మహానాడుతో తెదేపా అందోళనలతో వైకాపా బిజీ

Publish Date:May 26, 2013

Advertisement

 

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు నేటినుండే రెండు రోజుల పాటు సమావేశాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. కాకతాళీయంగా ఒకే సమయంలో జరుగుతున్న ఆ రెండు పార్టీల కార్యక్రమాలు వేర్వేరు ఆలోచనలతో నిర్వహింపబడుతున్నట్లు పైకి కనిపిస్తున్నపటికీ, వాటి అంతిమ లక్ష్యాలు మాత్రం ఒక్కటే! రాబోయే ఎన్నికలకి పార్టీని సిద్దం చేసుకోవడం.

 

తొమ్మిది ఏళ్ళుగా ప్రతిపక్ష బెంచీలకు అంకితమయిపోయిన తెదేపా, మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలను ఎదుర్కోనున్నందున, పార్టీ విజయం సాధించడానికి తగిన వ్యూహ రచనలు చేసుకోవడం ఈ రెండు రోజుల మహానాడు ప్రధాన ఉద్దేశ్యం.

 

ఇక, అక్రమాస్తుల కేసులో అరెస్ట్ కాబడిన జగన్ మోహన్ రెడ్డి జైలులో నిర్బంధించబడి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు నిరసనలు, ఆందోళనలు చేపడుతోంది. రాబోయే ఎన్నికలలోగా అయన జైలు నుండి విడుదల అనుమానంగా ఉన్నందున, ఈ సందర్భంగా ఆందోళనలు నిర్వహించి ప్రజలలో జగన్ పట్ల సానుభూతి మరింత పెంచుకొని, అంతిమంగా దానిని ఓట్ల రూపంలోకి మార్చుకోవాలని వైకాపా ఆలోచన.

 

రాబోయే ఎన్నికలు తేదేపాకు జీవన్మరణ సమస్య వంటివి గనుక ఆ అగ్నిపరీక్షలో తన సర్వ శక్తులు ధారపోసి విజయం సాదించేందుకు అవసరమయిన ఆయుధాలను ఈ సమావేశాలలో సిద్దం చేసుకోబోతోంది. ఆ ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ప్రజలకు చేసిన వాగ్దానాన్నిటికీ ఆమోదం తెలుపుతూ ఈ సమావేశాలలో ఒక తీర్మానం ఆమోదించనున్నారు.

 

అదే విధంగా తెలంగాణా అంశంపై స్పష్టమయిన ఒక ప్రకటన చేయాలని కేసీఆర్ విసిరిన సవాలుని స్వీకరించి, తెలంగాణాపై మరికొంత స్పష్టత ఇచ్చి ఆ ప్రాంతంపై కూడా తిరిగిపట్టు సాధించాలని తెదేపా ఆశిస్తోంది.

 

ఇక, దూకుడు మీద ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన నిత్య నూతన పధకాలతో ప్రజలలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేఖ భావనల తీవ్రతను క్రమంగా తగ్గించి, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను తారుమారు చేసే ప్రయత్నాలు గట్టిగానే చేస్తునందున ఆయనను ఎదుర్కోవడానికి తగిన వ్యూహాలు సిద్దం చేసుకోవాల్సి ఉందని తెదేపా గ్రహించింది.

 

ఇక, క్రిందటి సారి ఎన్నికలలో తమ విజయానికి చిరంజీవి సైంధవుడిలా అడ్డుపడితే, రాబోయే ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి అడ్డుపడబోతున్నాడని గ్రహించిన తెదేపా, అతనిని ఎదుర్కొనేందుకు తగిన వ్యుహాలను సిద్దం చేసుకోకతప్పదు.

 

అయితే, సాదారణంగా ఇటువంటి కార్యక్రమాలను తన బల ప్రదర్శనకు మాత్రమే ఉపయోగించుకొనే తెదేపా, ఊక దంపుడు ప్రసంగాలు, విపక్షాలపై విమర్శలు, ఏవో కొన్ని మొక్కుబడి తీర్మానాలతో తన సహజ సిద్దమయిన ఆర్భాట ప్రదర్శనకే ఈ వేదికను ఉపయోగించు కొనే అవకాశం ఉంది.

 

వైకాపా కోటి సంతకాల కార్యక్రమయినా, విజయమ్మ రచ్చబండ కార్యక్రమయినా, షర్మిల పాదయాత్రయినా, నేటి నిరసన కార్యక్రమలయినా అన్నిటి ప్రధాన లక్ష్యం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూ అక్రమాస్తుల కేసులో జైలులో నిర్బందించబడ్డ జగన్ మోహన్ రెడ్డి పట్ల ప్రజలలో వ్యతిరేఖ భావనలు ఏర్పడనీయకుండా జాగ్రత్త పడుతూ, ఆయన నిష్కలంక చరితుడు, ప్రజల కోసం పోరాడటం వలనే జైలుకి వెళ్ళిన ఒక మహాయోధుడు, స్వర్గీయ వైయస్సార్ పధకాలను అమలుచేయగల ఏకైక వ్యక్తి అనే సానుకూల భావనలు వ్యాపింపజేసి ప్రజలలో సానుభూతి కొనసాగేలా చేయడమే.

 

ఇక సైన్యాధ్యక్షుడు లేకుండా ఎన్నికల రణరంగంలో అడుగుపెట్టబోతున్న వైకాపా, ఇదే విషయాన్ని తన కార్యకర్తలకి అర్ధం అయ్యేట్లు తెలియజేసి వారిని మానసికంగా సిద్దం చేయడం, అదే సమయంలో జగన్ పట్ల ప్రజలలో సానుభూతిని మరికొంత పెంచడం ఈ రెండు రోజుల కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యాలు.

 

ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఆ రెండు రాజకీయ పార్టీలు తమకు అందుబాటులో ఉన్న ఇటువంటి సందర్భాలను తమకనుకూలంగా వినియోగించుకోవడం సహజమే. కానీ, వాటి ప్రయత్నాలు అవి ఎంతవరకు సఫలం అయ్యాయనే సంగతిని ఎన్నికలలో విజయమే తేలుస్తుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.