Publish Date:Jul 13, 2025
బ్యాడ్మింట్ స్టార్ కపుల్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ వివాహ బంధం నుంచి విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. తాము విడాకులు తీసుకుంటున్న విషయాన్ని సైనా నెహ్వాల్ సామాజిక మాధ్యమ వేదికగా ప్రకటించారు. తాము విడిపోవాలన్న నిర్ణయం తీసుకున్నామనీ, అన్నీఆలోచాంచిన తరువాతే కాశ్యప్ తో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సైనా నెహ్వాల్ పేర్కొన్నారు. ఇద్దరం కలిసి అన్ని చర్చించుకుని ఈ నిర్ణయం తీసుకున్నామనీ, జీవితంలో వేరువేరుగా ముందుకు సాగాలని భావించామని తెలిపిన సైనా.. ఈ విషయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరుతున్నామన్నారు.
సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇరువురూ కూడా హైదరాబాద్ లోని గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందిన వారే. అక్కడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. తమ ప్రేమ బంధాన్ని పెళ్లిబంధంగా మార్చుకున్నారు. 2018 డిసెంబర్ లో సైనా, కశ్యప్ ల వివాహం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆదివారం (జులై 13) తమ ఏడేళ్ల వివాహబంధానికి ముగింపు పలుకుతున్నట్లుగా సైనా నెహ్వాల్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టించింది.
సైనా నెహ్వాల్ 2008 లో బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్ విజయంతో ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. అదే ఏడాది ఆమె ఒలింపిక్స్ లో ఆడింది. తొలి ప్రయత్నంలోనే క్వార్టర్ ఫైనల్ వరకూ వెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా షట్లర్ గా నిలిచింది. ఆ తరువాత నాలుగేళ్లకు తొలి ఒలింపిక్ పతకం సాధించింది. 2012 ఒలింపిక్స్ లో సైనా నెహ్వాల్ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. సైనాకు 2009లో అర్జున, 2010లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాలు దక్కాయి.
ఇక పారుపల్లి కశ్యప్ విషయానికి వస్తే 2014 కామన్వెల్త్ గేమ్స్ లో అతడు స్వర్ణపతకం సాధించాడు. 32 ఏళ్ల తరువాత కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన తొలి షట్లర్ గా రికార్డు సాధించాడు. అలాగే ఒలింపిక్స్ లో క్వార్టర్ పైనల్ కు చేరిన తొలి ఇండియన్ షట్లర్ గా నిలిచాడు. 2024లో షటిల్ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్ అయిన కాశ్యమ్ ఇప్పుడు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/star-shutlers-saina-and-kasyap-divorce-25-201942.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు