తమిళ పొత్తులకు.. పురిటి నొప్పులు!

Publish Date:Jun 15, 2025

Advertisement

 

తమిళ నాడు, శాసన సభ ఎన్నికలకు ఇంకా సమయం వుంది. వచ్చే సంవత్సరం  (2026) ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అయితే, రాష్ట్రంలో ఎన్నికల వేడి మాత్రం,ఇప్పటికే భగ్గుమంటోంది. అధికార విపక్షాలు రెండూ, గెలుపే లక్ష్యంగా, ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి.ఎత్తులు, పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా, రాష్ట్రంలో గట్టిగా కాలు మోపేందుకు, శత విధాల ప్రయత్నిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం,ఏపీలో సక్సెస్ అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్’ ఫార్ములాను రీప్లే’ చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసేందుకు, ప్రధాన ప్రతిపక్షం డిఎంకేతో సహా, అధికార అన్నా డిఎంకే  వ్యతిరేక  పార్టీలను, ఏకం చేసేందుకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, స్వయంగా రంగంలోకి దిగారు. 

ముందుగా, రెండు నెలల క్రితమే, అన్నా డిఎంకే, బీజేపీల మధ్య పొత్తు ముళ్ళు వేశారు. అలాగే, సినీ నటుడు విజయ్‌’ స్థాపించిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) తోపాటుగా, పీఎంకే తదితర పార్టీలతో జట్టు కట్టేందుకు, పాత, కొత్త మిత్రులను ఎన్డీఎ కూటమిలోకి తెచ్చుకునేందుకు అమిత్ షా, ఢిల్లీ నుంచే పావులు కదుపుతున్నారు.  అయితే, ఇతర పొత్తుల విషయం ఎలా ఉన్నా, అన్నా డిఎంకే, బీజేపీల మధ్య కుదిరిన పొత్తు విషయంలోనే ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, అమిత్ షా పోరోహిత్యంలో ఉభయ పార్టీల నాయకులూ లాంచనంగా, తాంబూలాలు ఇచ్చి పుచ్చున్నా  పొత్తు పీటలెక్కడం అనుమానమే అంటున్నారు.  ముఖ్యంగా ముందు నుంచి,డిఎంకేతో పొత్తు వద్దని వాదిస్తున్న,రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, అన్నామలై, ఆయన్ని ఓ బూచిల చూస్తున్న డిఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడ పళని స్వామిల, మధ్య సంబంధాలు ఉప్పూ నిప్పుల భగ్గుమంటూనే ఉన్నాయి.


తాజాగా, ఎన్నికల అనంతరం ఎన్డీఎ కూటమి గెలిచినా, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తే లేదని, అన్నా డిఎంకే సర్కారే  కొలువు తీరుతుందని పళనిస్వామి చేసిన ప్రకటన, అందుకు బదులుగా అన్నామలై’ఇచ్చిన కౌంటర్’ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిజానికి,  పళనిస్వామి, పొత్తు కుదిరిన కొద్ది రోజులకే, కూటమి గెలిచినా సంకీర్ణ కుదరదనే సంచలన ప్రకటన చేశారు. కాగా,ఇప్పడు అన్నామలై’  ‘అవునవును..సంకీర్ణ ప్రభుత్వం కాదు,వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’ అంటూ, ఎదురు చురక వేశారు.అంతే కాకుండా, ఆయన మరో అడుగు ముందుకేసి, ఈ సారి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు.అలాగే, రాష్ట్రంలో 2026లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పలేనని, రానున్నది బీజేపీ పాలన మాత్రమేనని చెప్పగలనని అన్నామలై పేర్కొన్నారు. అదలా ఉంటే,ఇరు పార్టీలలో పొత్తు వద్దనే నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని అంటున్నారు.ఈ నేపధ్యంలో, బీజేపీ, అన్నాడిఎంకే పొత్తుకు పురిటి నొప్పులు తప్పవని అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జులై 17న రైల్‌ రోకోకు ఆమె పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి శిద్దారాఘవరావు ఒకప్పుడు తెలుగుదేశంలో కీలక నేత. చంద్రబాబుకి సన్నిహితుడిగా పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. కానీ తెలుగుదేశం 2019 ఎన్నికలలో అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ మాజీ మంత్రిని పెద్దగా పట్టించుకున్న దాఖలులు లేవు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను గురువారం (జులై 3) భేటీ అయ్యారు.
పటాన్ చెరు లోని పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావితం చూపింది. ప్రమాదం జరిగిన తరువాత ఆ కంపెనీ షేర్లు దారుణంగా పతన‌మ‌య్యాయి. 3 రోజుల్లోనే దాదాపు 24 శాతం షేర్ వాల్యూ ప‌డిపోయింది.
ఎంతైనా ట్రంపు ట్రంపే.. ప్ర‌పంచంలో ఉన్న ఎన్నో వివాదాలను ప‌రిష్కరించారు. ఆయ‌న‌కా క్రెడిట్ ద‌క్కాల్సిందే... ఈ మాట అన్నది ఎలాన్ మ‌స్క్. ఇన్నాళ్లూ ఉప్పూ- నిప్పుగా ఉన్న ఈ ఇద్ద‌రూ ఇపుడు కలిసిపోయారా?
వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా పుణె నుంచి గోవా వెడుతున్న ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.
పరిశ్రమలలో వరుస ప్రమాదాలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన అనంతరం మేడ్చల్ లోని ఓ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది.
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని ఓ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఉదయం చెలరేగిన మంటలు ఆలయం ముందున్న చలువ పందిళ్లకు వ్యాపించాయి.
ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారౌతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడి అనాలోచిత నిర్ణయాలతో బీఆర్ఎస్ ములుగులో పట్టు కోల్పోతోంది.
తిరుమల అంటే కోట్లాది మంది హిందువులు మనోభావాలతో ముడిపడిన అంశం. టీటీడీ పై దుష్ప్రచారం పోయినంతగా మంచి బయటకు పోవడానికి కొంత ఆలస్యమవుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ గురువారం (జూలై 3)న పెరిగింది.
శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, టి.బరంపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిప్పన. పురుషోత్తం రెడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్బంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరును దుర్వినియోగం చేస్తూ, కళాకారుల నుంచి లక్షల రూపాయలు తీసుకొని మోసగించిన కేసులో కేటుగాడిని తిరుమల వన్‌ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.