Publish Date:Aug 29, 2022
గుహలో పులి ఉంటుంది, కలుగులో ఎలక ఉంటుంది. బెంగళూరికి చెందిన లక్ష్మి అనే మహిళ చెవిలో ఏకంగా సాలీడు నివాసం ఉంది! ఒకరోజంతా తలపోటు చంపేసింది..ఆ బాధను భరించలేక 49 ఏళ్ల లక్ష్మీ అనే మహిళ పాటించని చిట్కా అంటూ ఏదీ లేదు. వాళ్ల నానమ్మ చెప్పిన వాటి నుంచి ఈమధ్య పక్కింటి పిన్నిగారు చెప్పిన వైద్య నిపుణత అంతా చెవిమీదే ప్రదర్శించింది. నొప్పి తగ్గకపోగా మరింత ఎక్కువ యింది. తీరా డాక్టర్ దగ్గరికి మర్నాడు వెళితే, ఒక సాలీడు గారు తీరిగ్గా ఒళ్లు విరుచుకుంటూ చెవి గుహ లోంచి బయటకి వచ్చింది!
చాలాసేపటి నుంచి తలపోటుగా ఉంటే అనాసిన్ వేసుకోమని అనేకమంది సలహాలిస్తుంటారు. తప్ప కుండా పాటించి విశ్రాంతి తీసుకోవడం పరిపాటి. కొద్దిసేపటికి తగ్గిందని పనుల్లోకి వెళ్లడం సర్వ సాధారణం. కానీ తలపోటు తగ్గకుండా అలానే వేధిస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. చెవిలో ఏదో శబ్దం వస్తోంది దాని వల్లే నొప్పి తగ్గడం లేదని తెలిస్తే పుల్లలతో పొడుచుకోవడం, నూనె చుక్కలు వేసు కోవడం వంటి వంటింటి చిట్కాలు పాటించేస్తుంటారు. కానీ అలా చేస్తేనే ప్రమాదం. చెవిలోకి ఏ ఈగో, దోమో వెళ్లి కాపురం చేస్తోందనే అనుమానం వచ్చినా అటువంటి చిట్కాలు మాత్రం పాటించడం సబబు కాదు.
చెవిలోకి నీళ్లు వెళ్లడం, చిన్న చితకా కీటకాలు తెలియకుండానే వెళ్లడం జరుగుతూంటాయి. అందుకే రోజు లో ఒక్కసారయినా చెవి శుభ్రం చేసుకోవడం మీదా శ్రద్ధపెట్టాలని డాక్టర్లు అంటూన్నారు. కానీ ఇలాం టి సూచనలు అంతగా పాటించకపోవడం వల్లనే లక్ష్మి డాక్టర్ దగ్గరికి వెళ్లవలసి వచ్చింది. డాక్టర్ ఆమె చెవిని పరీక్షించాడు. చెవిలో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. దాని వల్లనే తలనొప్పి వచ్చింద నేది తెలు సుకుంది. డాక్టర్ ఆమె చెవిలోకి టార్చి వేసి పుల్లలాంటి పరికరాన్ని తీసుకుని మెల్ల గా చెవి మీద కొట్టారు. మరో అయిదు నిమిషాలకు ఊహించనివిధంగా ఒక సాలీడు.. చిన్నదే.. నెమ్మదిగా బయట పడింది. దాన్ని తీసి టేబుల్ మీద పడేసారు డాక్టర్.
లక్ష్మితో పాటు డాక్టర్కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇలాంటివి కొద్దిసేపు ఉన్నా ప్రమాదమే. అదృష్టమేమంటే సాలీడు వల్ల బెంగుళూరు మహిళకు ప్రాణహాని జరగలేదు. హమ్మయ్య పిల్లకి ఏమీ కాలేదనుకున్నారు బంధువులు. సాలీడుని చూసి, దాని రాకను గురించి తెలుసు కుని పిల్లలు ఇంకా నవ్వుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/spider-in-the-ear-39-142861.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.