కోమటిరెడ్డిపై సస్పెన్షన్ వేటు?

Publish Date:Aug 9, 2025

Advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న  మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి  పై కాంగ్రెస్ పార్టీ వేటు వేస్తుందా? పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా? అంటే.. అవును,కాదు అంటూ రెండు వాదనలు పార్టీలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా    ఆదివారం (ఆగష్టు 10)  క్రమశిక్షణ కమిటీ చైర్మన్  మల్లు రవి అధ్యక్షతన సమావేశమవుతున్న పీసీసి క్రమశిక్షణ కమిటీ ఇతర అంశాలతో పాటుగా.. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘనకు సంబంధించిన అంశాన్ని చర్చించనున్నట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో ఆదివారం సమావేశం ప్రాధాన్యత  సంతరించుకుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. 

కాగా.. మంత్రి పదవి ఆశించి భంగపడిన ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి  గత కొద్ది రోజులుగా బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా  విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవంక..  ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుమారం సృష్టిస్తున్నాయి.  

ఈ నేపథ్యంలోనే  కోమటి రెడ్డి వ్యాఖ్యలు, విమర్శలను సీరియస్  గా తీసుకున్న క్రమశిక్షణ కమిటీ  చైర్మన్ మల్లు రవి  ఆదివారం (ఆగస్టు 10) ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని ఎమ్మెల్యే  కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డికి సమన్లు పంపినట్లు తెలుస్తోంది. నిజానికి  కమిటీ చైర్మన్ మల్లు రవి రెండు రోజుల క్రితం ఢిల్లీ నుంచే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డితో  ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శల వల్ల  ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలుగుతోందని క్రమశిక్షణ కమిటీ భావిస్తోందని స్పష్టం  చేసినట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా తనకు మంత్రి పదవి ఇస్తామని ఒకటికి రెండు సార్లు ప్రామిస్  చేసి, ఇప్పడు  కులం, కుటంబం, జిల్లా లెక్కలు చూపించి తనకు మొండి చేయి చుపించడం పట్ల కోమటి రెడ్డి  రాజగోపాల్ రెడ్డి  తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.   బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేర్చుకునే సమయంలో..  ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల సమయంలో, భువనగిరి బాధ్యతలు అప్పగించిన సమయంలో మరోమారు తనకు మంత్రి పదవి హామీ ఇచ్చే సమయంలో  అడ్డు రాని  కులం, కుటుంబం, జిల్లా లెక్కలు ఇప్పడు ఎలా ఆడ్డు వస్తున్నాయని కోమటి రెడ్డి ప్రశ్నిస్తున్నారు.  కాదు కాదు గట్టిగా నిలదీస్తున్నారు. 

అంతే కాకుండా..  తమ అసంతృప్తిని వ్యక్తం చేసే క్రమంలో కోమటి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ చేసిన వ్యాఖ్యల మొదలు, సోషల్ మీడియా వ్యవహార శైలికి సంబంధించి చేసిన హెచ్చరికల వరకు అనేక విషయాల్లో బహిరంగంగా ముఖ్యమంరి  చేసిన విమర్శలను  పార్టీ  ముఖ్య  నాయకత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. విమర్శించడమే కాకుండా.. ఒక విధంగా తిరుగుబాటు ధోరణి అవలంబిస్తున్న తీరు పట్ల పార్టీ  ముఖ్య  నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 10) భేటిలో ఏమి జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే.. ఇప్పటి కిప్పుడు కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేదనీ, రేపటి సమావేశంలో సర్ది చెప్పే ప్రయత్నమే జరుగుతుందని అంటున్నారు.అందుకే..  క్రమశిక్షణ కమిటీ చైర్మన్  మల్లు రవి స్వయంగా  రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి వివరాలు తీసుకుంటామని..  ఆ తర్వాతనే  ఏం చేయాలనే దానిపై నిర్ణయం ఉటుందని చెప్పినట్లు  తెలుస్తోంది. మరో వంక రాజగోపాల రెడ్డికి కూడా తెగే వరకు లాగే ఆలోచన లేదని అంటున్నారు.

By
en-us Political News

  
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.