ఆదివారమా... విధ్వంస వారమా?

Publish Date:Jun 19, 2022

Advertisement

ఏపీలో ప్రభుత్వ అరాచకం పరాకాష్టకు చేరుకుంది. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల విషయంలో హద్దులు చెరిపేసి చెలరేగిపోతోంది. ప్రభుత్వ విధానాలను విమర్శించినా, ప్రజా సమస్యలపై గళమెత్తినా ఖబడ్డార్ అంటూ ఇళ్లపైకి  బుల్ డోజర్ పంపించే విధానానికి తెరతీసింది.   కేసులకు భయపడటం లేదని భావించిందో ఏమో ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా విపక్ష నేతల నివాసాల కూల్చివేతలకు తెగబడుతోంది. రాజకీయ ప్రత్యర్థుల నివాసాలను బుల్ డోజర్లతో కూల్చివేయడానికి సిద్ధ పడుతోంది. తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడి నివాసంపైకి అధికారులు తెల్లవారు జామున బుల్ డోజర్ తో వచ్చి ఆయన ఇంటి కాంపౌండ్ వాల్ ను కూల్చేశారు.

రెండు సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నివాసాన్ని నిర్మించుకున్నారన్న ఆరోపణలతో అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారు. నోటీసులు ఎప్పుడో ఇచ్చిమని చెబుతున్నారు. అయితే అయ్యన్న పాత్రుడి కుమారులు మాత్రం నోటీసులు అందలేదనీ, కూల్చివేత అనంతరం తాము నోటీసులేవి అని అడిగితే పాత తేదీతో నోటీసును తీసుకువచ్చి గోడకు అంటించారనీ చెబుతున్నారు. అలాగే ఆక్రమణ విషయంలో కూడా అధికారులు చెబుతున్న మాటలలో తడబాటు కనిపిస్తోంది. 0.2 సెంట్లని ఒకసారి, రెండు సెంట్లు అని ఒకసారి చెబుతున్నారు.

అసలు ఆక్రమణ ఎంత, ఎప్పుడు ఆక్రమించారు. ఆక్రమణకు సంబంధించి సర్వే ఎప్పుడు చేశారు వంటి వివరాలు అడిగినా కూడా అధికారులు చెప్పడం లేదు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు దాగున్న ఇంటిని భద్రతా దళాలు చుట్టుముట్టిన రీతిలో నర్సీపట్నంలోని అయ్యన్ప పాత్రుడి ఇంటిని అధికారులు, పోలీసులు అలా చుట్టుముట్టారు. ఇంటి కూల్చివేత సంగతి తెలియగానే పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు అయ్యన్ప పాత్రుడి నివాసానికి చేరుకున్నాయి. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగాయి. అక్కడే టెంట్ వేసి ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం అధినేత సహా పలువురు తెలుగుదేశం నాయకులు ప్రభుత్వ చర్యన ఖండించారు. రాష్ట్రం కోసం, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ను పోలవారంగా మార్చి ప్రతి వారం సందర్శించి పనులను పరుగులు పెట్టిస్తే.. జగన్ అందుకు భిన్నంగా ఆదివారం విధ్వంస వారంగా  మార్చి విపక్ష నాయకుల ఇళ్ల ధ్వంసానికి పాల్పడుతున్నారని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.

ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలపై పోరాడుతున్న అయ్యన్ప పాత్రుడిపై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గూండా రాజుగా ఏపీ సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని,  జగన్ పాలనలో ఆగడాలు, అకృత్యాలు కోకొల్లలుగా జరుగుతూ పోలీసుల అతిప్రవర్తనకు అదుపు లేకుండా పోయింది. నేరస్థుడు రాజ్యం ఏలితే ఎన్ని అనర్ధాలు చోటు చేసుకొంటాయో, అరాచక శక్తుల అరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయో ఆర్ధిక వ్యవస్థ ఏ విధంగా నాశనమవుతుందో తెలియడానికి జగన్ మూడేళ్ల పాలనే ఉదాహరణ అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

జగన్ యూపీలోని యోగి ని ఆదర్శంగా తీసుకుని బల్ డోజింగ్ విధానాన్ని ఏపీకి తీసుకు వచ్చారని తెలుగుదేశం శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఆదివారం తెల్లవారు జామున ఏదో శత్రుదేశం మీదకు యుద్ధానికి వెళుతున్న రీతిలో పోలీసు బలగాలను మోహరించి.. నివాసం కూల్చివేతకు ఉపక్రమించారని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇక రాజకీయ పరిశీలకులు కూడా ఈ కూల్చివేతను ఖండిస్తున్నారు. నిజంగా ఆక్రమణ ఉంటే అనుసరించాల్సిన పద్ధతి ఇది కాదని అంటున్నారు. ఇవ్వని నోటీసులను పాత తేదీలతో సృష్టించి మరీ కూల్చివేతలకు పాల్పడటం అంటే ప్రభుత్వ అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు.   చట్ట విరుద్ధంగా, ఇష్టారీతిన  కూల్చివేతలకు పాల్పడడానికి వీల్లేదని సుప్రీం కోర్టు విస్పష్ట ఆదేశాలు ఉన్నా,   జగన్ ప్రభుత్వం ఖాతరు చేయకుండా రాజకీయ ప్రత్యర్థులకు చెందిన నివాసాలు, భవనాల కూల్చివేతకు పాల్పడుతోందని అంటున్నారు.   నర్సీ పట్నంలోని అయ్యన్న పాత్రుడి నివాసంపైకి బుల్ డోజర్ తో వచ్చిన అధికారులు ఇంటి వెనుక వైపు ప్రహారీ గోడను కూల్చివేశారు. అయ్యన్న పాత్రుడి కుటుంబ సభ్యులు అడ్డుకోవడం, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. ఇదంతా చూసి బుల్ డోజర్ డ్రైవర్  అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరో డ్రైవర్ కోసం ప్రయత్నించినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అధికారులు చేసేదేమీ లేక మిన్నకున్నారు. అయితే తెలుగుదేశం శ్రేణులు అక్కడ నుంచి కదల లేదు. కూల్చివేతకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు దిగి వచ్చి ఇంటి సర్వేకు అంగీకరించారు. దీన్ని బట్టే అర్థమౌతోంది సరైన సర్వే జరపకుండానే అధికారులు ఆక్రమణ జరిగిందంటూ కూల్చివేతకు తయారైపోయారనీ, ఇందుకు  ప్రభుత్వంలో పై స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని.

By
en-us Political News

  
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-19
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొన్నటి ఎన్నికల ముందు కూడా రాజశ్యామల యాగం చేశాడు.. ఏమైంది? చెత్తగా పరిపాలించడం వల్ల దారుణంగా ఓడిపోయాడు. ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అవబోతోంది.
చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా షిర్డీ సాయిబాబాను సందర్శించుకున్నారు.
సీబీఐ, ఈడీ చాలా పవిత్రమైన, అమోఘమైన తేదీ అయిన జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ, జగన్‌కి తమ సత్తా చూపించడానికి అవసరమనవన్నీ ‘సిద్ధం’ చేసుకుంటున్నాయి.
ఈ-ఆఫీస్‌ని అప్‌గ్రేడ్ చేయడం వల్ల జగన్ ప్రభుత్వం చేసిన అక్రమాలు సమాధి అయ్యే ప్రమాదం వుంది.
తెలంగాణలో చాలావరకు వేడి తగ్గింది. వాతావరణం చల్లబడింది. ఈనెల మొదటి వారంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని చోట్ల 47 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి. వాతావరణం చల్లబడటంతో 40 డిగ్రీలకు పడిపోయింది. ఉపరితల ఆవర్తనమే కారణమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అవర్తనం ఏర్పడమే దీనికి కారణం. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు కురవనున్నాయి.
చంద్రగిరి నుంచి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విశాఖపట్నంలో వెయ్యి కోట్ల స్కామ్ చేశాడు. అక్రమ మైనింగ్‌తో  అందినంత దండుకున్నాడు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ సరళిని బట్టి తెలుగుదేశం భారీ విజయం సాధించడం ఖాయమన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా స్వయంగా నిర్వమించుకున్న పోస్ట్ పోల్ సర్వే ఫలితం కూడా భారీ విజయాన్ని ఖరారు చేసిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
ఎపిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ మామూలుగా లేదు. ఈ సారి పిఠాపురం లోకసభ స్థానం నుంచి పోటీ  చేస్తున్న పవన్ కళ్యాణ్ టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. ఆయన సెక్యురిటీ గార్డ్ ఇంటిపై దాడి జరగడం చర్చనీయాంశమైంది. 
సాధారణంగా ఓట్ల పండుగ పట్ల అర్బన్ ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపరు. ఇన్నేళ్లుగా మనం చూస్తున్న ట్రెండ్ అదే. అయితే అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి అర్బన్ ఓటింగ్ భారీగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 81.80 శాతం పోలింగ్ నమోదైంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఇది రెండు శాతం అధికం.
తెనాలి ప్రస్తుత ఎమ్మెల్యే, ఘోర పరాజయం పాలవబోతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కేవలం ఫైట్ మాస్టరే అని ఇప్పటి వరకూ అనుకుంటూ వచ్చాం కదా.. ఆయన కేవలం ఫైట్ మాస్టర్ మాత్రమే కాదు.. కథ, స్క్రీన్ ప్లే, మాటల రచయితగా కూడా మంచి టాలెండెడ్ అని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. 
ఎపి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోజరిగిన శాంతిభద్రతల సమస్యలు ఇప్పట్లో సమసే అవకాశం  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో వైసీపీ, టీడీపీ నేతలు కార్యకర్తల మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.