ఇంటి పార్టీ పక్కాగా రెండు ముక్కలు?

Publish Date:May 24, 2025

Advertisement

బీఆర్ఎస్ లో చీలిక పక్కా అయిపోయిందా?  కవిత సొంత కుంపటి పెట్టుకోవడం ఖాయమైపోయిందా? అంటే.. గులాబీ పార్టీ వర్గాల నుంచి ఔననే  సమధానమే వస్తోంది. నిజానికి కవిత  చాలా కాలంగా  సొంత కుంపటి’ సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. అయితే..  కేటీఆర్, హరీష్ రావులను కలిపినట్లుగానే కేసీఆర్  ఏదో చేసి కవితను దారికి తెస్తారనే  ఆశలు కూడా ఇప్పుడు ఆవిరైపోయాయి.  కవిత అమెరికా నుంచి వస్తూ వస్తూనే.. తెలంగాణ గడ్డ పై కాలుపెట్టీపెట్టక ముందే చేసిన ‘దయ్యాల’ వ్యాఖ్యలతో, ఆ కొద్ది పాటి దింపుడు కళ్ళెం ఆశ కూడా కొడిగట్టిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో, ఏదో మహాద్భుతం జరిగితే తప్పించి, గులాబీ పార్టీ చీలికను నిరోధించడం  ‘దేవుడి’ కి కూడా సాధ్యం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అవును. భారత రాష్ట్ర సమితి లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావుకు, ఆయన కుమార్తె, పార్టీ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత రాసిన రాజకీయ లేఖ సంచలనంగా మారింది.  నిజానికి, కవిత ఎవరో పరాయి వ్యక్తిలా, కన్న తండ్రికే  లేఖ రాయడమే ఒక సంచలనం అయితే..  ఆ లేఖలో ఆమె ప్రస్తావించిన అంశాలు మరింత సంచలనంగా మారాయి.  ముఖ్యంగా  బీఆర్ఎస్ రజతోత్సవ సభ తీరు తెన్నులు.. ఆ సందర్భంగా కేసీఆర్ చేసియన్ ప్రసంగం మంచి చెడులను ఆమె ఆ లేఖలో ప్రస్తావించారు. అదే సమయంలో ఆమె చేసిన మర్మ గర్భ వ్యాఖ్యలూ..  ముఖ్యంగా బీజేపీని విమర్శించ వలసినంతగావి మరించలేదని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

అంతకు మించి అమెరికా నుంచి  వస్తూనే, ఆ లేఖ రాసింది తానేనని స్పష్టం చేయడంతో పాటు, మా నాయన, కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలు చేరాయి’ అంటూ చేసిన, వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. అలాగే..  లేఖ లీక్  కు సంబదించి కవిత లేవనెత్తిన ప్రశ్నలు.. ఆమె పుట్టింటి  కుట్రలకు అద్దం పడుతోందని అంటున్నారు. 

నిజానికి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్  అన్నట్లుగా పార్టీ నాయకురాలిగా కవిత లేఖ రాయడం తప్పు కాదు. అందులో ఆమె ప్రస్తావించిన అంశాలను కూడా తప్పు పట్టవలసిన అవరం లేదు. క్షేత్ర స్థాయి పరిస్థితిని ఆమె తనకున్న అవగాహన మేరకు ప్రజాస్వామ్య స్పూర్తితో పార్టీ అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్ళారు. పార్టీ నాయకురాలిగా పార్టీకి పార్టీ అధ్యక్షునికి సూచనలు చేశారు. దాన్ని భూతద్దంలో చూడాల్సిన పని లేదు. కానీ  ఆమె  అక్కడితో ఆగ లేదు. కేసీఆర్ ను దేవుడిగా పేర్కొంటూనే.. ఆయన చుట్టూ దయ్యాలు చేరాయని  పరోక్షంగానే అయినా తండ్రి పైనే తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక విధంగా ధృతరాష్ట్రుడితో  పోలిక తెచ్చారా అన్నట్లుగా  ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. 
 కేసీఆర్ కుమార్తెగా  తాను రాసిన లేఖే లీక్ అయితే..  సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటి? ఇది అత్యంత బాధాకరం. లేఖ ఎలా లీక్ అయిందో, పార్టీ ప్రజలు కూడా ఆలోచించాలి  అంటూ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. లేఖ లీక్ లోనే కుట్ర కోణం దాగుందని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, దేశంలో అడుగుపెడుతూనే, పార్టీని ముఖ్యంగా కన్న తండ్రి కేసేఆర్ ను ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. ఆమె,లక్ష్యం ఇంకేదో ఉందనే విషయాన్ని స్పష్టమౌతోందని పరిశీలకులు అంటున్నారు.    

అదొకటి అయితే, కవిత.. నాన్నకు ప్రేమతో.. రాసిన లేఖ వెనక చాలా,  పేద్ద   కథే ఉందని అంటున్నారు. ముఖ్యంగా.. ఇటీవల ఆమె నడకలో, నడతలో, భాషలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న మార్పు  నేపథ్యంలో కవిత అడుగులు ఎటుగా పడుతున్నాయి?  ఆమె తదుపరి రాజకీయ ప్రస్థానం ఎటుగా సాగుతోంది? ఆమె ఆమెగానే, అడుగులు వేస్తున్నారా.. లేక, నడిచేది ఆమే అయినా నడిపించే వారు వేరే ఉన్నారా? అనే ప్రశ్నలు, అనేక వ్యూహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కవిత వెనక ఎవరున్నారు అనేది పక్కన పెడితే,  కవిత కారు దిగడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. నిజానికి..లిక్కర్ కుంభకోణం విచారణ మొదలైనప్పటి నుంచే ఆమెకు ఇటు ఫ్యామిలీలో,అటు పార్టీలో వ్యతిరేకత మొదలైందని అంటున్నారు. అక్కడి నుంచే ఆమె పార్టీకి, ఫ్యామిలీకి కూడా దూరం అవుతూ వచ్చారనే మాట వినిపిస్తోంది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి, ఆరు నెలలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత పార్టీని,ఫ్యామిలీని నమ్ముకుంటే కష్టమనే నిర్ణయానికి కవిత వచ్చారని అంటున్నారు. అందుకే..  ఆమె, పార్టీలో, ఫామిలీలో తమ స్థానం ఏమిటో స్పష్టం  చేయాలని, అన్న కేటీఆర్ తో సమాన హోదా కోసం పట్టుపడుతూ వచ్చారని అంటారు. అయితే.. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభతో  పార్టీలో తన స్థానేమిటో తేట తెల్లకావడంతో పాటుగా ఆమె అమెరికా ప్రయాణానికి ముందు కేసీఆర్ మధ్యవర్తిత్వం వహించి మరీ కేటీఆర్, హరీష్ రావులను కలపడంతో.. కవితకు తన స్థానం ఏమిటో తెలిసివచ్చిందని, అందుకే ఆమె కొత్త దారులు వెతుక్కుంటున్నారని అంటున్నారు.

అందుకే..  విమానం దిగుతూనే ఇక  మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్లుగా దయ్యాల  తూటాను, ఎవరికి తగలాలో వారికి తగిలే విధంగా పేల్చారని అంటున్నారు. నిజానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందునుంచే ఉహించిన కవిత ఒకటి కంటే ఎక్కవ ప్రత్యామ్నాయాలను సిద్దం చేసుకున్నారని అంటున్నారు. ఇప్పడు.. ఆమె కారు దిగడం ఖాయమని తెలిపిన నేపధ్యంలో, ఏ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటారు.. ఎటుగా అడుగులు వేస్తారు  అనేది చూడవలసి ఉందని అంటున్నారు.

By
en-us Political News

  
ఐపీఎల్ 2025 ఫైనల్ లో ఆర్సీబీ విజయంలో కృనాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ వంటి మెగా టోర్నీ ఫైనల్ లో 191 పరుగుల స్కోరు డిఫెండ్ చేసుకోవడమంటే నిజంగా అద్భుతమనే చెప్పాలి.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ. 2008లో ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆర్సీబీ లో భాగమైన కోహ్లీ ఈ 18 ఏళ్లూ అదే జట్టు తరఫున ఆడాడు. ఆర్సీబీతో ఎమోషనల్ గా పెనవేసుకుపోయాడు.
ఆర్సీబీ విజయంతో క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ కరిగి కన్నీరయ్యాడు. ఉద్వేగానికి లోనయ్యాడు. 18 ఏళ్లుగా ఆర్సీబీ విజయం కోసం తన సర్వశక్తులూ ధారపోసిన కోహ్లీ అది సాధించిన అనంతరం ఆనందం పట్టలేక కన్నీరు పెట్టుకున్నాడు.
ఆర్సీబీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆహ్మదాబాద్ వేదికగా మంగళవారం (జూన్ 3)న జరిగిన ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ పై ఆరు పరుగుల ఆధిక్యతతో గెలిచి విజేతగా నిలిచింది.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభం దక్కలేదు దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఫిల్ సాల్ట్.. కైల్ జెమీసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
మధుర ఫలం మామిడిని పండించే రైతు ధర లేక కుదేలవుతున్నాడు. ఈసారి మామిడి దిగుబడి బాగా వచ్చినా ధర అధ్వాన్నంగా ఉండడంతో ఢీలా డ్డారు. ఉమ్మడి కడప జిల్లాలోని కోడూరు మామిడి కి రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా పేరుంది
తెలంగాణలో కరోనా కలకలం సష్టించున్నాయి. రాష్ట్రంలో నాలుగు కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూంతో పాటు జిల్లాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టులు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌లు, ఫిషింగ్ హార్బర్లపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక జరిగే ఐపీఎల్ 2025 ఫైనల్ బెంగళూరుతోో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
చాలా మంది జ‌గ‌న్ అనేవాడు. చాలా చాలా బాధ ప‌డుతున్నాడు. నీర‌సించి పోయాడు..అస్స‌లు డ‌బ్బులు లేవంట‌ క‌నీసం ఆఫీసు రెంటు కూడా క‌ట్ట‌లేక పోతున్నాడంట‌..అని తీవ్ర నిరాశా నిస్పృహ‌ల‌తో అల‌మ‌టించిపోతున్నారుగానీ.. జ‌గ‌న్ ప‌రిస్థితి అలాగేం లేదు.
ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య జరిగే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వద్ద వర్షం మొదలైంది.
ఐపీఎల్ 2025 ముగింపు వేడుకలు నేటి సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం నేపథ్యంలో భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమన్ని నిర్వహిస్తోంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీని మళ్లీ విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. ఆనారోగ్యం కారణంగా ఇటీవల వంశీకి కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసి మెరుగైన వైద్య చికిత్స అందించాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.