తమిళనాడు రాజకీయ అనిశ్చితి ఆంధ్ర, తెలంగాణాలకు వరంగా మారనుందా??

Publish Date:Sep 29, 2014

Advertisement

 

 

జయలలిత జైలుపాలవడంతో తమిళనాడు రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకు ఎంతో కొంత మేలు చేయకపోవని మార్కెట్ నిపుణులు అంచనా వేయడం చూస్తుంటే ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు దొరికిందని సంబరపడ్డట్టుంది. పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో తమిళనాడు రాష్ట్రం చాలా ముందుంది. అందుకే ఆ రాష్ట్రానికి $13బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు తరలివచ్చాయి. ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన ఫార్ట్యూన్-500 కంపెనీలలో నిస్సాన్, ఫోర్డ్, హుండాయ్, మిత్సుబిషి, యమహ, డెల్, డైమ్లర్, డెల్ఫీ వంటి కొన్ని కంపెనీలు తమిళనాడులో అనేక ఏళ్ల క్రితమే తమ సంస్థలను స్థాపించి చాలా సజావుగా వ్యాపారాలు నిర్వహించుకొంటున్నాయంటేనే ఆ రాష్ట్రం పెట్టుబడులకు ఎంత అనువయిన ప్రదేశమో స్పష్టమవుతోంది. అందుకు ప్రధాన కారణం కరుణానిధి నేతృత్వంలోని డీ.యం.కె. పార్టీ, జయలలిత నేతృత్వంలోని ఏ.ఐ.ఏ.డీ.యం.కె.పార్టీలు రాజకీయంగా ఎంత ద్వేషించుకొంటున్నా, తమ విభేదాలు ప్రభుత్వ పాలసీలను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడటమేనని చెప్పవచ్చును. అందుకే అక్కడ ఎన్ని సార్లు ప్రభుత్వాలు మారినా రాష్ట్రంలోకి పరిశ్రమలు, పెట్టుబడుల ప్రవాహం మాత్రం యధాతధంగా కొనసాగుతోంది.

 

కానీ ఇప్పుడు అక్రమాస్తులకేసులో జయలలితకు జైలు శిక్షపడటంతో ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అని వ్యాపార, పారిశ్రామిక వర్గాలలో కొంచెం ఆందోళన మొదలయిందని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు. కానీ జయలలితకు నమ్మినబంటు వంటి పన్నీర్ సెల్వంకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించబడ్డాయి కనుక ఆయన జయలలిత ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలలో ఎటువంటి మార్పులు, చేర్పులు చేసే సాహసం చేయబోరు కనుక రాష్ట్రంలో పెట్టుబడులకు డోకా ఉండబోదని మళ్ళీ వారే శలవిస్తున్నారు.

 

అయితే జయలలితకు బెయిలు దొరుకుతుందా లేదా? ఆమెకు పై కోర్టులు కూడా అదే శిక్షను ఖరారు చేస్తాయా? లేక ఆమె శిక్షను తగ్గిస్తాయా? వంటి అనేక అంశాలు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలపైనే కాదు, పరిశ్రమలు, పెట్టుబడులపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుల అంచనా. రాష్ట్రంలో ఏర్పడిన ఈ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు అభివృద్ధిలో పోటీపడుతున్న ఆంధ్ర-తెలంగాణా రాష్ట్రాలకు ఎంతో కొంత మేలు చేయవచ్చని వారు భావిస్తున్నారు. రెండు రాష్ట్రాలు పోటాపోటీగా చాలా ఆకర్షణీయమయిన ఐ.టీ.,పారిశ్రామిక విధానాలు ప్రకటిస్తుండటం, పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక రాయితీలు, తాయిలాలు ఇవ్వజూపుతుండటం వంటివి, ఇప్పుడు తమిళనాడులో కొత్తగా పెట్టుబడులు పెట్టదలచుకొన్న వారిని పునరాలోచనలో పడేయవచ్చని మార్కెట్ నిపుణుల అంచనా.

కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఈ ఊహాగానాలను తేలికగా కొట్టిపడేస్తోంది. రాజకీయాలకు అతీతంగా తమ ప్రభుత్వ పాలసీలు కొనసాగుతున్నదున, ప్రస్తుత రాజకీయ అనిశ్చితి మార్కెట్లు, పెట్టుబడులు, పరిశ్రమలపై ఎటువంటి ప్రభావము చూపదని దృడంగా నమ్ముతోంది. ఆ వాదనలో కూడా బలం ఉందని చెప్పవచ్చును. ఎందుకంటే ఇన్నేళ్ళలో తమిళనాడు రాష్ట్రంలో అనేక సార్లు ఇటువంటి రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ వాటి కారణంగా ఏనాడూ అక్కడి నుండి పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోలేదు. ఇప్పుడు కూడా అంతేనని ప్రభుత్వ వాదన. పరిశ్రమలు, పెట్టుబడిదారులు కూడా వడ్డించిన విస్తరివంటి తమిళనాడును కాదనుకొని, ఏవిధంగాను స్థిరపడని ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకు బయలుదేరిపోతాయని ఊహించలేము.

 

తమిళనాడు రాష్ట్రంలో ఈ పరిస్థితులు సద్దుమణిగేలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదాను సంపాదించు కోగలిగితే, అది తప్పకుండా తమిళనాట పెట్టుబడులను రాష్ట్రంవైపు ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. ఆ భరోసాతోనే హీరో మోటార్ సైకిల్స్ తయారీ సంస్థ చెన్నైకి అతిసమీపంలో ఉన్న చిత్తూరు జిల్లా శ్రీసిటీలో తమ సంస్థను స్థాపించడానికి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత త్వరగా ప్రత్యేక హోదా సాధించుకోగలదనే అంశం కూడా తమిళనాట పరిశ్రమలు, పెట్టుబడులపై ప్రభావం చూపవచ్చును. ముఖ్యంగా తమిళనాడులో పెట్టుబడులు పెట్టాలా వద్దా? అని ఇంకా ఊగిసలాడుతున్న వారిని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ‘ప్రత్యేక హోదా’ చాలా ఊరిస్తోంది. అందుకే జయలలిత ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దంటూ ప్రధాని మోడీకి లేఖ వ్రాసిన సంగతిని ఈసందర్భంగా నిపుణులు గుర్తుకు చేస్తున్నారు. ఏమయినప్పటికీ ఆంధ్ర, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా తమ కొత్త పాలసీలతో, తాయిలాలతో తమిళనాట పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పవచ్చును.

 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.