Publish Date:Jun 24, 2022
సుప్రీంలో కాంగ్రెస్ ఎంపీ జకియా జఫ్రీకి చుక్కెదురైంది. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోడీకి దేశ సర్వోన్నత న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇస్తూ గతంలో స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జఫ్రీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆమె పిటిషన్ ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. మోడీకి క్లీన్ చిట్ ఇస్తూ నాడు స్పెషల్ మెట్రో పాలటిన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది. 2002 ఫిబ్రవరి 28న అల్లరి మూకల దాడిలో అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జఫ్రీ సహా 68 మంది మరణించిన సంగతి విదితమే.
దీనిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేశారు. నాటి అల్లర్లపై దర్యాప్తు జరిపిన సిట్ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ, సహా మరికొందరికి అల్లర్లతో ఎటువంటి సంబంధం లేదని తేల్చింది. అయితే నరేంద్రమోడీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఇషాన్ జఫ్రీ సతీమణి జకియా షఫ్రి పలు కోర్లులలో సవాల్ చేశారు.
అన్ని చోట్లే ఆమెకు చుక్కెదురైంది. దాంతో 2008 మార్చిలో జకియా షఫ్రి దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై సుప్రీం కోర్టు సిట్ ను నియమించి అల్లర్ల కేసు దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో సిట్ ఈ అల్లర్లపై విచారణ చేపట్ఠింది.
2010లో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని దాదాపు 10 గంటల పాటు విచారించింది. అనంతరం సిట్ మోడీ నిరపరాధి అంటూ సుప్రీం కు నివేదిక సమర్పించింది. దీనిని సవాల్ చేస్తూ జకియా జాఫ్రి 2102లో మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. అంతకు ముందు అహ్మదాబాద్ హైకోర్టు కూడా సిట్ నివేదికను సమర్ధించింది. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ఆ తీర్పునే సమర్ధిస్తూ తీర్పు వెలువరించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-gives-clean-chit-to-modi-in-gujarat-roitd-case-25-138336.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.