వైసీపీని ఓడించిన ‘ఉక్కు’ సంకల్పం

Publish Date:Apr 26, 2022

Advertisement

ఉక్కు సెగ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేయనుందా? ఉక్కు సంకల్పం విశాఖపట్నానికే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం అదే సంకల్పం కనిపిస్తుందా? ఏది ఏమైనా ఉక్కు దెబ్బకు వైసీపీ గింగిరాలు తిరగక తప్పదన్న సంకేతం అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నికలలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ ఎన్నికలలో వైసీపీకి చేదు అనుభవం ఎదురైంది. విపక్ష టీడీపీకి తీపి గెలుపు అందింది. నిజానికి ఈ ఎన్నికలలో వైసీపీ అనుబంధ కార్మిక సంస్థ ఐఎన్టీయూసీకి మద్దతు ఇచ్చింది. కేవలం మద్దతే కాదు..ఈ ఎన్నికలలో ఐఎన్టీయూసీ తరఫున...వైసీపీ నేతే పోటీలో దిగి పరాజయం పాలయ్యారు. 
అయితే ఈ ఎన్నికలలో వైసీపీ అనుబంధ కార్మిక సంస్థ పోటీ చేయకపోవడానికి కారణం కార్మికులలో వ్యక్తమౌతున్న వ్యతిరేకతే కారణమి పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద వైజాగ్ ఉక్కు కర్మాగారం ఎన్నికల ఫలితం కేవలం ఉక్కు కర్మాగారానికే పరిమితం కాదనీ, అది విశాఖ నగరంలో అధికార పార్టీ వ్యతిరేకతకు అద్దం పడుతున్నదని పరిశీలకులు చెబుతున్నారు. అలాగే కేవలం విశాఖ నగరానికే కాక ఉక్కు జ్వాలలు రాష్ట్ర మంతటా వ్యాపించే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ తెలుగువాడు నినదించి ఆందోళనలతో రగిలి వందల మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని  కేంద్రం ప్రైవేటు పరం చేస్తున్నా ఆపడానికి ఇసుమంతైన ప్రయత్నించని వైసీపీ సర్కార్ పై ఉక్కు కార్మికుల్లోనే కాదు...రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. విశాఖ ఉక్కు కేవలం ఒక కర్మాగారం కాదు అది ఆంధ్రుల సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ను వైసీపా పట్టించుకోని ఫలితమే వైజాగ్ స్టీల్ ఎన్నికల్లో ఓటమి. 
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నికలలో తెలుగుదేశం అనుబంధ యూనియన్ మద్దతు ఇచ్చిన ఐఎన్టీయూసీ దాదాపు 466  ఓట్ల ఆధిక్యంతో గెలిచింది.
ఈ మూడేళ్లలో వైసీపీకి ఏదైనా ఒక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలడం ఇదే ప్రథమం అని చెప్పవచ్చు. విశాఖ ఉక్కు సెగ వైసీపీని మరింత ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయమన్నది పరిశీలకుల అంచనా. ఈ అంచనాకూ కారణం లేకపోలేదు.  ఒక కర్మాగారం కార్మిక సంఘం ఎన్నికలే అయినా...ఈ ఎన్నికల ప్రచారం మాత్రం ఒక అ సెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఎన్నిక స్థాయిలో జరిగింది. వైసీపీ  ఎంపీలు, ఎమ్మెల్యేలూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. చివరికి గేట్ మీటింగులకు కూడా హాజరై ప్రచారం నిర్వహించారు. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినా వైసీపీ తాను మద్దతు పలికిన యూనియన్ ను గెలిపించుకోలేకపోయింది. 

By
en-us Political News

  
ఆ ఆత్మీయ విందులో పాల్గొన్న వారెవరి మెబైల్ ఫోనూ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. అంతెందుకు ఆ సమయంలో ఎవరూ ఫోన్ జోలికే పోలేదు. వాట్సాప్ చాటింగ్ ల ఊసే లేదు. కుటుంబాల ముచ్చట్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటుంబాలా క్షేమ సమాచారాలు పంచుకోవడంతో అంతా ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు.
తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు.
కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు. అంతకుముందు కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవ‌ల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. ఆ వెంట‌నే కాపుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో దిగి వ‌చ్చిన ఆర్పీ క్ష‌మాప‌ణ చెప్పారు కూడా. అలాగ‌ని కాపులంతా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డం అని అర్ధం కాదు క‌దా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు.
రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే.
తెలంగాణ‌లో కమలం పార్టీ ఎప్ప‌టి నుంచి పుంజుకుంది? రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మెంత‌ అన్న‌దొక చ‌ర్చ‌.
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
గుంటూరులోని తన నివాసంపై తెలుగుదేశం శ్రేణుల దాడి, తనపై హత్యయాత్నం చేయడం తదితర విషయాలను జగన్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ అంబటికి కేసులకు భయపడవద్దని ధైర్యం చేప్పారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు.
అప్పట్లో అధికారపార్టీలో ఉన్న అనంతబాబుతో అధికారంలో ఉన్న వై ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
వైసీపీ సభ్యులు వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులతో పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.