Publish Date:Jul 12, 2022
పూర్వం ఎన్టీఆర్ను ఎంతో ప్రేమగా తమ వాడిగా చేసుకుని ఎన్టీవోడు అన్నారు యావత్ ఆంధ్రాజనం. 99 ప్రపంచకప్ విజయం తర్వాత ధోనీ పేరుతో ట్యాటూలు వేయించుకున్నారు అమ్మాయిలూ, క్రికెట్ పిచ్చా ళ్లు. అభిమానానికి, వీరాభిమానానికి పెద్ద తేడా లేకపోవచ్చుగాని, దాన్ని తెలియజేయడంలో మాత్రం చాలా తేడా చూపుతారు సదరు వీరాభిమానులు. వీరాభిమానులు రాజకీయనాయకులకూ వుంటారు. ప్రస్తుతం అంతటి వీరాభిమాని అభిమాన వర్షంలో తడిసి ముద్దై పలుకించిపోతున్నది మాత్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబు అనే అనాలి.
తమ నాయకుడు ఓ చిన్నపాటి మంచి పని చేస్తే కటౌట్కి పాలాభిషేకం చేసేస్తున్నారు ఈ రోజుల్లో. అలాం టిది ఆంధ్రాలో మళ్లీ అధికారంలోకి రావడానికి పార్టీని నాలుగింతలు ఉత్సాహపరిచి కదం తొక్కుతున్న చంద్రబాబు పట్ల ఇంకెంతటి వీరాభిమానం వుండాలి. తమ నాయకుడు తప్పకుండా రాష్ట్ర ప్రజానీకానికి గొప్ప మేలు చేస్తాడన్ననమ్మకం కుదరాలేగాని వీరాభిమానానికి అంతుండదు, ఉత్సవాలు చేసుకుంటా రు, స్వీట్లు పంచుకుంటారు, వూరూరా భారీ ప్రచారానికి దిగుతారు. వీటికి దేనికీ నాయకుడినో, పార్టీ వర్గా లనో డబ్బులిమ్మని అడగరు.. వాళ్ల సొంత ఖర్చుతోనే అన్నీ చేస్తారు. దీన్ని పిచ్చనండి, మరేదయినా అనండి.. అసలు పేరు మాత్రం వీరాభిమానం.
అదుగో అలాంటి వీరాభిమానం మరో పేరు కృష్ణ. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ మళ్లీ అధి కారంలోకి రావాలని కలలు గనడమే కాదు, అది సాకారమయ్యే వరకూ గొప్ప కఠోర దీక్ష చేస్తున్నాడు. వీర తాడు వేసుకున్న కృష్ణ అందుకు ఒక వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నాడు. విజయవాడ కు చెందిన కృష్ణ అనే టీడీపీ కార్యకర్త ప్రజా చైతన్య సైకిల్ యాత్ర చేపట్టారు. విజయవాడ నుండి హిందూపురం వరకు చేపట్టిన సైకిల్ యాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం సంగంకి చేరాడు. సైకిల్ కి టీడీపీ జెండాలు కట్టుకుని.. ప్రత్యేకంగా బోర్డు లు ఏర్పాటు చేసుకుని యాత్ర చేస్తున్నాడు. దర్మపరిపాలన కావాలి టీడీపీ గెలవాలి అనే నినాదం తో యాత్ర చేపడుతున్నట్లు తెలిపాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ సైకిల్ యాత్ర కొనసాగిస్తానని పేర్కొన్నాడు. నాయకుడి కంటే వీరాభిమానే గొప్పవాడు, నాయకుని విజయానికి ఇలాంటి వీరాభిమాని కఠోర దీక్ష శక్తినిస్తుంది. ఈ శక్తి అపారమైనది. ఇలాంటి శక్తులు రాష్ట్రంలో ఎల్లవేళలా పార్టీకి కొత్త వూపిరినిచ్చి ముందడుగు వేయిస్తుంది. శభాష్ కృష్ణ! జయహో టిడీపీ! అన్నదే ఇప్పుడు తెలుగుదేశం శ్రేణుల నినాదం అయ్యింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-fan-cycle-tour-till-babu-becoms-cm-25-139572.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.