సీమాంద్రా ఛాంపియన్ ఎవరు?

Publish Date:May 15, 2014

Advertisement

 

ఇటీవల వరుసగా వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ, తెలంగాణాలో కాంగ్రెస్, తెరాసలలో ఏదో ఒకటి అధికారంలోకి రావచ్చని అర్ధమవుతోంది. ఇవి పట్టణ, గ్రామీణ ఓటర్ల అభిప్రాయాలను సమగ్రంగా ప్రతిబింబించే ఫలితాలు కనుక సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు వీటిని ప్రామాణికంగా తీసుకోవచ్చును.

 

సర్వేలలో సిద్దహస్తుడని పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్, తెలంగాణాలో తెరాస, ఆంధ్రాలో తెదేపా పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావచ్చని జోస్యం చెప్పారు. ఆయన జోస్యం కూడా ఇంచుమించు స్థానిక సంస్థల ఫలితాలకు అనుగుణంగానే ఉంది. కానీ, నిన్న ఎన్డీటీవీ ఛానల్ ప్రకటించిన సర్వే ఫలితాలలో తెలంగాణా విషయంలో ఏకీభవించినా, ఆంధ్రాలో మాత్రం వైకాపాకి తెదేపాపై స్వల్ప ఆధిక్యత రావచ్చని ప్రకటించింది. తెదేపాకు 75-95అసెంబ్లీ, 13యంపీ సీట్లు, వైకాపాకు 80-100 అసెంబ్లీ, 12యంపీ సీట్లు రావచ్చని ప్రకటించింది.

 

మొన్న వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంది. ఆ ఫలితాలలో తెదేపా పట్టణ ప్రాంతాలతో బాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా స్పష్టమయిన ఆధిక్యత కనబరచగా, గ్రామీణ ప్రాంతాలలో తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తుందని భావించిన వైకాపా ఆశించినంతగా ఫలితాలు రాబట్టలేకపోయింది. ఏ పార్టీ అయినా అన్ని ప్రాంతాలలో సరిసమానంగా ఓట్లు సాధించగలిగినప్పుడే విజయావకాశాలు ఉంటాయి. కానీ వైకాపాకు రెండు ప్రాంతాలలో ఏ ఒక్క చోట కూడా తెదేపాపై ఆధిక్యత చూపలేకపోయింది.

 

వరుసపెట్టి జరిగిన మూడు స్థానిక సంస్థ ఎన్నికలలో తెదేపాకే మొగ్గు చూపిన ప్రజలు, సార్వత్రిక ఎన్నికల సమయానికి అకస్మాత్తుగా మనసు మార్చుకొని వైకాపాకు ఓటు వేసి, జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెడతారని చెప్పడానికి సహేతుకమయిన కారణాలు కనబడటం లేదు. కానీ తెదేపాకే ఓటేస్తారని చెప్పేందుకు చాలా కారణాలే కనిపిస్తున్నాయి.

 

స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే సమయానికి తెదేపా-బీజేపీల మధ్య ఎన్నికల పొత్తులు కుదరలేదు. అందువల్ల ఆ ఎన్నికలలో పడిన ఓట్లు అన్నీ కూడా కేవలం చంద్రబాబు సమర్ధతకు, తెదేపా జెండాకు పడినవిగానే చెప్పుకోవచ్చును. ఆ తరువాత అనేక రాజకీయ పరిణామాలు జరిగాయని వైకాపా నేత మైసూరా రెడ్డే స్వయంగా చెప్పారు. అయితే అవేవీ వైకాపాకు అనుకూలంగా జరిగినవి కావు.

 

తెదేపా-బీజేపీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నాయి. ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోడీతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్లయితే తాను అన్నివిధాల ఆయనకీ సహకరిస్తానని నరేంద్ర మోడీ స్పష్టంగా ప్రకటించారు. నరేంద్ర మోడీ స్వయంగా జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించడం కాకుండా, తాను ప్రధానమంత్రి అవగానే, ఆయనపై కేసుల విచారణను వేగవంతం చేస్తానని విస్పష్టంగా ప్రకటించారు.

 

ఇక పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు వైకాపా సమాధానాలు చెప్పలేక తడబడి ఎదురుదాడికి దిగి ప్రజలలో మరింత పలుచనయింది. ఇవ్వన్నీ వైకాపాకు ప్రతికూలాంశాలే. అయినప్పటికీ, ప్రజలు ఎటువంటి పాలనానుభావం లేని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డికే అధికారం కట్టబెడతారని ఎన్డీటీవీ ఛానల్ వారు ఊహించడం, ఆనందం కలిగించే ఆ ఊహలలో వైకాపా తేలియాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమయినప్పటికీ రేపు ఫలితాలు వెలువడగానే ఈ ఊహాగానాలకు కూడా తెరపడి ఎవరు అసలు సిసలయిన ఛాంపియనో తేలిపోతుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.