Publish Date:Oct 14, 2024
తమిళనాడులోని కవరైపెట్టై రైల్వే స్టేషన్ దగ్గర శుక్రవారం నాడు జరిగిన భాగమతి ఎక్స్.ప్రెస్ రైలు ప్రమాదంలో కుట్ర కోణం దాగి వుందన్న అనుమానంతో విచారణ జరుగుతోంది. ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందా? సిగ్నలింగ్ వైఫల్యం వల్ల జరిగిందా? కుట్ర కోణమా? ఇతర కారణాలు ఏవైనా వున్నాయా అనే అంశాల మీద ఎన్ఐఏ, రైల్వే భద్రతా విభాగాలు దర్యాప్తు చేస్తున్నాయి. భాగమతి ఎక్స్.ప్రెస్ ప్రధాన లైన్లో కాకుండా లూప్ లైన్లోకి వెళ్ళి గూడ్స్.ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, 15 మందికి పైగా గాయపడ్డారు. రెండు బోగీలు కాలిపోయాయి. మొత్తం పన్నెండు బోగీలు ధ్వసమయ్యాయి. ఈ ప్రమాదంపై విచారణ నిమిత్తం రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. గత సంవత్సరం ఒడిశాలోని బాలాసోర్ దగ్గర జరిగిన రైలు ప్రమాదం తరహాలోనే ఈ ప్రమాదం కూడా జరగడంతో ఏదైనా కుట్రకోణం వుందా అనే అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో రికార్డ్ అయిన డేటా లాగర్ని తీసుకుని, ప్రమాదానికి ముందు ఏం జరిగిందో పరిశీలించారు. భాగమతి ఎక్స్.ప్రెస్కి ముందు మరో ట్రైన్ అదే మార్గంలో వెళ్లింది. అయితే ఆ ట్రైన్ లూప్ లైన్లోకి వెళ్ళలేదు. ఆ ట్రైన్కి, ఈ ట్రైన్కి మధ్య ఏడు నిమిషాల వ్యవధి వుంది. ఈ ఏడు నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందనేది ఇప్పుడు కీలకంగా మారింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో దర్యాప్తు బృందాలు వున్నాయి.
రైలు ట్రాక్ మారడానికి వాడే సిగ్నలింగ్ గేర్, స్విచ్ పాయింట్ని ట్యాంపర్ చేసినట్టు దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. కవరైపేట్టై స్టేషన్కి సమీపంలోనే వున్న పొన్నేరి రైల్వే స్టేషన్లో ఇటీవల పట్టాల ఇంటర్ లాకింగ్ వ్యవస్థను టాంపరింగ్ చేసినట్టు బయటపడటం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో పట్టాలకు సంబంధించిన బోల్టులు, నట్లు మాయమైనట్టు గుర్తించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tamilnadu-train-accident-39-186733.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.