మరికొద్దిసేపట్లో అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ భూమ్మీదకు 

Publish Date:Mar 17, 2025

Advertisement

తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన  భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్  మరికొద్ది సేపట్లో  భూమిని చేరుకోనున్నారు.  ఆమెతో బాటు మరో వ్యోమగామి బుల్ విల్మోర్ చేరుకోనున్నారు. ఇప్పటికే అంతరిక్షంలో తిరుగు ప్రయాణానికి వీరు సిద్దమయ్యారు. సునీత విలియమ్స్ ను తీసుకొచ్చేందుకు రోదసిలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూడ్రాగన్ ఆదివారం(మార్చి 16) సక్సెస్ ఫుల్ గా భూ కక్ష్యలోని అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానమైంది.  క్రూ మిషన్ లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు  ఒకరితర్వాత ఒకరు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లారు. వీరు వెళ్లడంతో సునీతా విలియమ్స్ రాక కన్ఫర్మ్ అయ్యింది. సునీతా విలియమ్స్ రిటర్న్ జర్నీ గూర్చి ఇప్పటికే నాసా ప్రకటించింది.  అమెరికా కాలమాన ప్రకారం అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్ డాకింగ్ ప్రాసెస్ ప్రారంభమౌతుంది.  సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు(మార్చి 17) అంతరిక్షకేంద్రం నుంచి క్రూడ్రాగన్ విడిపోయే  ప్రాసెస్ ప్రారంభం కానుంది. స్పేస్ ఫిప్ విజయవంతంగా విడిపోయి మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు భూమ్మీదకు  రిటర్న్ జర్నీ ప్రారంభమౌతుంది. సాయంత్రం 5.11 గంటలకు  భూ కక్ష్య దాటుకుని క్రిందకు వచ్చి సాయంత్రం ఫ్లోరిడా తీరంలోని సముద్రజలాల్లో స్పేస్ ఎక్స్ క్యాపుల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరు (వ్యోమగాములు) దిగనున్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన వ్యోమనౌక ‘స్టార్ లైనర్ ’లో సునీతా విలియమ్స్ అంతరిక్షంలో అడుగుపెట్టారు. ప్లానింగ్ ప్రకారం వీరు వారంరోజులకే భూమ్మీదకు చేరుకోవాలి. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తెలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే భూమ్మీదకు స్టార్ లైనర్  వ్యోమనౌక తిరిగి వచ్చేసింది. అప్పటి నుంచి సునీతా విలియమ్స్ విల్మోర్ లు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. 

By
en-us Political News

  
 రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లను మళ్లీ తగ్గించింది. ఆర్డీఐ వడ్డీ రేట్లను తగ్గించడం వరుసగా ఇది మూడో సారి
ఏపీలో లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఉత్కంఘగా  ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ 2025 పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు.
అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అక్కినేనిఅఖిల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.  శుక్రవారం (జూన్ 6) తెల్లవారు జామున మూడు గంటలకు అఖిల్ జనాబ్ మెడలో తాళి కట్టారు.
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం (జూన్ 6) హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక, విధాన నిర్ణయాలు, బ్యాంకు గ్యారంటీల విడుదల, అంచనాల పెంపుపైనా కమిషన్ ఈటలను ప్రశ్నించనుంది.
వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన, ప్రజావ్యతిరేక విధానాలు, వైఫల్యాలను కూటమి సర్కార్ వ్యూహాత్మకంగా ప్రజలలో ప్రచారం చేస్తున్నది.
ట్యాపింగ్ కేసులో ఏ1 ముద్దాయి.. విచారణకు డుమ్మా కొట్టారు. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ఇచ్చిన హామీ మేరకు ఆయన గురువారం (జూన్ 5) విచారణకు హాజరు కావాలి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వానికి వరసగా మూడవసారి ప్రజా పట్టాభిషేకం జరిగి సంవత్సరం పూర్తయింది. అవును.. గత సంవత్సరం జూన్ 4,5 తేదీలలో 2004 లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఎ విజయ కేతనం ఎగరేసింది.
తిరుమలలో భక్తుల రద్దీ కోనసాగుతున్నది. వారాంతం సమీపిస్తుండటం, వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
జూబ్లీహిల్స్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ దేవుడి దయతో కోలుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు వెళ్లిన ఆయన గోపీనాథ్‌ ఆరోగ్యంపై ఆరా తీశారు. నిపుణులైన వైద్యలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు
జూబ్లీహిల్స్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. గుండె సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురైనట్టు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో మరో ముందడుగు పడింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తొలి జీఎంగా సందీప్ మాథుర్ నియమితులయ్యారు. ఈ మేరకు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కి ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షీ నటరాజన్‌కి ఫిర్యాదు చేశారు
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.