మూడుదశాబ్దాల వర్గీకరణ పోరాటానికి శుభం కార్డు!

Publish Date:Aug 2, 2024

Advertisement

ఎస్సీ వర్గీకరణకోసం మూడుదశాబ్దాల పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో  శుభం కార్డు పడింది.సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ప్రధాన ధర్మాసనం గురువారం (ఆగస్టు 1)  వర్గీకరణకు అనుకూలంగా చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఏడుగురు సభ్యుల  ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది వినా మిగిలిన ఆరుగురు న్యాయమూర్తులు వర్గీకరణను సమర్ధిస్తూ తీర్పు వెలువరించారు. సమానత్వహక్కుకు వర్గీకరణ భంగం కాదని తీర్పు పేర్కొంది.

అలాగే ఆర్టికల్ 341/2కు భంగంకలగకూడదనీ, ఆర్టికల్ 15,16 లలో వర్గీకరణను వతిరేకించే అంశాలు లేవని ఆ తీర్పులో పేర్కొన్నారు.   దీనివల్ల ఉప వర్గాలకు న్యాయం చేకూరుతుందని, రాష్ట్రాలకు ఉప వర్గీకరణ లో అవకాశం ఇవ్వాలని, ఎస్సీల్లో క్రిమీలేయర్ గుర్తించడానికి అవకాశం ఇస్తూ తీర్పు చెప్పడం చారిత్రాత్మకం. మాదిగలకు గుర్తింపు తెచ్చిన మందకృష్ణ మాదిగ 1972 నుంచి ఉమ్మడి ఏపీలోమారిన ప్రతి సీఎం వద్దకు  వెళ్లి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.వర్గీకరణకు సహకరించాలని కోరేవారు.

2011జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ల జనాభా 1.38 కోట్లమంది ఉన్నారు. వారిలో మాలలు 55.70లక్షలు, మాదిగలు67.02 లక్షల మంది ఉన్నారు.అంటే 11లక్షలమంది మాదిగలు ఎక్కువ ఉన్నారు.మాలమాదిగలు 80 శాతంగా ఉండగా,మిగిలిన 20 శాతంగాఉన్న  57 ఉపకులాల్లోఉత్తరాంధ్ర రెల్లి కులానిది మూడో స్థానం.70శాతంగా ఉన్న మాదిగ,దాని ఉపకులాలు రిజర్వేషన్లు 10శాతం పొందుతున్నారు. 30శాతంగా ఉన్న మాలలు వారి ఉపకులాలు 90శాతం రిజర్వేషన్లు పొందుతున్నారని వారి వాదన.

2000-2004మధ్య చంద్రబాబు వర్గీకరణ అమలు చేసారు. కాని మాలమహానాడు వ్యతిరేకించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  హైకోర్టు వర్గీకరణ ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 2004లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను విచారించిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం హైకోర్ట్ తీర్పు ను సమర్దిస్తూ తీర్పు వెలువరించింది. ఆ తర్వాత ఆనేక పోరాటాలు,ఉద్యమాలు నడిచాయి.చివరికి ఎన్నికల ముందు ప్రధాని మోదీ హైదరాబాద్లో జరిగిన విశావరూప సదస్సుకు హాజరై వర్గీకరణ ను సమర్దిస్తూ మాట్లాడారు. వర్గీకరణకు మద్దతు తెలిపారు.  మందకృష్ణ మాదిగ  ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మం గెలిచిందని వ్యాఖ్యానించారు. ఈ విజయాన్ని పోరాటంలో అమరులైన వీరులకు అంకిత మిస్తున్నామన్నారు.

ఈ విజయంలో  చంద్రబాబు పాత్ర కీలకమనీ, వర్గీకరణ విజయం క్రెడిట్ ఆయనకే   చెందుతుందన్నారు.  ప్రధాని  మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబులు వర్గీకరణ తీర్పు పై హర్షం వ్యక్తం చేసారు. ఇలా ఉండగా వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును మాలమహానాడు వ్యతిరేకించింది. న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది. ఏది ఏమైనా సుప్రీం ప్రధాన ధర్మాసనం తీర్పుతో వర్గీకరణ వివాదానికి శుభం కార్డు పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.