Publish Date:Oct 13, 2022
రోడ్డంతా పరిగెట్టుకెళ్లి పాత బిల్డింగ్ పైకి వెళ్లి తీరిగ్గా చచ్చేట్టు కొట్టుకుని రక్తం కనిపించగానే అమాంతం విలన్ ని హీరో కిందకి తోసేస్తాడు. గాయాలతో అతనూ మెల్లగా దిగుతాడు. మరో సినిమాలో ఏకంగా రైలు తలుపు కి ఊగులాడుతూ నలుగురి కొట్టిపడేస్తాడు మహేష్బాబు..! ఇవన్నీ పెద్ద తెరమీద చూసి గోల చేయడానికి వీరాభిమానులకు మంచి ఫుడ్. కానీ అలా ఎన్నటికీ వాస్తవంలో జరగవు. అలా ఎవ్వరూ ధైర్యం చేయద్దని సదరు హీరోలే ప్రచారమూచేస్తుంటారు. కానీ వినేదెవరు? తన హీరో ఫలానా సినిమాలో చేశాడు గనుక మనం ఓ ట్ర యల్ వేద్దామనుకునే ప్రబుద్ధులు తయారయ్యారు. డ్రస్, హెయిర్స్టయిల్, నడక, మాట కాదు ఏకంగా స్టంట్ సీన్లు ప్రాక్టీస్ చాలా ప్రమాదం. ఒక కుర్రాడు ఇలానే స్టంట్ సీన్ చేయబోయే ప్రాణాలు తీసుకున్నాడు.
సరదాలు ప్రాణంతీసేవిలా ఉండకూడదు. సెల్ఫీల పిచ్చిలో ఇప్పటికీ చాలామంది ప్రాణాలమీదకు తెచ్చు కుంటున్నారు. అనేక సంఘటనలు తెలిసీ కుర్రాళ్లు రెచ్చిపోతున్నారేగాని తగ్గటం లేదు. గతంలో టూవీలర్ రేసులు, కార్ల రేసులు, తర్వాత సెల్ఫీల పిచ్చి, ఇపుడు వెలుగులోకి వస్తున్ స్టంట్ల పిచ్చి. ఇంట్లో సరదాకి పిల్లలు స్టంట్ సీన్లు చేస్తుంటారు.. దిండ్లతో. అక్కడ ఇంటిల్లపాదికీ సరదా కాలక్షేపం. పిల్లాడిని ఆడించ డంలో మురిపెంగా చూసుకోవడంలో భాగం. కానీ ఊహించని ప్రమాదాల వెంటాడుతుండే ఫీట్స్ కుటుంబా నికి తేరుకోలేని అవాంతరం.
పంజాబ్ చావా రైల్వేస్టేషన్ పరిధిలో ఒక రైలు వేగంగా వెళుతోంది. హఠాత్తుగా ఓ కుర్రాడికి ఏ హృతిక్ రోషన్ గుర్తొచ్చాడో ఏమోగాని అమాంతం స్టంట్ సీన్ లాంటిది చేయడం మొదలెట్టాడు. కొంతసేపయ్యాక ఏకంగా బయట ఫుట్బోర్డ్ మీద నుంచుని వీర విన్యాసాలు చేశాడు. ఏదో కుర్రాడు ఉత్సాహపడుతూ, ఓవ రాక్షన్ చేస్తున్నాడని మరో కుర్రాడు వీడియో తీశాడు. మనోడు మరింత రెచ్చిపోయాడు. ఈ ఆవేశంలో తాను ఉన్నది వేగంగా పరిగెడుతున్న రైలు బోగీ ఫుట్బోర్డు మీద అన్న ధ్యాసే మర్చిపోయాడు.. పది నిమిషాల తర్వాత ట్రాక్ పక్కనే ఉన్న కరెంటు స్తంభానికి కొట్టుకున్నాడు.. అంతే! వీడియో అయింది, అతను జీవితాన్ని చాలించాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/stunt-imitation-leads-death-25-145362.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!