సీమంద్రాలో తెదేపా, వైకాపా బలాబలాలు

Publish Date:Apr 9, 2014

Advertisement

 

తెలంగాణాలో నామినేషన్ల పర్వం ముగియడంతో ఇప్పుడందరి దృష్టి సీమాంధ్ర వైపు మళ్ళింది. తెలంగాణాలో వ్యతిరేఖ ఫలితాలు వచ్చినా వాటి వల్ల తెదేపా, వైకాపాలకు పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. కానీ, సీమాంధ్రలో విజయం సాధించలేకపోతే మాత్రం ఆ ప్రభావం చాలా దారుణంగా ఉండవచ్చును. పదేళ్ళపాటు తెదేపా అధికారానికి దూరంగా ఉన్నపటికీ పార్టీ చెల్లాచెదురు కాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకొంటూ వచ్చిన చంద్రబాబుకి ఈ ఎన్నికలలో తప్పని సరిగా గెలవడం అత్యవసరం. లేకుంటే మరో ఐదేళ్ళు ప్రతిపక్ష బెంచీలలో కూర్చొని కాలక్షేపం చేయడం కష్టం. అందువల్ల ఈ ఎన్నికలు ఆయన రాజకీయానుభవానికి, నాయకత్వ లక్షణాలకి కూడా ఒక అగ్ని పరీక్ష వంటివేనని చెప్పవచ్చును.

 

ఇక అనేక సీబీఐ కేసులలో చిక్కుకొని తీవ్రమయిన ఆర్ధిక నేరారోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో రాష్ట్రంలో కూడా చక్రం తిప్పగల విధంగా ఈ ఎన్నికలలో తిరుగులేని మెజార్టీతో గెలిచినపుడే వాటి నుండి క్షేమంగా బయటగలరు. లేకుంటే ఆయనకు మళ్ళీ కేసులు, కోర్టుల సమస్యలు ఎదుర్కోక తప్పదు.

 

ప్రస్తుతం సీమాంధ్రలో తెదేపా, వైకాపాలు రెండూ సమవుజ్జీలుగా కనబడుతున్నాయి. బలమయిన కాంగ్రెస్ నేతలను, బీసీ, యస్సీ, ఎస్టీ వర్గాలను పార్టీలోకి ఆకర్షించడం ద్వారా తెదేపా చాలా బలోపేతం అయింది. ఇక జాతీయ స్థాయిలో విజయావకాశాలు స్పష్టంగా కనబడుతున్న బీజేపీతో పొత్తులు పెట్టుకోవడంతో, ఆ ప్రభావం, మోడీ ప్రభావం మరియు ఆయనతో చంద్రబాబుకి ఉన్న సాన్నిహిత్యం కూడా తేదేపాకు ప్రజలలో అనుకూలతను పెంచాయి. మంచి నాయకత్వ లక్షణాలు, కార్యదక్షత, అపార అనుభవం కలిగిన వారిరువురూ చేతులు కలపడం మరో సానుకూలాంశంగా మారింది. రాష్ట్రానికి మళ్ళీ కొత్త పునాదులు వేయవలసిన ఈ పరిస్థితుల్లో ఇవే అంశాలు తేదేపాకు ప్రత్యేకతను కలిగిస్తున్నాయి.

 

అదేవిధంగా వైకాపా కూడా చాలా మంది కాంగ్రెస్ నేతలను, రెడ్డి, మైనార్టీ వర్గాలను పార్టీవైపు ఆకర్షించగలిగింది. గత రెండు నెలలుగా జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా చేస్తున్న యాత్రల ద్వారా, వివిధ జిల్లాలలో స్థానిక నేతలను చాలా మందిని వైకాపా వైపు తిప్పుకొంటూ, పార్టీని జిల్లా స్థాయి నుండి బలోపేతం చేసుకోగలిగారు.

 

ఇక అన్నిటి కంటే ముఖ్యమయిన అంశం ఏమిటంటే, రాజశేఖర్ రెడ్డి చనిపోయి అప్పుడే దాదాపు ఐదేళ్ళు పూర్తి కావస్తున్నా, జగన్ కుటుంబ సభ్యుల నిరంతర ప్రయత్నాల వలన నేటికీ ఆ సానుభూతిని అదే స్థాయిలో కాకపోయినా, ఇంకా బలంగానే నిలుపుకోగలగడం విశేషం. గనుక ఈ ఎన్నికలలో తప్పనిసరిగా ఆ అంశం వైకాపాకు కొంతమేర ప్రయోజనం కలిగించవచ్చును.

 

అదే విధంగా జగన్ చేసిన సమైక్యాంధ్ర పోరాటంలో నిజాయితీ లేకపోయినా అతనే అసలయిన సమైక్యవాది అని చాల మంది ప్రజలు నమ్మడం వైకాపాకు కలిసి వచ్చే అంశంగా మారవచ్చును. కిరణ్ కుమార్ రెడ్డి చివరి వరకు ఈ విషయంలో అతనికి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, స్వయంక్రుతాపరాధం వల్ల ఆ పేరు పోగొట్టుకొని జగన్ ఆ స్థానం ఆక్రమించుకొనేందుకు అవకాశం కల్పించారు.

 

ఇక చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఇరువురూ కూడా ఏపీయన్జీవోలను తమవైపు ఆకర్షించడంలో విఫలమవడంతో ఇదే అదునుగా జగన్ వారిని తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వారిలో అశోక్ బాబు వంటి కొందరు ముఖ్యనేతలకి జగన్ గనుక టికెట్స్ ఇచ్చినట్లయితే, ఉద్యోగుల ఓట్లు గంపగుత్తగా కాకపోయినా చాల భారీగానే వైకాపా ఖాతాలో జామా అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల బహుశః చంద్రబాబు నాయుడు కూడా ఉద్యోగ సంఘ నేతలకి టికెట్స్ ఇచ్చి పార్టీవైపు ఆకర్షించే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు. ఉద్యోగ సంఘాలు ఏ పార్టీవైపు మొగ్గినా మిగిలిన పార్టీలకి ఆ లోటుని పూడ్చుకోవడం అంత తేలిక కాబోదు.

 

రెండు పార్టీలు ఇదే విధంగా సాగుతూ సమానంగా ఓట్లు చీల్చుకొంటే దానివల్ల వారే కాక ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతారు. ప్రస్తుతం రెండు పార్టీలు సమనవుజ్జీలుగా కనబడుతున్నప్పటికీ, ఎన్నికలు దగ్గర పడే నాటికి అవి వేసే ఎత్తులు జిత్తులతో వాటిలో ఏదో ఒకటి కొంచెం ముందంజ వేయవచ్చును. అందువల్ల నిత్యం వెలువడుతున్న అనేక సర్వే నివేదికలు ఏదో ఒక పార్టీకి మెజార్టీ వస్తుందని చెపుతున్నపటికీ, అసలు సంగతి మాత్రం చివరి వారంలోనే చూచాయగా తెలియవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.