Publish Date:Jul 26, 2022
దేశ భవిష్యత్, రాష్ట్రాల భవిష్యత్ ను పణంగా పెట్టి కేవలం అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కొన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో ‘అన్నీ ఉచితం’ అంటూ గుప్పిస్తున్న హామీలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీలు ఇచ్చే ‘ఉచిత’ హామీలను అరికట్టే మార్గం లేదా అని ఎన్నికల సంఘాన్ని సూటిగా ప్రశ్నించింది. అందుకు ఎన్నికల సంఘం అది మా చేతిలో లేదని సమాధానం ఇవ్వడంతో కేంద్రాన్ని కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.
వాస్తవానికి ‘ఉచిత’ హామీలు ఇవ్వడం ఒక విధంగా క్విడ్ ప్రోకో కిందకే వస్తుందని మేధావులు చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు. మాకిది..మీకిది అన్నట్లుగా మాకు ఓటేస్తే.. మీకన్నీ ఉచితమే అనడం ఓటర్లను ప్రలోభ పెట్టడమే ఔతుందన్న మేధావుల మాటలను పార్టీలు పట్టించుకోవడం లేదు. ‘ఉచిత’ హామీలను నెరవేర్చడం కోసం జనంపై పన్నుల వడ్డింపులు, మద్యం విక్రయాల ఆదాయంపైనే ప్రభుత్వాలు ఆధారపడటం వంటి చర్యలతో సామాన్య జనం మనుగడను కష్టాల పాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. అయినా సరే ఉచిత హామీలు అధికారానికి అడ్డదారిగా భావిస్తున్న పార్టీలు అవే హామీలను గుప్పిస్తూ అధికారానికి నిచ్చెనలు వేస్తున్నారు.
ఈ ఉచిత హామీలకు బ్రేక్ వేయాల్సిన అవసరం ఉందన్న చర్చ చాలా కాలంగా సాగుతూనే ఉంది. అన్నీ ఉచితం అంటూ ఖజనా ఖాళీ చేస్తూ దేశ భవిష్యత్ ను అంధకారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపు రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపు రద్దు వ్యవహారం తమ చేతుల్లో లేదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చేసింది. ‘ఉచిత’ హామీలను విశ్వసించి ఓటేయడంలోని ఉచితానుచితాలను తెలుసుకోవలసింది ఓటర్లేనని బదులిచ్చింది.
దాంతో కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీం కోరింది. ఉచిత పథకాలపై రాష్ట్రాలు వెచ్చించే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఆయా రాష్ట్రాలకు రెవెన్యూ కేటాయింపులను నియంత్రించే అవకాశం ఉందా అని కూడా సుప్రీం కోర్టు ప్రశించింది. కాగా ఈ విషయంలో ఏం చేయాలన్న దానిపై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అభిప్రాయాన్ని కోరింది. ఉచిత హామీలతో ఎన్నికలకు వెళ్లే పార్టీల గుర్తింపు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ వచ్చే నెల 3కు వాయిదా పడింది. ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉచితాలు అనుచితం వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు చెక్ పెట్టేలా ఆర్ధిక సంఘానికి సిఫారసు చేస్తే ఆల్ ఫ్రీ అంటూ అధికారానికి నిచ్చెనలు వేసే పార్టీలకు ఇక కాలం చెల్లినట్లే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-qusestion-center-on-all-free-promises-25-140614.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.