ఉదయగిరి తెలుగుదేశం అభ్యర్థిగా బీసీకి చాన్స్

Publish Date:Jan 18, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు  కొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈ స్థితిలో  ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయం రసకందాయంలో పడింది. పెద్దారెడ్ల సామ్రాజ్యంగా ఉండే నెల్లూరులో ఇప్పుడు సమీకరణాలు మారుతున్నాయా అంటూ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో సాధారణంగా రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగుతుంది.

అయితే ఈ సారి పార్టీల అధినాయకులు బీసీల వైపు చూస్తున్నారు. ప్రధానంగా  ఉదయగిరి  అసెంబ్లీ నియోజకవర్గ   అభ్యర్థుల విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైఎస్‌ జగన్‌   నాయకత్వంలోని వైసీపీ అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి   పోటీ   దాదాపుగా ఖరారైంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గం నుంచి బలమైన అభ్యర్థి కోసం అన్వేషణలో భాగంగా బీసీ అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వైసీపీ నుంచి బహిష్కృతుడై తెలుగుదేశం గూటికి చేరిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి పోటీకి దూరంగా ఉంటానన్న సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బీసీ వర్గానికి చెందిన బీద రవీంద్ర పేరు ప్రస్తావించినప్పటికీ, ఆయన కూడా పోటీలో నిలవడానికి సుముఖత వ్యక్తం చేయలేదని అంటున్నారు. దీంతో తెలుగుదేశం నుంచి ఉదయగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి ఇద్దరు బీసీ నేతలు రేసులో నిలిచారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో ఒకరైన చంచల్ బాబు యాదవ్ అయితే వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి దీటైన అభ్యర్థిగా నిలవగలుగుతారా అన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

అదే సమయంలో ఈ సీటులో పోటీ కోసం రేసులో నిలిచిన రెండో వ్యక్తి డాక్టర్ మల్లికార్జున రావుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.  ప్రభుత్వ వైద్యుడిగా పని చేసి రిటైర్ అయిన డాక్టర్ మల్లికార్జున రావు రిటైర్మెంట్ తరువాత నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ వైద్యశాలను నిర్వహిస్తున్నారు. అలాగే ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. అన్నిటికీ మించి యాదవ సామాజిక వర్గంలో ఆయనకు మంచి పేరు ఉంది.  ఒక్క ఉదయగిరి అనే కాకుండా మరో రెండు నియోజకవర్గాలలో కూడా బీసీ అభ్యర్థులను రంగంలోకి దింపాలన్న యోచనతో తెలుగుదేశం కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  మొత్తం మీద రానున్న ఎన్నికలలో ఉమ్మడి నెల్లూరు జిల్లలో బీసీ కార్డ్ ద్వారా సత్ఫలితాలు పొందాలని తెలుగుదేశం యోచిస్తుంటే.. జగన్ పార్టీ కూడా జిల్లాలో బీసీలకు పెద్ద పీట వేసే యోచనలో ఉందని అంటున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ కన్ఫర్మ్ అయ్యిందంటున్నారు.  

By
en-us Political News

  
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.