Publish Date:Apr 25, 2022
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ నిర్ణయాలు నవ్వుల పాలౌతున్నాయి. తుగ్లక్ పాలనను స్ఫురింప చేస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణగా రాష్ట్రంలో టీచర్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చెప్పుకోవచ్చు. సమ్మర్ హాలీడేస్ ను వర్షాకాలానికి మార్చేసి జగన్ పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి జూలై 3 వరకూ ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. అంత వరకూ బానే ఉంది కానీ టీచర్లకు మాత్రం ఈ సెలవులు వర్తించవట. వీరంతా మే 20 వరకూ పాఠశాలలకు హాజరు కావాల్సిందేనట. రాష్ట్రంలో పరీక్షలన్నీ మే 7తో ముగుస్తున్నాయి. పరీక్షలు అయిపోయిన తరువాత విద్యార్థులకు సెలవులు ఇచ్చేసిన తరువాత టీచర్లు పాఠశాలలకు ఎందుకో అర్థం కాదు. సీపీఎస్ రద్దు కోసం డిమాండ్ చేస్తున్నారన్న కక్షతో ఏదో రకంగా వేధింపులకు గురి చేయడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికీ టీచర్లకు క్లాసులో విద్యార్థులకు పాఠాలు చెప్పడం కంటే ఇరత పనులే అధికమయ్యాయి. విద్యార్థుల అటెండెన్స్ నుంచి అన్నీ ప్రతి రోజూ వాట్సన్ ద్వారా విద్యాశాఖకు పంపాల్సిందే. ఇక ఇప్పుడు తాజాగా వేసవి సెలవులను మే 20 తరువాతే టీచర్లకు ఇవ్వాలన్న నిర్ణయం వెనుక కూడా టీచర్లకు ఆదాయంలో కోత పెట్టే ఉద్దేశమే కనిపిస్తున్నది. టీచర్లకు వేసవి సెలవులలో స్పీట్ వేల్యుయేషన్ విధులు ఉంటాయి. ఆ విధులకు హాజరైన వారికి ఆర్జిత సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. దానిని ఎగ్గొట్టేందుకే సర్కార్ వేసవిలో సెలవులను వర్షాకాలానికి మార్చేయడం లాంటి వింత పోకడలకు పోతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆర్థిక క్రమశిక్షణ లేక...ఆర్థికంగా రాష్ట్రాన్ని కుదేలు చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు..టీచర్లకు న్యాయబద్ధంగా రావాల్సిన వేతనాలు అలవెన్సులు వంటి వాటిని చెల్లించలేక వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నదని టీచర్లు విమర్శిస్తున్నారు. ప్రశ్నించడమే నేరం అన్నట్లు సీపీఎస్ రద్దు కోసం చలో విజయవాడ వెళ్లిన టీచర్లను అరెస్టులు చేయడమే కాకుండా మొత్తం బెజవాడనే జైలుగా మార్చేశారంటే రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? అన్న అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు. ఏది ఏమైనా వేసవి సెలవులను వర్షాకాలంలో ఇస్తామంటూ...జగన్ సర్కార్ వింత నిర్ణయం ప్రజలలో నవ్వుల పాలౌతున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/summer-holidays-in-rainy-season-to-teachers-25-134961.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.