'ఖర్మ'ని పట్టించుకోవద్దన్న... 'కర్మ'యోగి!

Publish Date:Jan 12, 2017

Advertisement


జనవరి 12... భారత యువజన దినోత్సవం! అంటే మన యూత్ డే!ఈ విషయం చాలా మందికి తెలియకపోవటం విషాదమైతే... ఇప్పుడిప్పుడే చాలా మందికి తెలుస్తూ వుండటం ఆనందకరం. ఇంతకీ ఇవాళ్ల ఎందుకని యూత్ డే? యువతకి ఈ రోజుతో ఏం సంబంధం వుంది? 1863లో సరిగ్గా ఇదే రోజున బెంగాల్ లో ఒక ఆధ్యాత్మిక అగ్ని కణం రాజుకుంది! ఆ అగ్ని కణం తొలి వెలుగులు విరజిమ్మిన జయంతి దినోత్సవమే జనవరి పన్నెండు. భారత దేశ యువజన దినోత్సవం!


జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి. ఆయన పుట్టుకతో వివేకానందుడు కాదు. నరేంద్రనాథ్ దత్తా. కాని, క్రమంగా ఆత్మాన్వేషణలో రామకృష్ణుల వారి పాదాలకి అంకితమై పరిపూర్ణ పరిణామం చెందాడు. స్వామి వివేకానందుడు అయ్యాడు. నిజానికి శ్రీరామకృష్ణ పరమహంస ఆయనకి పెట్టిన పేరులోనే ఎంతో అర్థం దాగి వుంది. వివేకం అంటే మంచిని, చెడుని, అబద్ధాన్ని, నిజాన్ని, మృత్యువుని, అమృతత్వాన్ని వేరు వేరుగా చూడగలగటం! అంతే కాదు, వివేకం అంటే అశాశ్వతమైనదాన్ని వద్దనుకుని శాశ్వతమైన దాన్ని ధైర్యంగా, స్థిరంగా ఎంచుకోవటం! అలా చేస్తే వచ్చేదే ఆనందం! కాబట్టి వివేకం
వల్ల ఉత్పన్నమయ్యే శాశ్వత ఆనందానికి ప్రతి రూపమే స్వామి వివేకానంద. భారతదేశం యుగయుగాలుగా ప్రపంచానికి అందిస్తోన్న వివేకా, ఆనందాల సందేశానికి సజీవ రూపం ఆయన! 


వివేకానందుడికి యువతకి చాలా పెద్ద సంబంధం వుంది. అందుకే, ఆయన జయంతిని వాజ్ పేయ్ ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. కేవలం 39సంవత్సరాలు మాత్రమే భౌతికంగా జీవించిన ఆయన ఏనాడూ ముదుసలి భావాల్ని కూడా జోలికి రానీయలేదు. ఆయన చెప్పింది కూడా అదే. సాధారణ సాధువులు, సన్యాసుల మాదిరిగా జపం, తపం, ఉపవాసం వంటి వాటితో సరిపుచ్చలేదు. దేశం బ్రిటీషర్ల కర్కశ హస్తాల్లో నలిగిపోతోంటే వెన్నెముక అరిగిపోయేలా జాతి కోసం పని చేయమన్నాడు. అందుకు యువత మీదే తన నమ్మకం అన్నాడు. ప్రపంచం మారేది యువ శక్తి వల్లేనని స్వామీజీ విశ్వసించారు. బోధించారు. 


వివేకానంద అనగానే ఇప్పుడు నాలుగు కొటేషన్లు వినిపించి కథ ముగించేస్తున్నారు. ఇంతకు ముందైతే అది కూడా వుండేది కాదు. ఎక్కడో చరిత్ర పుస్తకంలో పది లైన్లు మాత్రం ఆయన గురించి రాసి చేతులు దులుపుకునే వారు. అందుకే, స్వామీజీ గొప్పతనం ఆయన 153వ జయంతి నాడు కూడా చాలా మందికి తెలియటం లేదు. అసలాయన ఇప్పుడు బతికి వుంటే నేనాయన పాదాల వద్ద వాలిపోయేవాడ్ని అని సుభాష్ చంద్రబోస్ అన్నారంటే వివేకానందుడిలో ఎంతటి గొప్పతనం దాగి వుండి వుంటుంది? గాంధీ, ఠాగూర్, నెహ్రు, టాటా... ఇలా ఎందరో వివేకానందుడి వల్ల నేరుగా, పరోక్షంగా ప్రేరణ పొందారు. ఇప్పటికీ స్వామీజీ బోధనల్ని చదివి వేలాది మంది కర్తవ్య దీక్షతో రగిలిపోతున్నారు. సినిమా రంగం మొదలు రాజకీయ రంగం వరకూ అన్నిట్లో వివేకానందుడి ప్రేరణ పొందిన వారున్నారు. మన ప్రధాని మోదీ సహా ఈనాటి తరంలో వివేకానందుడి శిష్యులు ఎందరెందరో!


వివేకాందుడు కొత్తగా ఏమీ చెప్పలేదు. ఒకప్పటి శ్రీకష్ణ,శంకరాచార్యుల మాదిరిగానే వేదం, ఉపనిషత్తుల్లో ఏముందో అదే మళ్లీ మళ్లీ ప్రవచించాడు.లే , మేలుకో, గమ్యం చేరేదాకా విశ్రమించకు అన్నదే ఆయన అన్ని బోధనల సారాంశం. దేవుడి పేరు చెప్పొ, మూఢ నమ్మకాల నెపంతోనో దౌర్భాగ్యంలో మునిగిపోవద్దని స్వామీజీ సందేశం. ఖర్మ అని వాపోకుండా కర్మతో తల రాత రాసుకొమ్మని ఆయన చెప్పారు. అదే సమయంలో పాశ్చాత్య ప్రపంచంలో కాలుమోపి భౌతిక సుఖాలకి ఆవల ఏముందో తెలుసుకొమ్మని తట్టి లేపాడు. ఇక్కడ మనకు ధైర్యం నూరిపోస్తే ... ఆక్కడ వారికి వివేకం ప్రబోధించాడు. ఏక కాలంలో భూమ్మీది రెండు ప్రపంచాలకి ఎక్కడ ఏం కావాలో అది అందించాడు. అదే వివేకానందుడి గొప్పతనం... 


తనకి నిజాయితీపరులైన వంద మంది కష్టపడగలిగే యువతి యువకుల్ని ఇవ్వమంటాడు వివేకానందుడు. తాను ప్రపంచాన్నే మార్చేస్తానంటాడు! ఆయన కోరిన ఆ వంద మందిలో మనమూ ఒకరం అవ్వటమే ఇప్పటికిప్పుడు మన ఆత్మోద్ధరణకి, దేశోద్ధరణకి కావాల్సింది! ARISE, AWAKE AND STOP NOT TILL THE GOAL IS REACHED!



 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.