నైతిక విలువలా? అంటే ఏంటి తలసానీ?

Publish Date:Dec 16, 2014

Advertisement

 

తెలంగాణా కోసం ఉద్యమించిన తెరాస నేతలకు, ఉద్యమకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీలో నుండి బయటకు వచ్చి తెరాసలో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావులకు మాత్రం మంత్రి పదవులు కట్టబెట్టారు. నిజానికి వారిరువురూ ఆ షరతు మీదే పార్టీ మారినట్లు వార్తలు వచ్చేయి. తెదేపా తరపున శాసనసభకు ఎంపికయిన తలసాని తదితరులు పార్టీ ఫిరాయించినందుకు వారిపై అనర్హత వేటు వేయాలని తెదేపా కోరడం, స్పీకర్ వారికి నోటీసులు జారీ చేయడం గురించి అందరికీ తెలిసిందే.

 

తెరాసలోకి మారి మంత్రిపదవి సంపాదించుకొన్న తలసాని యాదవ్ ఈ అనర్హత వేటు తప్పించుకొనేందుకు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసారు. లేకుంటే ఆయనపై అనర్హత వేటు పడితే మంత్రి పదవి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అదీగాక ఆయన ఇప్పుడు తెదేపా శాసనసభ్యుడిగా కొనసాగే పరిస్థితి కూడా లేదు. కొనసాగితే ప్రతిపక్షాలకు, ముఖ్యంగా తెదేపా సందించే ప్రశ్నలకు, విమర్శలకు జవాబు చెప్పుకోవడం ఆయనకీ, ప్రభుత్వానికీ కూడా చాలా కష్టమవుతుంది. అందుకే ఆయన మంత్రి పదవి చేప్పట్టే ముందే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసారు. అయితే ఆయన దానికి ‘నైతిక విలువల’ రంగులద్దే ప్రయత్నం చేయడం అందరికీ నవ్వు కలిగిస్తుంది.

 

తను నైతిక విలువలకు కట్టుబడే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసానని ఆయన చెప్పుకొన్నారు. నైతిక విలువల గురించి తను వేరేవారి దగ్గరో పాటాలు నేర్చుకోనవసరం లేదని అన్నారు. మంత్రి పదవి కోసమే పార్టీ ఫిరాయించానని ఎవరేమనుకొన్నా తను పట్టించుకోనని అన్నారు. కానీ తనపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించబోనని ఒక హెచ్చరిక కూడా జారీ చేసారు. చంద్రబాబు కూడా నోరు అదుపులో ఉంచుకొంటే మంచిదని అన్నారు. ఆయన మంత్రి పదవి చేప్పట్టబోతున్నందుకు చాలా ఆనందంపడిన ఆయన తల్లిగారు, తనకు పెద్దకొడుకు వంటి చంద్రబాబు నాయుడికి తన కొడుకు దూరం కావడం తనకు చాలా బాధ కలిగిస్తోందని చెప్పడం గమనిస్తే తలసాని ఏమి కోల్పోయారో అర్ధమవుతుంది.

 

ఆయన మంత్రి పదవి కోసమే తను పార్టీ ఫిరాయించానని ఎవరేమనుకొన్నా తను పట్టించుకోనని చెప్పుకోవడం ద్వారా ఆ ఆరోపణలు నిజమని ఆయనే స్వయంగా దృవీకరిస్తున్నట్లుంది. తనకు సమాజంలో ఈ హోదా, గౌరవం కలిగించిన పార్టీని మంత్రి పదవి కోసమే వీడినప్పుడే ఆయన నైతిక విలువలను తుంగలో తొక్కారు. అటువంటప్పుడు ఆయన నైతిక విలువలు కాపాడేందుకే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసానని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

 

రాజకీయ నాయకులు పార్టీలు మారితే జానాలు ఆశ్చర్యపోయే రోజులు ఎప్పుడో పోయాయి. మారకపోతేనే వారు ఆశ్చర్యపోతుంటారు. అటువంటప్పుడు నైతిక విలువలను కాపాడేందుకే తన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసానని తలసాని చెప్పుకోవడం కూడా అనవసరం. ఇప్పుడు మన రాజకీయ వ్యవస్థలో నేతలు తమను తాము సమర్దించుకొనేందుకు అవసరమయిన కొన్నిమూస పద్దతులు, కొన్ని నిశ్చితమయిన వాదనలు, వాటికి అవసరమయిన పడికట్టు పదాలు అన్నీ సిద్దంగా ఉన్నాయి. కనుక నేతలందరూ ఇటువంటి సందర్భాలలో వాటి నుండి తమకు అవసరమయిన పాయింట్లు, పద్దతులు, పదాలు ఏరుకొని మీడియా ముందుకు వచ్చి తదనుగుణంగా చిలకల్లా వల్లె వేస్తుంటారు. ఆ మూస పద్దతులను, పడికట్టు పదాలను ఉపయోగించడం వలన పెద్దగా విమర్శల బారిన పడకుండా తప్పించుకోగలుగుతున్నారు.

 

తలసాని కూడా అటువంటిదే ‘నా హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకోనేందుకే పార్టీ మారానని’ పద్ధతి ప్రకారం బాగానే చెప్పినప్పటికీ ఈ ‘నైతిక విలువల’ సంగతి ఎత్తడం వల్ల ఇంత ఆలోచించవలసి వచ్చింది. లేకుంటే ఆయనని కూడా నలుగురితో నారాయణ అనేసి ఊరుకొనేవారు.

By
en-us Political News

  
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.