డారు.. దీనిబట్టి చూస్తుంటే పొత్తు ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. చూద్దాం మరి అసలు ఈ పొత్తుల గోల మీద క్లారిటీ రావాలంటే ఎన్నికల సమయం రావాల్సిందే.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.