దశాబ్దాల కాలం నాటి అయోధ్య కేసుకు తెర పడబోతోందా?

Publish Date:Oct 16, 2019

Advertisement

అయోధ్యలో బాబ్రీ మసీదు విషయం లో హిందువులు ముస్లింల మధ్య శతాబ్ద కాలానికిపైగా వివాదం నడుస్తోంది.పంతొమ్మిది వందల తొంభై రెండులో హిందువులు మసీదును కూలగొట్టడంతో ఈ వివాదం పెద్దదైంది. ఆ ఘటన నేపథ్యంలో జరిగిన అల్లర్లలో దేశ వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది చనిపోయారు. ఆ సంఘటన తర్వాత అయోధ్యలోని భూమిపై వివాదం నడుస్తోంది. ఈ కేసును అలహాబాద్ హై కోర్టు విచారించింది.

రెండు వేల పది సెప్టెంబర్ ముప్పైన తీర్పు ప్రకటించింది. అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించారని అలహాబాద్ హై కోర్టు తీర్పిచ్చింది .ఈ మూడు భాగాల్లో ఒక భాగం హిందూ మహాసభ ప్రాతి నిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగం నిర్మోహి అఖాడాకు వెళుతుందని తీర్పు చెప్పారు.అలహాబాద్ హై కోర్టు రెండు వేల పది సెప్టెంబర్ లో ఇచ్చిన తీర్పులో మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. వివాదాస్పద భూభాగం రాముడి జన్మస్థలమని చెప్పింది.

అక్కడున్న ఒక దేవాలయాన్ని కూల్చేసిన తరవాత మసీదు నిర్మించారని  పేర్కొంది. ఆ మసీదును ఇస్లాం సూత్రాలకు అనుగుణంగా నిర్మించలేదని తీర్పులో వ్యాఖ్యానించింది. ఈ తీర్పు పై ఇరువర్గాల సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు, దీంతో సుప్రీం కోర్టు అలహాబాద్ హైకోర్ట్ తీర్పును సస్పెండ్ చేసింది.సుప్రీం కోర్టులో ఈ కేసును తుది దశకు చేరుకుంది.

ఎట్టకేళ్ళకు అయోధ్య భూ వివాదం విచారణ ఇవాళ ముగియనుంది. సుప్రీం కోర్టు ఈ కేసులో వాదనలను ఇవాళ మధ్యాహ్నంలోగా ముగించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.దీనికి సంబంధించి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని బెంచ్ సూచనప్రాయంగా తెలియచేసింది.హిందూ ముస్లిం పక్షాలు తమ తమ అభిప్రాయాల్ని సమర్పించటానికి సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఇచ్చే అవకాశం ఉంది.


ముప్పైతొమ్మిది రోజుల నుంచి సుప్రీం కోర్టు ఇరుపక్షాల వాదనలు వింటోంది. తొలుత అక్టోబర్ పధ్ధెనిమిదివ తేదీనాటికల్లా విచారణ పూర్తి చేయాలనుకుంది. ఆ తర్వాత అందుకు ఒక రోజు ముందే అంటే పదిహెడువ తేదీన తుది గడువుగా పెట్టుకుంది.ఇప్పుడు అంతకంటే ముందే ఇవాళ విచారణని పూర్తి చేయనున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది.


అయోధ్యలోని రామజన్మభూమి వద్ద మసీదును నిర్మించడం ద్వారా మొఘల్ చక్రవర్తి బాబర్ చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారంటూ మహన్ సురేష్ దాస్ అనే హిందూ పిటిషనర్ తరపు న్యాయవాది పరాశరన్ మంగళవారం సుప్రీం కోర్టు ఎదుట తన వాదనని వినిపించారు. అయోధ్యలో పలు మసీదులున్నాయని అక్కడ ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని అయితే హిందువులు మాత్రం శ్రీరాముడి జన్మస్థలాన్ని మార్చలేరని అన్నారు.


అయోధ్య వివాదంపై మధ్యవర్తిత్వానికి తావు లేదని సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగించడం మంచిదని ఇండియన్ ముస్లీమ్స్ ఫర్ పీస్ అనే సంస్థ చేసిన ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు.ఈ మాటను ఆ సంస్థ మధ్యవర్తిత్వం సాగుతున్న సమయంలో ఇచ్చి ఉండాల్సిందని ఇప్పుడు ఆ గడువు మించిపోయిందని చెప్పారు.


చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ పదిహెడున రిటైర్ కానున్నారు ఈ నేపథ్యంలో ఈ కేసు నవంబర్ నాలుగు నుంచి పదిహేనులోగా తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ నవంబర్ పదిహెడవ తేదీలోగా చీఫ్ జస్టిస్ గొగోయ్ తీర్పు ప్రకటించలేకపోతే ఆ అంశాన్ని కొత్త ధర్మాసనం విచారిస్తోంది.
సుప్రీంకోర్టు వివాదాస్పద భూమి ఎవరికి చెందుతుందనే అంశంపై తీర్పు నివ్వనుంది.ఆ భూమి ఎవరికి చెందుతుంది ఏ భాగం ఎవరికి లభిస్తుందని అంశంమ్మీద స్పష్టతనిస్తూ సిజెఐ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది.

అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పును కూడా రాజ్యాంగ ధర్మాసనం సమర్థించవచ్చు.అలాగే అన్ని పక్షాలకు ఉత్తమమని తాను భావించిన విధంగా ఆ భూభాగాన్ని రాజ్యాంగ ధర్మాసనం విభజించే అవకాశం కూడా ఉంది.తీర్పు వెలువరించే రోజు అయిదుగురు న్యాయమూర్తులు ధర్మాసనం మీదకొచ్చి తీర్పులో తాము రాసిన భాగాన్ని ఒక్కొక్కరిగా చదివి వినిపిస్తారు.సిజిఐ స్వయంగా తీర్పు చదవడం ప్రారంభించే అవకాశం కూడా ఉంది.


అయితే అయోధ్యపై వేసిన పిటిషన్ను సున్నీ వక్ఫ్ బోర్డ్ విత్ డ్రా చేసుకుంటుందన్న ఒక కీలక మలుపు  కూడా వినిపిస్తోంది.మొత్తానికి దశాబ్దాల కాలానికి చెందిన ఈ కేసుకు నేటితో తెర పడబోతోంది. ఏమి జరగబోతోందో వేచి చూడాలి. 

By
en-us Political News

  
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.