యువ ముఖ్యమంత్రులు సమాజంలో రుగ్మతలను నిర్మూలించడానికి, అన్యాయాలను అరికట్టడానికి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ జనం మన్ననలు పొందడం వంటి ఘటనలు ఎక్కువగా సినిమాలలోనే చూస్తుంటాం. భరత్ అనే నేను, ఒకే ఒక్కడు ఆ కోవలోనివే. ఆ సినిమాలలో హీరో ముఖ్యమంత్రిగా అద్భుతంగా ప్రజా ప్రయోజనాల కోసం చర్యలు తీసుకుని విలన్ల కుట్రలతో కొలువు కోల్పోతే..జనం మళ్లీ సీఎంగా ఆయననే అందలం ఎక్కిస్తారు.
వాస్తవంగా రాజకీయాలలో అటువంటి ఘటనలూ ఉండవూ, అలాంటి డ్రామా పండదు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి తీరు మాత్రం మిగిలిన రాజకీయ నాయకులకు ఒకింత భిన్నంగా ఉంటుంది. సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనంగా కనబడే ఆయన జనం నుంచి వచ్చే ఫిర్యాదులపై క్షణాలలో స్పందిస్తుంటారు. తన విధాన నిర్ణయాలలో విపక్షాలనూ భాగస్వాములను చేస్తుంటారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రుల ఆకస్మిక తనిఖీలతో అధికారులను గాభరా పెడుతుంటారు. వారికి చెమట్లు పట్టిస్తుంటారు. తాజాగా ఒక అనాథ బాలల పాఠశాల నుంచి ఫిర్యాదు రావడంతో ఆకస్మికంగా ఆ పాఠశాలను సందర్శించారు.
సీఎం స్టాలిన్ ఆ పాఠశాలకు వెళ్లే సరికి ఇంకా ఎవరూ విధులకు హాజరు కాలేదు. నిర్ణీత సమయం దాటినా ఎవరూ రాకపోయే సరికి మరో అరగంట పాటు ఆయన వారి కోసం అక్కడే ఎదురు చూశారు. పాఠశాల, హాస్టల్ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. అక్కడ ఉన్న విద్యార్థులనుంచి వివరాలు సేకరించారు. టీచర్లు ఎవరూ సమయానికి రారనీ, హాస్టల్ లో సరైన వసతులు లేవనీ, చివరకు భోజనం కూడా సరిగా ఉండదన్న విద్యార్థుల సమాచారంతో ఆఘమేఘాల మీద చర్యలు తీసుకున్నారు. మొత్తం సిబ్బందిని సస్పెండ్ చేసేశారు. ఏదో సినిమాలో సన్నివేశంలా అనిపించినా... వాస్తవంగా స్టాలిన్ చేసింది అదే. ఈ చర్యతో స్టాలిన్ ప్రజల దృష్టిలో హీరో అయిపోయారు.
ముఖ్యమంత్రి కఠినంగా వ్యవహరించడాన్ని కొనియాడుతున్నారు. అలాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తారని జనం అంటున్నారు. ఏది ఏమైనా తమిళరాజకీయాలలో స్టాలిన్ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనను ఆదర్శంగా తీసుకుంటే బెటర్ అని జనం అనుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tamilnadu-cm-reacts-immediately-tp-peoples-complaints-25-138824.html
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.