ఈ రాద్ధాంతం కూడా కాంగ్రెస్ వ్యూహమేనా

Publish Date:Jan 2, 2014

Advertisement

 

ఊహించినట్లుగానే టీ-కాంగ్రెస్ నేతలు అందరూ శ్రీధర్‌బాబు మంత్రిత్వశాఖ మార్పుపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ జిల్లాలో వీ.హనుమంత రావు నిర్వహిస్తున్నఇందిరమ్మ విజయయాత్రలో పాల్గొనెందుకు హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియాను, మంత్రి శ్రీధర్‌బాబుతో సహా తెలంగాణా నేతలందరూ కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పిర్యాదు చేసారు. ఆయన ముఖ్యమంత్రిని మందలిస్తున్నట్లు ఏమయినా చెప్తారేమోనని వారు భావిస్తే, కుంతియా ‘ముఖ్యమంత్రికి తన మంత్రుల శాఖలను మార్చేస్వేచ్చ,అధికారం ఉంటుందని’ చెప్పడంతో షాక్ తిన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి నిరసనగా వారందరూ మూకుమ్మడి రాజీనామాలు చేద్దామని భావిస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను చూసిన మంత్రి టీజీ వెంకటేష్, “ఒకవేళ ముఖ్యమంత్రి నిర్ణయం వారికి నచ్చకపోతే రాజీనామా చేయడమే మేలు” అంటూ వ్యాఖ్యలు చేయడం వారికి పుండు మీద కారం చల్లినట్లయింది. ఇక కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కూడా కలుగజేసుకొంటూ ఇటువంటి సమయంలో మంత్రిత్వ శాఖలు మార్చడం సబబు కాదు. అయినా శాఖలు మార్చిననత మాత్రాన్న తెలంగాణా ఏర్పాటు ఆగిపోతుందని భావించడం అవివేకం, అని మీడియాతో అన్నారు.

 

రేపు శాసనసభలో అందరూ కలిసి కట్టుగా ముఖ్యమంత్రిని, ఆయన సహచరులను గట్టిగా డ్డీ కొనవచ్చును. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో మంత్రి శైలజానాథ్ ప్రతిపాదించనున్న సమైక్యతీర్మానాన్నిఎట్టి పరిస్థితుల్లో సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకొంటామని టీ-కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. సమైక్యతీర్మానం చేసిన తరువాతనే తెలంగాణా బిల్లుపై చర్చకు అంగీకరిస్తామని సీమాంధ్ర కాంగ్రెస్, వైకాపా సభ్యులు కూడా అంతే ఖరాఖండిగా చెపుతున్నారు. అంటే శాసనసభలో బిల్లుపై ఇక ఎటువంటి చర్చజరగకుండానే జనవరి23 రాష్ట్రపతికి తిప్పి పంపే అవకాశాలే ఎక్కువని స్పష్టం అవుతోంది. బిల్లుపై సభలో ఎలాగు చర్చ జరిగే అవకాశం లేదు గనుక, తక్షణమే దానిని రాష్ట్రపతికి తిప్పి పంపమని టీ-కాంగ్రెస్, తెరాస నేతలు రేపు గట్టిగా పట్టుబట్టడం ఖాయం. కానీ, ముఖ్యమంత్రి దానిని జనవరి23 గడువు వరకు ఇక్కడే ఆపడం కూడా అంతే ఖాయం. ఈ కాంగ్రెస్ నేతల డ్రామాలన్నీచూస్తుంటే తెలంగాణా బిల్లు రాష్ట్రానికి వచ్చినప్పుడు దానిని ఎటువంటి చర్చ జరగకుండా, వ్యతిరేఖ ముద్ర పడకుండా ఏవిధంగా రాష్ట్రపతికి తిప్పి పంపాలో అంతా ముందే ప్లాన్ తయారు చేసుకొని అందరూ దాని ప్రకారమే నటించేస్తున్నట్లు అనిపిస్తోంది. లేకుంటే జైపాల్ రెడ్డి మొదలు టీజీ వెంకటేష్ వరకు అందరూ కలిసి ఇంత రాద్ధాంతం చేయవలసిన సమస్య కాదిది.

By
en-us Political News

  
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
సురేష్ బాబు చేసిన అక్ర‌మాలపై టీడీపీ కార్పొరేట‌ర్లు చేసిన ఫిర్యాదులపై విచారణ జరిగింది. కార్పొరేష‌న్ ప‌రిధిలో చేప‌ట్టే ప‌నుల‌ను బినామీల రూపంలో త‌న కుటుంబానికి చెందిన కాంట్రాక్టు సంస్థ‌ల‌కు సురేష్ బాబు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన మాట వాస్తవమేనని తేలింది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.