పన్నులు తెలంగాణకు.. సమస్యల తలనొప్పులు ఏపీకీనా?

Publish Date:Aug 11, 2025

Advertisement

తెలుగు చిత్రపరిశ్రమ తీరు పట్ల ఏపీలో ఆగ్రహం

 మీ ఇంటికొస్తే ఏమిస్తావ్.. మాయింటి కొస్తే ఏం తెస్తావ్ అన్నట్లుగా ఉంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దల తీరు. ఔను తెలుగు సినీ పరిశ్రమ తీరు అడ్డగోలుగా ఉంది. పన్నులన్నీ తెలంగాణ ప్రభుత్వానికి కడతాం.. మా సమస్యలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించాలంటూ దబాయిస్తున్నట్లుగా కనిపిస్తోంది.  . ఉండేది తెలంగాణ రాజధానిలో ... టాక్స్ లు  కట్టేది అక్కడి ప్రభుత్వానికి, ఎనభై శాతం షూటింగ్ లు జరిపేది కూడా అక్కడే.  పనిచేసే కార్మికులు కూడా80 శాతం మంది తెలంగాణ వారే.  అక్కడ కార్మికులకు కడుపు కాలి ధర్నాలు చేస్తే.. ఏపీ సర్కార్ చర్చలు జరిపి పరిష్కరించాలని కోరుకుంటున్నారు.  అసలు తెలంగాణలో సినీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఏపీకి సండంధం ఏమిటి; ఆ తలనొప్పి ఏపీ ప్రభుత్వానికి ఎందుకు అంట గట్టాలని చూస్తున్నారు? అన్నది అర్థం కాని పరిస్థితి.  

వాస్తవంలోకి వెళ్తే సినీ పరిశ్రమ మొత్తం హైదరాబాద్ లోనే ఉంది. సినిమా వాళ్ళంతా ఉండేది ,జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్, మణికొండ తదితర ప్రాంతాల్లోనే.  నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు ,క్యారెక్టర్ ఆర్టిస్టులు  మొత్తం హైదరాబాద్ లోనే మకాం వేసి ఉన్నారు. కట్టే టాక్స్ లు కూడా ఎనభై శాతానికి పైగా  తెలంగాణ ప్రభుత్వానికే కడతారు. కానీ ఏదైనా సమస్య వస్తే మాత్రం పరిష్కారం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైపు చూస్తారు. అక్కడి సినీ పరిశ్రమకు కష్టం వస్తే..  హైదరాబాదులో సినీ కార్మికులు ధర్నాలు చేస్తుంటే..  ఏపీ ఈ వ్యవహారం పై  ఏపీ ప్రభుత్వం ఒకసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.  తాజాగా  సినీ పరిశ్రమంలో సంక్షోభాన్ని ఏపీ ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అంతా బాగున్నప్పుడు తెలంగాణలో  మకాం వేసి ఉంటారు?  ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం ,ఏపీలోకి వచ్చి  హడావుడి చేసి వెళ్ళిపోతుంటారు.  ఇలాంటి వ్యవహార శైలి ఇటీవల కాలంలో సినీ పరిశ్రమ పెద్దలకు ఎక్కువైపోయింది. తాజాగా ఏపీ ప్రభుత్వం దగ్గరకు నిర్మాతల బృందం వచ్చింది. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కావాలి..   మా సమస్యలు మొత్తం ఏకరువు పెట్టి తెలంగాణలో వచ్చిన సమస్య పరిష్కరించమని  కోరుకుంటామంటూ ఏపీ సినీమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ ను కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.  తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తలెత్తిన సమస్య గురించి సీఎం దృష్టికీ, డిప్యూటీ సీఎం దృష్టికీ తీసుకువెడతానని హామీ ఇచ్చారు. అయితే అసలు ఎక్కడో హైదరాబాదులో జరుగుతున్న ధర్నాలు,సమ్మెల వ్యవహారానికి ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తారు? అసలు ఏదైనా సరే ఎందుకు చేయాలి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అసలు తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడో ఒక సారి వారి అవసరాల కోసం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాలలో షూటింగ్ లు జరుపుకుని వెళ్లిపోడం వినా.. ఇక్కడ మకాం వేయడం కానీ, ఇక్కడ స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు ఏమైనా నిర్మించడానికి కనీసం ప్రతిపాదలైనా చేశారా? అగ్ర హీరోల దగ్గర నుండి ,నిర్మాతల వరకూ మొత్తం హైదరాబాద్ లోనే..  సినిమా రీలీజుల సమయంలో మాత్రం  టికెట్ల రేట్లు పెంచి..  ఏపీ ప్రేక్షకుల జేబులకు చిల్లు పెడతాం అనుమతించండి అంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరడం వినా, వీరు ఏపీకి చేసిందేమిటి?  తమ నివాసాల దగ్గర నుంచి సినీమా వ్యవహారాలు, వ్యాపారాలూ అన్ని హైదరాబాద్ లో చేసుకుంటూ.. టాక్సులు కూడా అక్కడి ప్రభుత్వానికే కడుతూ.. మస్య రాగానే ఏపీ సర్కార్ వద్దకు పరుగులెత్తుకుంటూ వస్తారు.  సమస్య రాగానే ఏపీ, ఏపీ ముఖ్యమంత్రి గుర్తుకు వస్తారు.  . అటువంటి వారి పట్ల ఏపీ ప్రభుత్వం ఎందుకు సానుకూలతతో, సానుభూతితో ఉండాలి? ఎందుకు బాధ్యత తీసుకోవాలి అన్నదే ఇప్పుడు సగటు ఆంధ్రుడి ప్రశ్న. ఏదన్నా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు విరాళాలు ప్రకటించి... మొత్తం ఆంధ్రప్రదేశ్ ను ఆదుకున్నట్లు బిల్డప్ లు ఇవ్వడం తప్ప,  తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకూ ఏపీకి నయాపైసా ప్రయోజనం ఏముందని సగటు ఆంధ్రుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.   ఇలాంటి పరిస్థితుల్లో.. ఇప్పుడు సినీ పరిశ్రమలో తలెత్తిన సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకునే విషయంలో  ఏపీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలి.    , సినీ పరిశ్రమ ఏపీకి  వచ్చే విధంగా,  ఏపీలో స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు నెలకొల్పే విధంగా షరతు విధించాలి. అలా కాకుండా పన్నులు కట్టేది తెలంగాణలో.. సమస్యలు పరిష్కారం అయ్యేది ఆంధ్రప్రదేశ్ లో అన్నట్లుగా వ్యవహరిస్తామంటే మాత్రం పరిశ్రమ సమస్యల విషయంలో ఏపీ ప్రభుత్వం  జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

By
en-us Political News

  
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.