మోదీకి వ్యతిరేకంగా స్టాలిన్, పినరై ఘాటు లేఖలు

Publish Date:Jan 24, 2022

Advertisement

ఐఏఎస్ ల బదిలీలు, కేటాయింపులు, వారికి సంబంధించిన సర్వీస్ రూల్స్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీయేతర రాష్ట్రాలు మోదీ సర్కారు తీరును నిరసిస్తుండగా తాజాగా మరో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం తీరును తప్పు పడుతున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఇదే విషయంపై ప్రధానికి లేఖ రాశారు. కేంద్రం తీరుతో సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలుగుతుందని స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు పినరాయి విజయన్ కూడా అదే తరహాలో లేఖాస్త్రం సంధించారు. కేంద్రం విధానాలతో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఉన్నతాధికారుల్లో భయం పుడుతుందని, వారు ఆయా రాష్ట్రాల పాలసీలను చిత్తశుద్ధితో అమలు చేసే అవకాశం పోతుందన్నారు. 

కేంద్ర కేడర్ కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ వంటి విభాగాలకు చెందిన బ్యూరోక్రాట్లు తమ విధుల నిర్వహణలో భాగంగా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్నారు. దాదాపు రెండేళ్లుగా పలు బీజేపీయేతర రాష్ట్రాలు తమ రాష్ట్రంలోని సీఎస్ లు, డీజీపీలు వంటి ఉన్నతాధికారులను కేవలం తమ రాజకీయ అవసరాల కోసమే వినియోగించుకుంటున్నాయన్న  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెంగాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ఈ విషయం బహిర్గతమైంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశానికి బెంగాల సీఎస్ హాజరు కాకపోతే ఆయన్ని కేంద్రం వెనక్కు పిలిచింది. దీంతో మమతా దీదీ ఆయనకు అండగా ఉంటూ ఆయన చేత రాజీనామా చేయించి మరీ ముఖ్య సలహాదారుడిగా నియమించుకున్నారు. 

ఇటీవల పంజాబ్ లో ప్రధాని పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్రమైన విమర్శల పాలవ్వడమే కాక ప్రధాని భద్రతపై ఆందోళన వ్యక్తమైంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో కూడా జీవో 317కు వ్యతిరేకంగా ఎంపీ బండి సంజయ్ దీక్షకు దిగినప్పుడు ఆ దీక్షను విచ్ఛిన్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు విభాగాన్ని వాడుకున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఫలితంగా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర పోలీసు అధికారులు వ్యక్తిగతంగా పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని నోటీసులు పంపారు. 

ఈ క్రమంలో కేంద్రం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపులు, రూల్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా కేరళ, తమిళనాడు కూడా వాటితో జత కలిశాయి. 

By
en-us Political News

  
ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.
బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది.
స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
నేను ఒక్క‌ చెడ్డ‌ప‌ని కూడా చెయ్య‌లేదు..! అన్నీ మంచి ప‌నులే చేశా..!! నేను నిజాయితీ ప‌రుడ్ని. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబే అన్నీ దుర్మార్గ‌పు ప‌నులు చేస్తున్నాడు.. నా చెల్లెళ్ల‌ను నాపై ఉసిగొల్పుతున్నాడు.. ఇవీ.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్తనాదాలు. తాను క‌లియుగ హ‌రిశ్చంద్రుడిని అని చెప్ప‌డం మిన‌హా, ప్ర‌జ‌ల ముందు ప‌డాల్సిన క‌థ‌ల‌న్నీ ప‌డేశాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.
క్రికెట్ మజా అంటే ఏమిటో బుధవారం రాత్రి హైదారబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూపించింది.
జగన్ ధైర్యంగా జనంలోకి వచ్చి ఐదేళ్లయ్యింది. గత ఎన్నికలకు ముందు పాదయాత్ర తరువాత ఆయన జనం ముఖం చూడటం మానేశారు. తన అధికారాన్ని ప్రత్యర్థులు, వ్యతిరేకులపై కక్ష సాధించుకోవడానికీ, సంక్షేమ పథకాల పేర లబ్ధిదారులకు అరకొరగా సొమ్ముల పందేరానికి అప్పుల వేటకీ పరిమితమైపోయారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (మార్చి 28) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తాము అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు
మేమంతా సిద్ధం అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార బస్సు యాత్రను ఇడుపుల పాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి ప్రారంభించారు. బుధవారం (మార్చి 27)న ఆయన తన ఎన్నికల ప్రచార బస్సు యాత్రకు ఇడుపుల పాయ నుంచి శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా ఇడుపులు పాయలో జగన్ ను తల్లి విజయమ్మ ఆశీర్వదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.