Publish Date:Sep 13, 2025
నేపాల్ ఇంతగా ఎందుకు తగలబడుతోంది? ఇక్కడి యువత మోడీలాంటి ప్రధాన మంత్రి కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? అని చూస్తే ఓలీ నుంచి వచ్చిన డైరెక్ట్ కామెంట్.. నేను మీ భారత దేశ ఆరాధ్య దైవం, అయోధ్యలో జన్మించిన శ్రీరామచంద్రుడి ఉనికి ప్రశ్నార్ధకం చేసేలా కామెంట్లు చేశాను. అదే నా కొంప ముంచిందని అన్నారు ఓలి.
నిజానికి ఓలీ ఇప్పటి వరకూ రెండు మార్లు జానకీ మాత మాత్రమే కాదు రాముడు సైతం మా దేశంలోనే పుట్టాడని అన్నారు. దీంతో అక్కడి పురావస్తు శాఖ ఇది నిరూపించడానికి నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. మాములుగా అయితే అది జానకీ మాత జన్మించిన నేల. తన భర్త అంటే ఆమెకు అంత ప్రేమ. అలాంటి తన పతిదేవుడి ఉనికి ప్రశ్నార్ధకం చేస్తే ఊరుకుంటుందా? ఆగ్రహిస్తుంది. సత్యం బయటకు రావడానికి తానెలా అగ్ని పునీత అయ్యిందో.. సరిగ్గా అలాగే తాను జన్మించిన దేశాన్ని కూడా అగ్ని పునీతం చేసింది. అప్పుడుగానీ ఓలీ తాను ఆనాడు అన్న మాటలు నిజం కావని ఓప్పుకోలేదు.
రాముడికి నిజంగానే అంత పవరుందా? ఆయన్ను అన్న వారు ఇలా నామరూపాల్లేకుండా నాశనమై పోతారా? అంటే ప్రస్తుతానికైతే అదే నిజమని నిరూపితమవుతోంది. రామ జన్మ భూమి అయోధ్యలో బాబ్రీ మసీదు కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ సుమారు 5 లక్షల మంది వరకూ మరణించి ఉండవచ్చని ఒక అంచనా.
మొత్తానికి రామజన్మభూమి అన్యాక్రాంతమైన 500 ఏళ్లకు ఇప్పుడు ఇక్కడ బాలరామ ఆలయం వెలసింది. ఎవరైతే రామజన్మ భూమి అనే ఒకానొక ఉద్యమం మొదలు పెట్టారో.. వారు ప్రస్తుతం దేశాన్ని అప్రతిహతంగా ఏలుతున్నారు.
అంటే రాముడు లేడని అన్న వారు ఎలా నాశనమై పోతారో.. సరిగ్గా రాముడున్నాడు, ఆయన పుట్టుక నిజం.. ఆయన పయనం నిజం.. అంతకన్నా మించి ఆయన అయోధ్యలో జన్మించింది నిజం.. అన్న వారిని అందలం ఎక్కిస్తారు. అదే ఆయన ఉనికినే ప్రశ్నార్ధకం చేసిన వారి అంతు చూస్తాడా శ్రీరామచంద్రుడు. ఈ విషయం మరోమారు నేపాల్ ఉదంతంతో రుజువైందని అంటున్నారు చాలా మంది.
ఈ మాట స్వయంగా కేపీశర్మ ఓలీ అనడంతో మళ్లీ రాముడు కేవలం పౌరాణిక పాత్ర కాదు. అదొక చారిత్రక పాత్ర. ఆయన చరిత్ర నిజం. ఆయన అయోధ్య కేంద్రంగా పాలించింది నిజం. ఆయన పితృవాక్ పాలన నిజం ఆయన ఏకపత్నీ వ్రతం నిజం ఆయన మాటకోసం నిలబడ్డం నిజం. మొత్తంగా శ్రీరాముడు ఒక ధర్మానికి ప్రతీక అన్న మాట నిజం అని మరోమారు రుజువైందని అంటున్నారు శ్రీరామ భక్తులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sushila-karki-25-206109.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు