ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం అనంతరం ఆయన కుటుంబం ఏకతాటిపైకి వచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్ మరణాంతరం ఆయన రాజకీయ వారసుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆశపడ్డారు. అయితే వైఎస్ఆర్ సీఎంగా పనిచేసింది ఆయన సొంత పార్టీ కాదు కనుక అది సాధ్యపడలేదు. అప్పటికే కాంగ్రెస్ పెద్దలు రెండు మూడుసార్లు జగన్ క్రమశిక్షణ విషయంలో వైఎస్ఆర్ కు క్లాస్ కూడా పీకిన నేపథ్యంతో జగన్ ను సీఎం చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు అంగీకరించలేదు. అదే సమయంలో జగన్ కాంగ్రెస్ లో విభేదించి అప్పటికే తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి రిజిస్టర్ చేసుకున్న వైఎస్ఆర్ పార్టీని హస్తగతం చేసుకొని సొంత కుంపటి పెట్టుకున్నారు. ఈ సమయంలో కూడా వైఎస్ కుటుంబం అంతా జగన్ వెంటే ఉన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ 16 నెలల పాటు జైల్లో ఉండగా.. ఆ కుటుంబమే పార్టీని కాపాడింది.
ముఖ్యంగా జగన్ జైల్లో ఉండగా.. తల్లి విజయమ్మను వెంటపెట్టుకొని సోదరి షర్మిల రంగంలోకి దిగారు. జగన్ స్థానంలో పాదయాత్రను పరుగులు పెట్టించి జగనన్న వదిలిన బాణంగా పేరు తెచ్చుకున్నారు. ఈ సమయంలో ఎక్కడా ఈ కుటుంబంలో ఎలాంటి పొరపొచ్చాలు లేవు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక, జగన్ సీఎం అయ్యాక ఈ కుటుంబంలో లుకలుకలు మొదలయ్యాయి. ముఖ్యంగా జగన్.. ఆయన భార్య భారతి ఒకవైపు.. మిగిలిన కుటుంబ సభ్యులంతా మరొక వైపు అన్నట్లుగా చీలిపోయారు. జగన్ అధికారంలోకి వచ్చాక చెల్లి షర్మిలను దూరం పెట్టడం తల్లి విజయమ్మను బాధించగా.. వివేకా హత్య ఆ కుటుంబంలో మిగతా వారిని జగన్ కు దూరం చేసింది. ఈ రాజకీయ, వ్యక్తిగత సమస్యల కారణంగానే వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకాలలో వివాదాలు కూడా బయటపడినట్లు తెలుస్తుంది. ఈ వివాదాల కారణంగానే షర్మిల, విజయమ్మలను జగన్ బెదిరించారని కూడా మీడియాలో కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే, ఇప్పుడు ఫైనల్ గా వైఎస్ఆర్ ఆస్తుల పంపకం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ నాయకురాలిగా మారిపోతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం కూడా జరిగింది. పరిణామాలన్నిటినీ గమనించిన వైఎస్ జగన్ సోదరి షర్మిలతో వివాదాలను చక్కదిద్దుకొనే పనిలో భాగంగా ఆస్తి పంపకాల వివాదాలను సరిచేసుకున్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. వైఎస్ కుటుంబ ఆస్తి పంపకాలు ఇద్దరు బడా నేతల సమక్షంలో జరిగినట్లు తెలుస్తుంది. దక్షణాది రాజకీయాలలో కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్ కు ట్రబుల్ షూటర్ గా పేరున్న సంగతి తెలిసిందే. షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం క్రెడిట్ కూడా శివకుమార్ దే. కాగా ఇప్పుడు ఆయనే వైఎస్ ఆస్తి పంపకాల విషయంలో కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తున్నది. శివకుమార్ షర్మిల తరపున ఈ పంపకాలలో పాల్గొనగా.. వైఎస్ జగన్ తన తరపున తమిళనాడు సీఎం స్టాలిన్ ను పంపినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద వైఎస్ ఆస్తి పంపకాల వివాదం ఈ ఇద్దరి సమక్షంలో పరిష్కారమైనట్లు, ముఖ్యంగా సీఎంగా వైఎస్ సంపాదించిన తెలంగాణ ఆస్తులలో షర్మిల వాటా తేల్చి అప్పగించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఈ ఆస్తి పంపకాలతో షర్మిల సంతృప్తి చెందగా.. ఇకపై జగన్ వాటా ఆస్తులతో షర్మిలకు ఎలాంటి సంబంధం లేకుండా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. అంతే కాదు, షర్మిల భవిష్యత్తులో ఏపీ రాజకీయాలలోకి అడుగుపెట్టరాదన్నట్లుగా కూడా ఒప్పందం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. షర్మిల ఇకపై ఏపీ తప్ప మిగతా ఏ రాష్ట్రం నుండైనా రాజకీయాలు చేసుకోవచ్చని, అలాగే కుటుంబ, వ్యక్తిగత విషయాలపై షర్మిల ఎలాంటి విమర్శలు చేయకూడదని స్టాలిన్, శివకుమార్ సాక్షిగా డీల్ కుదిరినట్లు చెప్తున్నారు. ఈ పంపకాలు, వివాదాల తర్వాతనే షర్మిల ఏపీ రాజకీయాలలోకి వెళ్లే విషయంలో వెనక్కి తగ్గినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/stalin-and-shivkumar-mediaters-25-161215.html
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.