బోస్... హిస్టరీకి, మిస్టరీకి కేరాఫ్!

Publish Date:Jan 23, 2017

Advertisement

జనవరి 23... నేతాజీ సుభాష చంద్రబోస్ జయంతి! మరి వర్ధంతి ఎప్పుడు? ఏమో తెలియదు! ఇలాంటి పరిస్థితి ప్రపంచంలోనే మరే నేతకి వుండదనుకుంటా! బోస్ బతికుండగా ఎంత ప్రత్యేకంగా జీవించాడో... మరణంలోనూ అంతే విశిష్టంగా కొనసాగుతున్నాడు. అసలు ఆయన ఈ భూమ్మీద భౌతికంగా లేడంటే ఇప్పటికీ నమ్మేవారు లేరు! కాని, ఆయన 120వ జయంతి అయిన జనవరి 23, 2017న ఆయన మన మధ్య లేరని మనం అంగీకరించక తప్పుదు. నూటా ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి కాబట్టి నేతాజీ తమ అవతారం చాలించే వుంటారు. కాని, ఈ విషయం ఖచ్చితంగా మాత్రం చెప్పలేం...

 


జనవరి 23, 1897న ఒడిషాలోని కటక్ లో పుట్టిన సుభాష్ చంద్రబోస్ బ్రిటీష్ కు వ్యతిరేకంగా సాగుతోన్న భారత స్వాతంత్ర్య సంగ్రామ హోమంలో హవిస్సులా పడ్డాడు! దాన్ని భగ్గున మండిచాడు! గాంధీ నేతృత్వంలో ఒకవైపు అహింసాయుత ఉద్యమం సాగుతోంటే తెల్లోడికి అసలు వేడి తగిలేలా సైనిక పంథా అనుసరించాడు బోస్. 1857లో తొలి స్వాతంత్ర్య సంగ్రామం చేసిన మంగళ్ పాండే, ఝాన్సీ లక్ష్మీభాయి, నానా సాహేబ్, తాంత్యా తోపే లాంటి వారి వారసత్వాన్ని ఆయన గర్వంగా అందుకున్నాడు. కురుక్షేత్రంలో గీతా బోధ చేసిన శ్రీకృష్ణుని యుద్ధోపదేశాన్ని ధైర్యంగా పాటించాడు. అంతిమ గెలుపు బోస్ కు దక్కినా దక్కకున్నా ఆయన చేసిన ప్రయత్నమే గొప్ప విజయం. ఎందుకంటే, ఆయన ప్రపంచాన్ని తన పిడికిట్లో బంధించిన సామ్రాజ్యవాద గ్రేట్ బ్రిటన్ని స్వదేశంలో ఎదుర్కోలేదు. జర్మనీ, జపాన్ లాంటి సుదూర దేశాల్లో ఎదుర్కొన్నాడు. ఆనాటి ప్రపంచ నేతలతో భారత్ తరుఫున మాట్లాడాడు! అంటే, నిజంగా చెప్పుకుంటే స్వతంత్రానికి ముందే ఇండియాకు ఆయన ప్రతినిధి అయ్యారు. బెర్లిన్ నుంచి సింగపూర్ దాకా మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. అండమాన్ దీవుల్లో ఏర్పాటు చేసిన తన ప్రభుత్వం సాక్షిగా ఇప్పటికీ మార్మోగే జై హింద్ నినాదం ఇచ్చాడు!

 


రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సాహసోపేతంగా బ్రిటీష్ కు వ్యతిరేక వర్గంతో చేతులు కలిపిన బోస్ వ్యూహం పలించి వుంటే ఇవాళ్ల భారత్ ముఖ చిత్రమే వేరుగా వుండేది. కాని, దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. హిట్లర్ అరాచక నిర్ణయాల వల్ల, జపాన్ దుందుడుకు వ్యవహారం వల్లా అమెరికా, రష్యాల ప్రభావంతో అంతా తలకిందులైంది. అప్పుడే సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ విధి రాత కూడా వక్రీకరించింది. 

 


చంద్రబోస్ మనకు స్వాతంత్ర్యం తేలేకపోయినా ఆయన మీద భారతీయుల్లో వున్న గౌరవం, అభిమానం, భక్తి మాత్రం చెక్కుచెదరలేదు. అందుకు, ఆయన చుట్టూ అల్లుకున్న కథనాలే సాక్ష్యం. 1945లో విమాన ప్రమాదంలో మరణించాడని చెప్పే కథనం మొదలు ఉత్తర్ ప్రదేశ్ లో, బెంగాల్లో సాధువుగా గడిపాడని చెప్పే ప్రచారాల వరకూ ఎన్నో వున్నాయి. వాటన్నటి సారాంశం ఒక్కటే. బోస్ కు మరణం లేదు. ఆయన విమాన ప్రమాదంలో చనిపోలేదు. రష్యాలో వుండి వచ్చ. చైనాలో గడిపి వుండవచ్చు. కాదంటే ఉత్తరాదిలో చాలా మంది విశ్వసించే విధంగా సుభాష్ చంద్రబోస్ ఉత్తర్ ప్రదేశ్ లో గుమ్నామి బాబాగా స్థిరపడి వుండవచ్చు. ఇక కొంత మంది బెంగాలీలు 1970లలో ప్రచారం చేసినట్టు ఆయన శ్రీమత్ శారదానందజీ అనే సాధువుగా సిద్ధి పొంది వుండవచ్చు...

 


సుభాష్ చంద్రబోస్ చుట్టు అల్లుకున్న కథనాల్లో ఏది నిజం అన్నది ఇప్పటికీ పెద్ద శేష ప్రశ్నే! అది ఎప్పటికి స్పష్టం అవుతుందో కూడా చెప్పలేం. మోదీ సర్కార్ వరుసగా బయటపెడుతోన్న రహస్య డాక్యుమెంట్లు కూడా ఇప్పటి దాకా సంచలన విషయాలేం వెల్లడి చేయలేదు. కాబట్టి మరింత కొంత కాలం బోస్ వర్ధంతి లేని మహానాయకుడిగానే కొనసాగుతాడు. లేదంటే శాశ్వతంగా ఆయన మరణం పెద్ద మర్మంగానే మిగిలిపోవచ్చు! అయినా కూడా నష్టమేం లేదు... ఎందుకంటే, జయంతి మాత్రమే వుండి వర్ధంతి లేని వారు దేవుళ్లే! బోస్ భారతీయులకి దేవుడు కాక మరేంటి?

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.