హర్మూజ్ లో కొత్త రూట్.. ఇరాన్, ఒమన్ మధ్యఒప్పందం.!

Publish Date:Aug 5, 2026

Advertisement

ప్రపంచ వాణిజ్య రవాణాకు గుండెకాయ వంటి  హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రత,  ప్రయాణం విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.  కీలకమైన  ఈ  సముద్ర మార్గంలో  కొత్త  వాణిజ్య నౌకాయాన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇరాన్,  ఒమన్ దేశాల మధ్య  అంగీకారం కుదిరింది. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నడుమ, గల్ఫ్ లో గ్లోబల్  సరఫరా గొలుసు పునరుద్ధరించేందుకు ఈ ద్వైపాక్షిక దోహదపడనుంది. గత కొన్ని  నెలలుగా ఇరాన్,  ఒమన్ మధ్య   ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా  కొత్త    రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది.  సాంకేతిక, చట్ట, భద్రతా  కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు  సంబంధించి  ఇరు దేశాలు  ఓ అవగాహనకు వచ్చాయి.

హర్మూజ్ జలసంధిలో సురక్షితమైన వాణిజ్య నౌకాయానానికి వీలు కల్పించే దిశగా ఒమన్‌తో జరిపిన సంప్రదింపుల్లో   పురోగతి సాధించామని  రాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మీడియాకు వెల్లడించారు.    ఎటువంటి  అంతరాయాలు,  ఒత్తిళ్లు లేకపోతే.. అంగీకరించిన ప్రధాన మార్గదర్శకాలతో త్వరలోనే  ఈ విషయంపై ఇరాన్, ఒమన్ లు ఉమ్మడి   ప్రకటనను  విడుదల చేస్తాయి. గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకల కదలికలకు భద్రత  కల్పించేందుకు దాదాపు రెండు నెలలు  సాగిన  చర్చలు దాదాపు ఫలవంతమయ్యాయి. 

 ద్వైపాక్షిక అంగీకారం కుదిరినప్పటికీ, జలసంధిలో ప్రస్తుతానికి నూటికి నూరు శాతం   భద్రత ఏర్పడినట్లు భావించలేం.   అమెరికా వైఖరిలో మార్పు రానంత వరకు,  సముద్ర దిగ్బంధనాలు తొలగనంత వరకు జలసంధిలో నౌకల రవాణా  సురక్షితం కాదనే చెప్పాలి.  మరోవైపు..  ప్రాంతీయ ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చేందుకు,  చర్చల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ఇరాన్   దౌత్య మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే రెండు మూడు రోజులలో   ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ,  పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ ఘలీబాఫ్ పాకిస్థాన్,  ఖతార్ లలో పర్యటించనున్నారు. 

Strait of Hormuz, Iran Oman shipping route, commercial maritime security, Esmaeil Baghaei statement, Middle East shipping tension, Gulf trade route

By
en-us Political News

  
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. 
ఇప్పటి వరకూ  గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.