బీజేపీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక లెక్క.. నెల్లూరులో ఒక లెక్క

Publish Date:Nov 7, 2019

Advertisement

 

భారతీయ జనతా పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకెత్తయితే నెల్లూరులో మాత్రం మరో ఎత్తు అని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ప్రస్తుతం నెల్లూరు బీజేపీలో రెట్టింపు ఉత్సాహం నెలకొంది, జిల్లాకు చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడు ఓ సాధారణ ఏబివిపి కార్యకర్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఉపరాష్ట్రపతి వరకు ఎదిగారు. సింహపురికి తిరుగులేని పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టారు. జిల్లాకు చెందిన చాలా మంది నేతలకు రాష్ట్ర పదవవులు ఇప్పించారు. కాని, నెల్లూరులో బీజేపీ బలోపేతానికి కృషి చేసినా జిల్లాలో అంతగా పార్టీ పుంజుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల కార్యకర్తలు ప్రజల ఆలోచనల్లో అనూహ్యంగా మార్పులొస్తున్నాయట. మెల్లమెల్లగా కమలం పార్టీకి దగ్గరయ్యే వారి సంఖ్య పెరుగుతోందట. అందుకే ఇప్పుడు నెల్లూరులో భారతీయ జనతా పార్టీకి ఒకప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరుగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

నెల్లూరు జిల్లా ప్రజలు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పదికి పది సీట్లు ఇచ్చారు. అయితే ప్రభుత్వ నిర్ణయాల పట్ల ప్రజల్లో నిరాసక్తి కనిపిస్తోందని వినికిడి. మరోవైపు ప్రత్యక్ష దాడులు ఆ పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితులకు టిడిపి నుంచి సపోర్ట్ కూడా అంతగా లేదన్న భావనతో వారిలో పలువురు బిజెపి వైపు చూస్తున్నారని తెలుస్తోంది. టిడిపిలో ఎంతో కాలం పని చేసిన వారికి అక్కడ సరైన ఆదరణ కరువవడంతో బిజెపిలో చేరుతున్నారట. అలాంటి వారికి కమలం పార్టీ ముఖ్య నేతలు అండదండలు అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు టిడిపికి మైనస్ గా కనిపిస్తుండగా మరోవైపు అవే బిజెపికి ప్లస్ గా మారుతున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. కావలిలో టిడిపి ఓట్లు వేసినవారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చివేసినప్పుడు బిజెపి నేతలే అండగా నిలిచారు. ఈ విషయంలో కమలం పార్టీ నాయకుల మధ్య పోటీ నెలకొంది, పార్టీ కార్యక్రమాలు ప్రజా పోరాటాల్లో వారు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

సీనియర్ నేత కందుకూరి వెంకట సత్యనారాయణకు జాతీయ స్థాయిలో పలుకబడి ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న పోటీతత్వంతో ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో సుమారు నూట ఎనభై కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. గాంధీజీ సంకల్ప యాత్రలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఈ పాదయాత్రకు మంచి స్పందనే వచ్చింది. దీంతో కమలం పార్టీ కేడర్ లో జోష్ పెరిగింది, స్థానిక నాయకులతో పాటు జిల్లాకొచ్చిన నేతలు వయసు మీద పడినా లెక్క చేయక పాదయాత్రను విజయవంతం చేశారన్న టాక్ వినిపించింది.

ఇదిలా ఉండగా కాంగ్రెస్, టిడిపిల్లో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఇటీవలే బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో వాకాటికి పెద్ద సంఖ్యలోనే అనుచరులున్నారు, వారంతా ఇప్పుడు టచ్ లోకి రావడమే కాకుండా బిజెపి లోకి వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన అనుచరులు చాలా మంది బీజేపీ కండువాలు కప్పేసుకున్నారు, పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తుండటంతో అతి తక్కువ కాలంలోనే పార్టీలో కుదురుకున్నారు. దీంతో జిల్లాలోని తీరం వెంబడి తడ నుంచి సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, కోవూరు, కావలి వరకు పార్టీ ఓ రేంజ్ లో పుంజుకున్నట్టు కనిపిస్తోంది. 

ఇక బిజెపి నుంచి గతంలో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసిన కొండపల్లి గురవయ్యనాయుడు వంటి పాతతరం నేతలు కూడా ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అవుతున్నారు. జిల్లా నేతలతో కలిసి మెట్ట ప్రాంతాల్లోనూ కమలం పార్టీని పటిష్టం చేసేందుకు సన్నాహాలు మొదలెట్టారు. మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి విషయానికొస్తే ఉదయగిరిలో గత ఎన్నికల్లో పోటీ చేసిన గుండ్లపల్లి భరత్ కుమార్ జోష్ కొనసాగిస్తున్నారు. ఇక ఆత్మకూరు వెంకటగిరి లోనూ పార్టీ అభివృద్ధికి జిల్లా ముఖ్య నేతలు, పాతతరం నేతలు గట్టిగానే కృషి చేస్తున్నారు. ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి అమిత్ షాని ఆత్మకూరుకు తీసుకొచ్చి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. 

ఇటీవల నెల్లూరుకు వచ్చిన ఎంపీ సుజనా చౌదరి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణలు జిల్లాలో పార్టీ బలపడుతుండటాన్ని చూసి ముచ్చట పడ్డారు. వారు లోలోపల చాలా ఆనందపడ్డారట. ఇదే జోష్ తో ముందుకు సాగితే పార్టీకి తిరుగే ఉండదని, ప్రాంతీయ పార్టీల వల్ల కలిగే నష్టాలను అధిగమించటానికి గాంధీజీ ఆశయాలను కొనసాగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలు సూచించారట. మొత్తం మీద నెల్లూరు జిల్లాకు సంబంధించి గతంలో బిజెపిలో చేరికలు పెద్దగా ఉండేవి కావు కానీ, ఇప్పుడు కార్యకర్తల దగ్గర నుంచి నేతల వరకు చేరికలు బాగా పెరిగాయి. ఆ పార్టీకి ఇది శుభ పరిణామమే ఇదే విధంగా ముందుకెళ్తే పార్టీకి మంచి రోజులే ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

By
en-us Political News

  
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.