రావణకాష్టంలా రగులుతున్న శ్రీలంక సమస్య

Publish Date:Jul 29, 2014

Advertisement

 

శ్రీలంక వ్యవహారాలు భారత రాజకీయాలను చిరకాలంగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడులో రాజకీయపార్టీలు శ్రీలంకతో ముడిపడున్న ఏ సమస్యపైనైనా తక్షణమే స్పందించకపోతే ప్రత్యర్ధ పార్టీ నుండి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుందనే భయంతో, ప్రతీ సమస్యపై తీవ్రంగా స్పందిస్తుంటాయి. గతంలో తమిళ పార్టీలు మద్దతు తీసుకొన్న యూపీయే, ఎన్డీయే ప్రభుత్వాలకు శ్రీలంక వ్యవహారంలో తలబొప్పి కట్టింది. శ్రీలంకలో తమిళ ఉగ్రవాద సంస్థ- యల్.టీ.టీ.ఈ.ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నంలో వేలాది తమిళుల మరణానికి కారకుడయిన ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సేను కూడా నరేంద్ర మోడీ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి అతిధిగా ఆహ్వానించడాన్ని నిరసిస్తూ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ప్రతిపక్ష నేత కరుణానిధి ఇరువురు హాజరుకాకుండా శ్రీలంకపై తమ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని స్పష్టం చేసారు.

 

తమిళనాడుకు చెందిన భారతీయ జాలారులను శ్రీలంక నావికాదళం తరచు అరెస్ట్ చేయడం ఆనక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకు మళ్ళీ వారిని విడిచి పెట్టడం చాలా కాలంగానే జరుగుతోంది. మళ్ళీ మొన్న మంగళవారంనాడు కూడా శ్రీలంక నావికాదళం 50మంది జాలారులు తమ జలాలలోకి ప్రవేశించారంటూ అరెస్ట్ చేసింది. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి పిలుపు అందుకొన్నపుడు, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే సుహృద్భావ సూచనగా అంతవరకు అరెస్ట్ చేయబడిన తమిళ జాలారులందరినీ విడుదల చేసారు. కానీ, ఆ తరువాత ఈ నెలన్నర సమయంలో శ్రీలంక నావికాదళం 93 జాలారులను అరెస్ట్ చేసింది. ప్రభుత్వ ఒత్తిదిమేరకు వారిలో 43మందిని విడుదల చేసినప్పటికీ వారి పడవలు, వలలు వగైరా మాత్రం తిరిగి ఇవ్వలేదు.

 

ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళనాడులో రాజకీయ దుమారం లేపుతోంది. అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ విషయంలో కేంద్రప్రభుత్వం తక్షణమే కలుగజేసుకొని, జాలారులను, వారి పడవలను విడిపించవలసిందిగా కోరుతూ ప్రధాని మోడీకి లేఖ వ్రాసారు. బహుశః ప్రధాని మోడీ కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ జాలరులను, వారి పడవలను విడిపించి ఇవ్వవచ్చును. కానీ రావణకాష్టంలా చిరకాలంగా రగులుతున్న ఈ సమస్యను ఆయన శ్రీలంక ప్రభుత్వంతో మాట్లాడి శాశ్వితపరిష్కారం చేయగలిగినట్లయితే, ఆయనకు తమిళప్రజల దృష్టిలో మరింత గౌరవం పెరుగుతుంది.

By
en-us Political News

  
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.