Publish Date:Aug 16, 2025
సృష్టి కేసు ఇంకా దర్యాప్తులో ఉండగానే..మరో అక్రమ సృష్టి బయటపడింది. మహిళలను అంగట్లో సరుకుల మార్చి అమ్మత నాన్ని అమ్ముకుంటు న్నారు.అమాయకమైన మహిళలను టార్గెట్ చేసుకొని వారి దందా కొనసాగిస్తూ లాభాలు గడిస్తున్నారు.ఇప్పడు తాజాగా మేడ్చల్ కేంద్రంగా చేసుకొని అక్రమ సరోగసి దందా కొనసాగిస్తున్న కిలాడి ఎస్ఓటి బృందం చేతికి చిక్కిన విషయం తెలిసిందే... ఈ కేసులో సంచలన మైన విషయాలు బయటపడుతున్నాయి. నిన్న ఎస్ఓటి బృందం మేడ్చల్ జిల్లా పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా సరోగసి దందా కొనసాగిస్తున్న నిందితురాలు లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
అంతేకాకుండా పోలీసులు సరోగసి తల్లులకు నోటీ సులు కూడా పంపించారు. అయితే నింది తురాలు లక్ష్మి గతంలో పిల్లల విక్రయాలు సరోగసి కేసులో ముంబై పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మి తన కుమారుడు నరేందర్ రెడ్డి మరియు కూతురు తిరిగి హైదరాబాద్కు వచ్చారు... నగరాన్నికి వచ్చిన నిందితురాలు లక్ష్మి మళ్ళీ అదే దందా కొనసాగించింది. లక్ష్మి పలు ప్రవేట్ హాస్పిటల్స్ మరియు ఐవీఎఫ్ సెంటర్లకు ఏజెంట్గా వ్యవహరిస్తుంది ఎవరైనా దంపతులు సరోగసి పద్ధతిలో పిల్లల కోసం హాస్పటల్స్ సెంటర్లను ఆశ్రయించగా వాళ్ల ఏజెంట్లు లక్ష్మికి సమాచారం ఇస్తారు.
ఆ విధంగా లక్ష్మి ఐవీఎఫ్ సెంటర్ కు వెళ్ల దంపతుల వివరాలు ఏజెంట్ల ద్వారా సేకరించేది. అనంతరం ఆర్థిక పరిస్థితి బాగోలేని మహిళలను టార్గెట్గా చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి బలవం తంగా సరోగసికి ఒప్పించేది. ఆ తర్వాత పిల్లల కోసం తాపత్రయం పడుతున్న దంప తులను టార్గెట్గా చేసుకొని... వారికి మాయమాటలు చెప్పి వారి వద్ద నుండి 20 నుండి 25 లక్షల వరకు డబ్బులు వసూలు చేసేది. కానీ సరోగసి తల్లులకు మాత్రం ఐదు నుండి నాలుగు లక్షలు మాత్రమే ఇచ్చేది. అంతేకాకుండా నిందితురాలు లక్ష్మి సరోగసి తల్లులకు డబ్బులు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ బాండ్ రాయించు కునేది.
ఇలా ఇప్పటివరకు ఎనిమిది మంది సరోగసి తల్లుల చేత ప్రామిసరీ బాండ్ రాయించుకున్నది. ఇప్పుడు పోలీసులు వారందరికీ నోటీ సులు జారీ చేశారు. లక్ష్మి మరియు ఆమె కుమారుడ్ని పోలీసులు అరెస్టు చేసి... ఇంట్లోఉన్న ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు గర్భాదారణ మందులు హార్మోన్ ఇంజక్షన్లు లతో పాటు హెగ్డే హాస్పిటల్ తో సహా అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్ ఐవిఎఫ్ ,ఫర్టి కేర్ ,శ్రీ ఫెర్టిలిటీ, అమూల్య ఫెర్టిలిటీ సెంటర్ కు సంబంధించిన కొన్ని రిపోర్ట్ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు పోలీసులు పలు ఐ వి ఎఫ్ హాస్పిటల్స్ తో లక్ష్మి కి ఉన్న సంబంధాల పై ఆరా తీస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/srishti-fertility-case-25-204359.html
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
Publish Date:Aug 31, 2026
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న రాజకీయ సమీకరణాలపై చర్చోపచర్చలు మొదలయ్యాయి.