Publish Date:Jun 16, 2025
ఇటు సాంకేతికంగా, అటు బడ్జెట్ పరంగా చూస్తే ఇరాన్ కన్నా ఇజ్రాయెలే ఒకటికి పది రెట్లు ఎక్కువ. దేశ బడ్జెట్ లో ఇరాన్ డిఫెన్స్ బడ్జెట్ సుమారు 8 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంటుంది. 2022, 2023 ప్రకారం మనకు అదే తెలుస్తుంది. అదే ఇజ్రాయెల్ బడ్జెట్ 19 బిలియన్ డాలర్లు. దీన్నిబట్టే చెప్పొచ్చు ఎవరు ఎక్కువగా రక్షణకు ప్రాధాన్యతనిస్తారో?
ఇక ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి ఉన్న యుద్ధ విమానాల సంగతేంటో చూస్తే ఇజ్రాయెల్ కు 340 ఉంటే ఇరాన్ దగ్గర 320 మాత్రమే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ లో ఎఫ్ 15, 35 రకాలుంటే అదే ఇరాన్ దగ్గర ఎఫ్ 4, 14 రాకాలున్నాయి. ఇవి మరీ ఘోరం. 1960ల కాలం నాటివి. వీటి స్పేర్ పార్ట్స్ కూడా దొరకనంత దైన్యం.
ఇక ఇజ్రాయెల్ ఎంత లేటెస్ట్ అంటే ఈ దేశంలో తయారు చేసిన ఐరన్ డోమ్ టెక్నాలజీని యూఎస్ నేడు గోల్డెన్ డోమ్ గా వాడుకునేంత. అంతే కాదు ఇక్కడ లేజర్ వెపన్ టెక్నాలజీ కూడా తయారైంది. అది ఇతర దేశాల్లో ఉన్న లేజర్ టెక్నాలజీకన్నా మోస్ట్ పవర్ఫుల్. ఇటీవలే వాటిని పరీక్షించి చూసింది ఇజ్రాయెల్. ఇక ఇజ్రాయెల్ ని దెబ్బ తీసే దారేదని చూస్తే.. ఇరాన్ మాన్యువల్.. అదే ఇజ్రాయెల్ టెక్నికల్లీ హై ఎండ్. ఈ దేశం భారీ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీంతో దీన్ని హ్యాండిల్ చేయాలంటే అదే టెక్నాలజీతో నరుక్కు రావల్సి ఉంటుంది. అందుకే ఇజ్రాయెల్ ని దెబ్బ తీయాలంటే సైబర్ దాడులు చేయాలని అంటారు నిపుణులు.
ఇజ్రాయెల్ పై వేలల్లో సైబర్ దాడులు జరుగుతాయి. అదే ఇరాన్ పై కేవలం వందల్లో మాత్రమే. ఉదాహరణకు 2023 అక్టోబర్- డిసెంబర్ మధ్య ఇజ్రాయెల్ మీద 3380 సైబర్ దాడులు జరిగాయి. అదే 2024 ఇరాన్ పార్లమెంటు ఎన్నికల ముందు కేవలం 200 సైబర్ దాడులు మాత్రమే జరిగాయి. ఒక సమయంలో ఇరాన్ మీద సైబర్ దాడుల కారణంగా ఆ దేశంలో పెట్రోలు బంకుల్లో ఇబ్బందులు తలెత్తాయి. వీటన్నిటిని బట్టీ చూస్తే ఇజ్రాయెల్ పై సైబర్ దాడులు ఎక్కువ. ఈ కోణంలో ఇరాన్ ఏదైనా ప్లాన్ చేస్తే ఇజ్రాయెల్ దూకుడును ఇరాన్ కళ్లెం వేయవచ్చంటారు ఎక్స్ పర్ట్స్.
అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ హీబ్రూ యూనివర్సిటీ ఒక సర్వే ఇర్వహించగా ఇరాన్ పై దాడులు ఎమంత అవసరం లేదనికు మూడింట రెండు వంతుల మంది చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ రాజకీయంగా డౌన్ అయినపుడల్లా ఇరాన్ కార్డు వాడుతారని అంటారు. అందులో భాగంగానే ఈ యుద్ధం తలెత్తినట్టుగా నూ భావిస్తారు. దానికి తోడు యూఎస్ ఉండనే ఉంది. యూఎస్ తన అవసరాల కోసం కూడా ఇలాంటి వార్ టెక్నిక్ ప్లే చేస్తుంటుంది అమెరికా. అందులో భాగంగానే ఈ వార్ నడుస్తున్నట్టుగా ఒక టాక్ వైల్డ్ గా స్ప్రెడ్ అవుతోంది. మరి చూడాలి ఈ యుద్ధం ముగింపు ఎక్కడో.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/streangths-and-weaknesses-of-iran-and-israil-25-200046.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.