స్వైన్ ఫ్లూకి రాజయ్య బలయ్యారా?

Publish Date:Jan 26, 2015

Advertisement

 

స్వైన్ ఫ్లూ జ్వరాల కారణంగా చాలా మంది ప్రజలు చనిపోయారు. నేటికీ అనేక వందల మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్సలు పొందుతున్నారు. చివరికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఈ స్వైన్ ఫ్లూ భారినపడినట్లు వార్తలు వచ్చేయి. ఈ స్వైన్ ఫ్లూ దెబ్బకి ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న టి.రాజయ్య పదవి కూడా ఊడిపోయింది. అది కూడా చాలా అవమానకరంగా జరిగింది.

 

ఇంత నష్టం, కష్టం తెచ్చిన ఈ స్వైన్ ఫ్లూ ఒక్కరికి మాత్రం ఊహించని అదృష్టం తెచ్చిపెట్టింది. యంపీ కడియం శ్రీహరి మెడలో ఉపముఖ్యమంత్రి హారం వేసిపోయింది. తంతే బూరెల గంపలో పడినట్లు యంపీగా ఉన్న ఆయన తీసుకువచ్చి ఉపముఖ్యమంత్రి కుర్చీలో కూర్చేబెట్టారు.

 

అందుకు ఆయన చాలా సంతోషపడి ఉండవచ్చును. కానీ మొదటి నుండి తెరాసలో ఉంటూ కేసీఆర్ నే అంటిపెట్టుకొని తిరగిన దళితుడయిన రాజయ్యని అసమర్ధుడు అనే ముద్ర వేసి పదవిలో నుండి తొలగించి ఆ స్థానంలో యంపీగా ఉన్న కడియం శ్రీహరిని నియమించడం తెరాస నేతలకు, పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా రాజయ్యకు జీర్ణించుకోవడం చాలా కష్టమే. తెరాసలో అనేకమంది సమర్దులయిన సీనియర్ నేతలు, యం.యల్యేలు చాలా కాలంగా మంత్రి పదవులకు ఆశగా ఎదురుచూస్తుంటే వారినందరినీ కాదని తెదేపా నుండి వచ్చి యంపీగా ఎన్నికయిన కడియం శ్రీహరిని మంత్రి వర్గంలోకి తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది.

 

కానీ ఒకసారి పార్టీలో చేరిన తరువాత పాతవాళ్లు కొత్తవాళ్ళు అంటూ విడదీసి చూడలేమని, అందరూ కూడా సమాన హోదా ఉన్న పార్టీ కార్యకర్తలే అవుతారని ఆయన సర్ది చెప్పుకొన్నారు. గోదావరిలో కలిసే అనేక ఉప నదులను ఏవిధంగా వేరు చేసి చూడాలేమో అదేవిధంగా ఎవరయినా ఒకసారి ఒక పార్టీలో చేరిన తరువాత అందరితో సమాన హోదా పొందుతారని, సందర్భాన్ని బట్టి అవకాశాలు, సమీకరణలు మారుతుంటాయని, ఇది రాజకీయాలలో చాలా సహజమయిన విషయం గనుక అందరూ లైట్ తీసుకోవాలని సర్దిచెప్పారు. కొన్ని పొరపాట్లను సవరించుకోనేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని ఆయన కేసీఆర్ ని వెనకేసుకు వచ్చేరు.

 

ఆయనకు మంత్రి పదవి వచ్చింది కనుక ఆయన ఎన్ని మాటలయినా చెప్పగలరు. కానీ ముఖ్యమంత్రి తరువాత స్థానంలో ఉన్న రాజయ్యను అసమర్ధుడు అంటూ చాలా అవమానకరంగా తొలగించిన తరువాత ఆయనను ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టినట్లయింది. తద్వారా ఆయన రాజకీయ జీవితం కూడా దెబ్బ తినే ప్రమాదం ఏర్పడింది. ఇదివరకు కూడా ఆయన వరంగల్ పట్టణంలో ఆరోగ్య విశ్వవిద్యాలయం స్థాపిస్తామని ప్రజలకు చెపుతున్నారని కేసీఆర్ ఆయనను నలుగురి ముందూ మందలించి అవమానించారు. ఇప్పుడు అంతకంటే ఘోరంగా అవమానించి బయటకు గెంటారు.

 

ఈ వ్యవహారాన్ని మరికొంత లోతుగా పరిశీలించి చూసినట్లయితే ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా సమాన బాధ్యత ఉంటుందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని పొరపాట్లు సవరించుకోనేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని కడియం చెప్పడం గమనిస్తే, రాజయ్యకి అంత కీలకమయిన పదవులు కట్టబెట్టి కేసీఆర్ కూడా పొరపాటు చేసారని చెప్పకనే చెపుతున్నట్లుంది. కేసీఆర్ చేసినది పొరపాటు అనుకొంటే అందుకు ప్రజలు చాల భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. కానీ కేసీఆర్ చేసిన ఆ పొరపాటుకు దళితుడయిన రాజయ్య శిక్షించబడ్డారు.

 

సాధారణంగా సమర్ధత, అనుభవం ప్రాతిపదికన యం.యల్యేలకు మంత్రిత్వ శాఖలు కేటాయిస్తుంటారు. ఒకవేళ రాజయ్య అంత సమర్దుడు కాడని కేసీఆర్ భావించి ఉంటే ఆయనకి ముందే ఏదో ఒక అప్రధాన్యమయిన శాఖ కేటాయించి ఉండి ఉంటే ఇటువంటి పరిస్థితిని నివారించి ఉండవచ్చును. కానీ తెలంగాణా ఏర్పడితే మొట్ట మొదటగా ఒక దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని హామీ ఇచ్చి, ఆ హామీని గట్టునపెట్టి, ఆ కుర్చీలో కేసీఆర్ సెటిల్ అయిపోయిన తరువాత ప్రజలు, ప్రతిపక్షాలు, స్వంత పార్టీలో నుండి విమర్శలను తప్పించుకోవడానికే రాజయ్యకు కీలకమయిన పదవులు కట్టబెట్టారని అందరికీ తెలిసిన విషయమే. కానీ దాని వలన ఎంత అనర్ధం జరిగిందో అందరూ చూసారు.

 

తెలంగాణా రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ జ్వరాలు రాత్రికి రాత్రే ఏమీ వ్యాపించలేదు. కానీ పరిస్థితులు పూర్తిగా చెయ్యి దాటిపోతున్నాయని గ్రహించి, నివారణ చర్యలు చేప్పట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇంత సమయం తీసుకొన్నారు. ఆయన ముందే రాజయ్యను హెచ్చరించి ఉంటే నేడు ఈ పరిస్థితీ వచ్చేది కాదు. ఇదంతా చూస్తుంటే తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి వేసినట్లుంది. పాపం రాజయ్య అనుకోవడం కంటే ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.