ఆంధ్రాలో పప్పులుడకట్లేదు.. జ‌గ‌న్ రాజ‌గురువు ప్యాక‌ప్..!

Publish Date:Nov 27, 2024

Advertisement

వైసీపీ  హయాంలోఐదేళ్లూ ఆడిందే ఆట‌.. పాడిందే పాట అన్న‌ట్లుగా ఆయ‌న‌ హ‌వా సాగింది.  కోరిందే త‌డువుగా సీఎం  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నీ చ‌క‌చ‌కా చ‌క్క‌బెట్టేసేవారు. ప్ర‌భుత్వ భూముల‌ను సైతం నామమాత్రపు ధరకు క‌ట్ట‌బెట్టేశారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలోనూ ఆయ‌న హ‌వాకు అడ్డులేకుండా పోయింది. కానీ, ఇప్పుడు అత‌గానికి ఆంధ్రప్ర‌దేశ్ న‌చ్చ‌టం లేద‌ు. ఎందుకో తెలుసా..? ఆంధ్రాలో ఇక తన పప్పులు ఉడకవు కాబట్టి.  ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రా అని ఆలోచిస్తున్నారా..?  అక్కడికే వస్తున్నా.. వైసీపీ అధినేత  జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి రాజ‌గురువుగా, ఇంకా క్లియర్ గా  చెప్పాలంటే గుగ్గురువుగా చెప్ప‌బ‌డే విశాఖ‌ శార‌దా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర.  తెలంగాణ   కేసీఆర్, ఏపీలో జగన్ మోహ‌న్ రెడ్డి  అధికారంలో ఉన్న సమయంలో  ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ స్వరూపానందేంద్రకు అధిక ప్రాధాన్యత ఉండేది. ఈ ఇద్దరు మాజీ సీఎంలూ స్వామి స్వరూపానందేంద్ర పట్ల అత్యంత భక్తి విశ్వాసాలు ప్రదర్శించే వారు  స్వామీజీ ఇద్దరితోనూ రాజ శ్యామల యాగం చేయించారు. ఇద్దరూ విశాఖలోని శారదా పీఠం సందర్శించారు. అయితే, జగన్ మోహ‌న్ రెడ్డి మాత్రం శార‌దా పీఠానికి  ద‌త్త‌పుత్రుడిగా   వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌భుత్వ భూములను త‌క్కువ ధ‌ర‌కు క‌ట్ట‌బెట్ట‌డం ద‌గ్గ‌ర నుంచి.. స్వామిజీ ఎక్కడికి వెళ్లినా ట్రాఫిక్‌ అవాంతరాలు లేకుండా గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసేవారు. దీంతో దేశంలో హిందువుల‌కు నేనే పెద్ద‌దిక్కు అన్న‌ట్లుగా స్వామి స్వరూపానందేంద్ర ప్ర‌వ‌ర్తించార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.  

సాధార‌ణంగా కంచి, శృంగేరి పీఠాధిపతులు ఎప్పుడైనా రాష్ట్రానికి వస్తే అతిథిగా భావించి భద్రత కల్పిస్తారు. కానీ, జగన్ రాజ‌గురువుగా పేరున్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఎక్కడికి వెళ్లినా ఎస్కార్ట్‌ వాహనాలు, వై-కేటగిరీలో   భద్రతా సిబ్బంది ఉండేలా జగన్ ఆయనకు ఎక్కడ లేని ప్రాధాన్యతా ఇచ్చారు.  దానికి కారణం 2019లో జగన్‌ సీఎం కావాలని ఆయన రాజశ్యామల యాగం చేయడమే. దానికి గురుదక్షిణగా ప్రజాధనంతో శారదా పీఠానికి భద్రత కల్పించారు జగన్‌ మోహన్ రెడ్డి. స్వరూపానందేంద్రకు వై-కేటగిరీలో  భద్రత కేటాయించారు. ఆశ్రమానికి ఉన్న రెండుగేట్ల వద్ద ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లను విధుల్లో ఉండేవారు. ఎస్కార్ట్‌ వాహనంలో ఏఎస్సై, ఒక కానిస్టేబుల్ ఉండేవారు. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర  సరస్వతికి సైతం 2+2 భద్రతా సిబ్బంది, మరో ఎస్కార్ట్‌ వాహనం కేటాయించింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఎస్కార్ట్‌ వాహనాలకు ఇంధన ఖర్చునూ పోలీసు శాఖ‌ే భ‌రించేది. మొత్తంగా 20 నుంచి 25మంది వరకూ భద్రతా సిబ్బంది శారదాపీఠం, స్వరూపానందేంద్ర సువల్లో మునిగి తేలేవారు.   కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల‌కే వై-క్యాటగిరీ భద్రతను నిలిపివేసింది. వారికి వ‌న్ ప్ల‌స్ వ‌న్ పోలీసు బందోబస్తు మాత్రం కొనసాగుతోంది.

తాజాగా స్వ‌రూపానందేంద్ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తున్న ఎక్స్ క్యాట‌రిగీ భ‌ద్ర‌త‌ను కూడా ఉప‌సంహ‌రించుకోవాల‌ని విశాఖ శార‌దా పీఠం మేనేజ‌ర్ ఏపీ డీజీపీని ఓ లేఖ ద్వారా కోరారు. ఇక‌పై ఆయ‌న రుషికేశ్ లో త‌ప‌స్సులో ఎక్కువ స‌మ‌యం గ‌డ‌పాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలిపారు. దీంతో వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో రాజ‌గురువులా ఓ వెలుగు వెలిగిన స్వ‌రూపానందేంద్ర త్వ‌ర‌లో రాష్ట్రాన్ని వీడి రుషికేశ్ లోనే ఉంటార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే  ఆయ‌న ఆంధ్రాను వ‌దిలి వెళ్ల‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంలా ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం ఆయ‌న్ను నెత్తిన పెట్టుకోలేదు. అంద‌రి స్వామిజీల‌కు ఇచ్చిన మ‌ర్యాదను ఆయ‌న‌కు ప్ర‌భుత్వం ఇస్తున్నది. జ‌గ‌న్ హ‌యాంలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా త‌క్కువ ధ‌ర‌కే శార‌ద పీఠానికి భూముల‌ను కేటాయించారు.  వైసీపీ హయాంలో శారదా పీఠానికి రూ. 300 కోట్ల విలువ చేసే భూమిని కేవలం రూ. 15 లక్షలకే (ఎక‌రా ల‌క్ష చొప్పున) అప్పగించారనే అభియోగాలు ఉన్నాయి.  

దీంతో  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా క‌ట్ట‌బెట్టిన‌ ఆ కేటాయింపులను రద్దు చేసింది. మ‌రోవైపు తిరుమ‌ల‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా శార‌దా పీఠం కార్యాల‌యం కోసం నిర్మించిన   క‌ట్ట‌డాల‌ను ఇంజ‌నీరింగ్ విభాగం కూల్చేసింది. దీంతో జ‌గ‌న్ హ‌యాంలో ఐదేళ్లు ఆడిందే ఆట పాడిందేపాట‌గా కొన‌సాగిన స్వ‌రూపానందేంద్ర స్వామిజీకి కూట‌మి ప్ర‌భుత్వంలో షాక్‌ల మీద షాక్‌లు త‌గిలిన‌ట్ల‌యింది. దీంతో ఆయన రాష్ట్రం వదిలిపోవడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. లేకపోతే అప్పనంగా ప్రభుత్వం నుంచి నామమాత్రపు ధరలకు భూములు కొట్టేసినందుకో, తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినందుకో కేసులను ఎదుర్కొనవలసి వస్తుందన్న భయం కూడా ఆయనలో ఉండి ఉంటుంది. అందుకే రాష్ట్రం దాటేస్తే రుషీకేశ్ లో తపస్సు పేరుతో న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవచ్చని స్వరూపానందేంద్ర భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది.
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
డీఎంకే శాసన సభాపక్ష ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
త‌న ప్ర‌భుత్వ అప్పుల‌పై విజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించి, హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు విజ‌య్ ఆరోప‌ణ‌ల‌పై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించొద్ద‌ని హిత‌వు చెబుతూనే.. ఉచిత విద్యుత్‌, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా అడ్డుకునేందుకు మొద‌టి సంత‌కం చేసిన విజ‌య్‌ని స్టాలిన్ అభినందించారు.
విరుద్‌నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి గ్రామానికి చెందిన కీర్తన సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రులు, తాతలు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. చదువులో ప్రతిభ కనబరిచిన ఆమె స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి, తరువాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.