Publish Date:May 27, 2022
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరు తారక రామ రావు,,జయంతి రేపు.(శనివారం) 1923 మే 23 న జన్మిచిన ఎన్టీఅర్, 1996 జనవరి 18 కన్ను మూశారు. అప్పటి నుంచి తెలుగు దేశం పార్టీ, హైదరాబాద్’లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రతి సంవత్సరం ఎన్టీఅర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా, తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తోంది. అయితే, ఈ సంవత్సరం వేడుకలకు ఒక ప్రత్యేకత వుంది. ముఖ్యంత్రి కేసీఆర్ జయంతి వేడుకలకు హాజరవుతున్నారు.
Publish Date:May 27, 2022
స్పీకర్ పదవికి ఒక గౌరవం ఉంటుంది. ఆ పదవిలో ఉన్న వారు రాజకీయాలు మాట్లాడరు. తాము గెలిచి వచ్చిన పార్టీ కార్యక్రమాలలో పాల్గొనరు. బాధ్యత గలిగిన రాజ్యాంగ పదవుల్లో ఉన్న ఎవరైనా పాటించాల్సిన నైతికత ఇది. అలాంటి బాధ్యత కలిగిన రాజ్యంగ పదవిలో ఉన్న తమ్మినేని ఆ గౌరవానికి తగరని తన వ్యాఖ్యలతో నిరూపించుకున్నారు. తెలుగుదేశం మహానాడుపై అనుచిత వ్యాఖ్యలతో బరితెగించి స్పీకర్ పదవికి మాయని మచ్చ తీసుకొచ్చారు. మహానాడును వల్లకాడనీ, చచ్చిపోయిన పార్టీకి దహన సంస్కారాలు చేస్తున్నారనీ సంస్కార హీనమైన వ్యాఖ్యలు చేశారు.
Publish Date:May 27, 2022
రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. కానీ దొంగ శత్రువులు ఉంటారా అంటే మాత్రం కచ్చితంగా ఉంటారంటూ మోడీ, కేసీఆర్ లను చూపుతున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తే కేసీఆర్ నగరం విడిచి వెళ్లడం రాజకీయ కుమ్మక్కులో భాగమేనంటున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న మోడీ నినాదాన్ని కేసీఆర్ అందిపుచ్చుకుని దానిని తెలంగాణకు అనుగుణంగా కాంగ్రెస్ ముక్త తెలంగాణగా సవరించుకున్నారని, ఆ లక్ష్యం సాధించేందుకే బీజేపీకి రాష్ట్రంలో లేని ప్రాధాన్యతకు కట్టబెడుతున్నారన్నది వారి విశ్లేషణ. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలం చెక్కు చెదరకపోవడం, నేతలు బలహీనపడినా కార్యకర్తల బలం తెలంగాణలో కాంగ్రెస్ కు ఎలా ఉన్నది అలాగే ఉండటాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు ధఫాలు వరుసగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తీవ్రమైన యాంటీ ఇన్ కంబెన్సీని ఎదుర్కొంటోందనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు మళ్ల కుండా ఉండాలంటే బీజేపీ బలోపేతం అయ్యిందన్న భావన ప్రజలలో కలిగించేందుకే ఆ పార్టీకి అధిక ప్రాధాన్యతను కేసీఆర్ ఇస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.
Publish Date:May 27, 2022
మరో రెండు మూడు నెలలు ఆగండి, మీకో సంచలన వార్త చెపుతా .. గురువారం బెంగుళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మరో సంచలన ప్రకటన ఇది.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “జాతీయస్థాయిలో మార్పు రాబోతోంది.. దాన్ని ఎవరూ ఆపలేరు. రెండు మూడు నెలల తర్వాత మీకు సంచలన వార్త అందుతుంది” అని మీడియాకు చెప్పారు.అయితే ఆ సంచలన ప్రకటన ఏమిటో, ఆయన మనసులో ఏముందో మాత్రం ఆయన బయట పెట్టలేదు. కానీ, ఆయన బెంగుళూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన తర్వాత, కుమార స్వామి అసలు గుట్టు విప్పేశారు.
Publish Date:May 27, 2022
విజయనగరం జిల్లాలో జరగాల్సిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర రద్దైంది. మంత్రి బొత్ ఇలాకాలోనే సామాజిక న్యాయ భేరి వైఫల్యం ఆ పార్టీని తీవ్ర నిరాశలో ముంచేసింది. సామాజిక న్యాయ భేరి విజయనగరంలో రద్దు కావడానికి వర్షం కారణమంటూ నేతలు నెపం వర్షం మీదకు తోసేస్తున్నారు
Publish Date:May 27, 2022
ఆంధ్ర ప్రదేశ్’ ప్రభుత్వం మరో మూడు రోజుల్లో మూడేళ్ళు పూర్తి చేసుకుంటోంది. 2019 మే 30 తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఒక్క ఛాన్స్ అని వేడుకున్న జగన్ రెడ్డి, ప్రమాణ స్వీకారం వేదిక నుంచే, ఆరు నెలల్లో అద్భుతాలు సృష్టిస్తానని, బ్రహ్మాండం బద్దలు చేస్తాని ప్రజలకు వాగ్దానం చేశారు. వరస పెట్టి హామీలు గుప్పించారు. కానీ, ఆరు నెలలు మూడేళ్ళు అయినా, పరిస్థితిలో మార్పులేదు.
Publish Date:May 27, 2022
తెలుుదేశం అంటే చైతన్యం. తెలుగుదేశం అంటే అభివృద్ధి, తెలుగుదేశం అంటే సంక్షేమం. అలాంటి తెలుగుదేశం పార్టీని అంతమొందించడం ఎవరి తరం కాదు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను ఎంతగా ఇబ్బందులకు గురి చేస్తే అంతకు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఒంగోలులో రెండు రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమంలో తొలి రోజు శుక్రవారం చంద్రబాబు ప్రారంభోత్సవంలో చంద్రబాబు తొలి పలుకులివి.
Publish Date:May 27, 2022
తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన సొంత నియోజకవర్గం హిందూపురంలోనే పోలీసులు ఆయన కాన్వాయ్ ను అడ్డుకున్నారు. చితమత్తూరు మండలంలోని కొడికొండ గ్రామం వద్ద ఈ సంఘటన శుక్రవారం జరిగింది.
Publish Date:May 27, 2022
సిక్సర్ల సిద్ధూగా క్రికెట్ అభిమానులను అలరించిన నవజోత్ సింగ్ సిద్ధు ఆ తరువాత రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు. తన దైన వాగ్ధాటితో పంజాబ్ రాజకీయాలలో అగ్రతారగా ఎదిగాడు. పంజాబ్ ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారు. అయితే ఇటీవలి పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం పాలవడంతో ఆ ఆశలు నెరవేరలేదు. ఈ లోగా 1988 నాటి కేసులో సిద్ధూకు కోర్టు జైలు శిక్ష విధించింది.
Publish Date:May 27, 2022
ఒంగోలుకు జనం పోటెత్తారు.. వందల్లో, వేలల్లో కాదు లక్షల్లో అవధులు లేని ఉత్సాహంతో మహానాడుకు తరలి వచ్చిన తెలుగు తమ్ముళ్లతో ఒంగోలు పట్టణం కక్కిరిసి పోయింది. ఒంగోలుకు తరలి వస్తున్న జన ప్రవాహాన్ని చూసేందుకు ఒంగోలు ప్రజ ఒక్కుదుటన రోడ్ల పైకి వచ్చారు. దీంతో ఒంగోలులో ఏ వీధి చూసినా ఇసుక వేస్తే రాలనంత మంది జనం కనిపిస్తున్నారు. దీంతో ఒంగోలు పట్టణం ఉక్కిరి బిక్కిరైపోయింది. గురువారం సాయంత్రం నుంచే ఒంగోలుకు జన ప్రవాహం ఆరంభమైంది. నిముష నిముషానికీ అది పెరిగి ఒంగోలును జన సునామీ ముంచెత్తిందా అనిపించేలా పోటెత్తింది.
Publish Date:May 27, 2022
పంచ్ ప్రభాకర్.. ఏపీ హైకోర్టు పంచ్ ప్రభాకర్ ను అరెస్టు చేయాలని సీబీఐకి పలుమార్లు ఆదేశాలిచ్చింది. కానీ అతగాడు పరారీలో ఉన్నాడంటూ అన్ని మార్లూ సీబీఐ కోర్టుకు నివేదించింది. ఏపీ హైకోర్టు తీర్పులు, ఆ తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమంలో పోస్టులు, వీడియోలు పెట్టిన కేసులో నిందితుడు అయిన పంచ్ ప్రభాకర్ దావోస్ లో దర్జాగా తిరుగుతున్నాడు.
Publish Date:May 27, 2022
కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ ప్రతిపాదన బలంగా తెరపైకి వచ్చింది. అప్పట్లో ఈ ప్రతిపాదనకు ప్రస్తుత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా అంగీకారం తెలిపారు. అయితే తరువాత ఈ ప్రతిపాదన మరుగున పడింది. హైదరాబాద్ ను రెండు తెలుగు రాష్ట్రాల రాజధానిగా నిర్ణయించారు.
Publish Date:May 26, 2022
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్విదశాబ్ది వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన మోడీకి బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ నేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం ప్రాంగణంలోనే బీజేపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు సంధించారు. బేగంపేట నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ లో దిగారు. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఐఎస్ బీ వరకు రోడ్డు మార్గంలో వెళ్లారు.