Publish Date:Sep 13, 2025
నేపాల్ ఇంతగా ఎందుకు తగలబడుతోంది? ఇక్కడి యువత మోడీలాంటి ప్రధాన మంత్రి కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? అని చూస్తే ఓలీ నుంచి వచ్చిన డైరెక్ట్ కామెంట్.. నేను మీ భారత దేశ ఆరాధ్య దైవం, అయోధ్యలో జన్మించిన శ్రీరామచంద్రుడి ఉనికి ప్రశ్నార్ధకం చేసేలా కామెంట్లు చేశాను. అదే నా కొంప ముంచిందని అన్నారు ఓలి.
నిజానికి ఓలీ ఇప్పటి వరకూ రెండు మార్లు జానకీ మాత మాత్రమే కాదు రాముడు సైతం మా దేశంలోనే పుట్టాడని అన్నారు. దీంతో అక్కడి పురావస్తు శాఖ ఇది నిరూపించడానికి నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. మాములుగా అయితే అది జానకీ మాత జన్మించిన నేల. తన భర్త అంటే ఆమెకు అంత ప్రేమ. అలాంటి తన పతిదేవుడి ఉనికి ప్రశ్నార్ధకం చేస్తే ఊరుకుంటుందా? ఆగ్రహిస్తుంది. సత్యం బయటకు రావడానికి తానెలా అగ్ని పునీత అయ్యిందో.. సరిగ్గా అలాగే తాను జన్మించిన దేశాన్ని కూడా అగ్ని పునీతం చేసింది. అప్పుడుగానీ ఓలీ తాను ఆనాడు అన్న మాటలు నిజం కావని ఓప్పుకోలేదు.
రాముడికి నిజంగానే అంత పవరుందా? ఆయన్ను అన్న వారు ఇలా నామరూపాల్లేకుండా నాశనమై పోతారా? అంటే ప్రస్తుతానికైతే అదే నిజమని నిరూపితమవుతోంది. రామ జన్మ భూమి అయోధ్యలో బాబ్రీ మసీదు కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ సుమారు 5 లక్షల మంది వరకూ మరణించి ఉండవచ్చని ఒక అంచనా.
మొత్తానికి రామజన్మభూమి అన్యాక్రాంతమైన 500 ఏళ్లకు ఇప్పుడు ఇక్కడ బాలరామ ఆలయం వెలసింది. ఎవరైతే రామజన్మ భూమి అనే ఒకానొక ఉద్యమం మొదలు పెట్టారో.. వారు ప్రస్తుతం దేశాన్ని అప్రతిహతంగా ఏలుతున్నారు.
అంటే రాముడు లేడని అన్న వారు ఎలా నాశనమై పోతారో.. సరిగ్గా రాముడున్నాడు, ఆయన పుట్టుక నిజం.. ఆయన పయనం నిజం.. అంతకన్నా మించి ఆయన అయోధ్యలో జన్మించింది నిజం.. అన్న వారిని అందలం ఎక్కిస్తారు. అదే ఆయన ఉనికినే ప్రశ్నార్ధకం చేసిన వారి అంతు చూస్తాడా శ్రీరామచంద్రుడు. ఈ విషయం మరోమారు నేపాల్ ఉదంతంతో రుజువైందని అంటున్నారు చాలా మంది.
ఈ మాట స్వయంగా కేపీశర్మ ఓలీ అనడంతో మళ్లీ రాముడు కేవలం పౌరాణిక పాత్ర కాదు. అదొక చారిత్రక పాత్ర. ఆయన చరిత్ర నిజం. ఆయన అయోధ్య కేంద్రంగా పాలించింది నిజం. ఆయన పితృవాక్ పాలన నిజం ఆయన ఏకపత్నీ వ్రతం నిజం ఆయన మాటకోసం నిలబడ్డం నిజం. మొత్తంగా శ్రీరాముడు ఒక ధర్మానికి ప్రతీక అన్న మాట నిజం అని మరోమారు రుజువైందని అంటున్నారు శ్రీరామ భక్తులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sushila-karki-25-206109.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.