Publish Date:Jul 12, 2022
పూర్వం ఎన్టీఆర్ను ఎంతో ప్రేమగా తమ వాడిగా చేసుకుని ఎన్టీవోడు అన్నారు యావత్ ఆంధ్రాజనం. 99 ప్రపంచకప్ విజయం తర్వాత ధోనీ పేరుతో ట్యాటూలు వేయించుకున్నారు అమ్మాయిలూ, క్రికెట్ పిచ్చా ళ్లు. అభిమానానికి, వీరాభిమానానికి పెద్ద తేడా లేకపోవచ్చుగాని, దాన్ని తెలియజేయడంలో మాత్రం చాలా తేడా చూపుతారు సదరు వీరాభిమానులు. వీరాభిమానులు రాజకీయనాయకులకూ వుంటారు. ప్రస్తుతం అంతటి వీరాభిమాని అభిమాన వర్షంలో తడిసి ముద్దై పలుకించిపోతున్నది మాత్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబు అనే అనాలి.
తమ నాయకుడు ఓ చిన్నపాటి మంచి పని చేస్తే కటౌట్కి పాలాభిషేకం చేసేస్తున్నారు ఈ రోజుల్లో. అలాం టిది ఆంధ్రాలో మళ్లీ అధికారంలోకి రావడానికి పార్టీని నాలుగింతలు ఉత్సాహపరిచి కదం తొక్కుతున్న చంద్రబాబు పట్ల ఇంకెంతటి వీరాభిమానం వుండాలి. తమ నాయకుడు తప్పకుండా రాష్ట్ర ప్రజానీకానికి గొప్ప మేలు చేస్తాడన్ననమ్మకం కుదరాలేగాని వీరాభిమానానికి అంతుండదు, ఉత్సవాలు చేసుకుంటా రు, స్వీట్లు పంచుకుంటారు, వూరూరా భారీ ప్రచారానికి దిగుతారు. వీటికి దేనికీ నాయకుడినో, పార్టీ వర్గా లనో డబ్బులిమ్మని అడగరు.. వాళ్ల సొంత ఖర్చుతోనే అన్నీ చేస్తారు. దీన్ని పిచ్చనండి, మరేదయినా అనండి.. అసలు పేరు మాత్రం వీరాభిమానం.
అదుగో అలాంటి వీరాభిమానం మరో పేరు కృష్ణ. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ మళ్లీ అధి కారంలోకి రావాలని కలలు గనడమే కాదు, అది సాకారమయ్యే వరకూ గొప్ప కఠోర దీక్ష చేస్తున్నాడు. వీర తాడు వేసుకున్న కృష్ణ అందుకు ఒక వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నాడు. విజయవాడ కు చెందిన కృష్ణ అనే టీడీపీ కార్యకర్త ప్రజా చైతన్య సైకిల్ యాత్ర చేపట్టారు. విజయవాడ నుండి హిందూపురం వరకు చేపట్టిన సైకిల్ యాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం సంగంకి చేరాడు. సైకిల్ కి టీడీపీ జెండాలు కట్టుకుని.. ప్రత్యేకంగా బోర్డు లు ఏర్పాటు చేసుకుని యాత్ర చేస్తున్నాడు. దర్మపరిపాలన కావాలి టీడీపీ గెలవాలి అనే నినాదం తో యాత్ర చేపడుతున్నట్లు తెలిపాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ సైకిల్ యాత్ర కొనసాగిస్తానని పేర్కొన్నాడు. నాయకుడి కంటే వీరాభిమానే గొప్పవాడు, నాయకుని విజయానికి ఇలాంటి వీరాభిమాని కఠోర దీక్ష శక్తినిస్తుంది. ఈ శక్తి అపారమైనది. ఇలాంటి శక్తులు రాష్ట్రంలో ఎల్లవేళలా పార్టీకి కొత్త వూపిరినిచ్చి ముందడుగు వేయిస్తుంది. శభాష్ కృష్ణ! జయహో టిడీపీ! అన్నదే ఇప్పుడు తెలుగుదేశం శ్రేణుల నినాదం అయ్యింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-fan-cycle-tour-till-babu-becoms-cm-25-139572.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.