Publish Date:Aug 29, 2022
గుహలో పులి ఉంటుంది, కలుగులో ఎలక ఉంటుంది. బెంగళూరికి చెందిన లక్ష్మి అనే మహిళ చెవిలో ఏకంగా సాలీడు నివాసం ఉంది! ఒకరోజంతా తలపోటు చంపేసింది..ఆ బాధను భరించలేక 49 ఏళ్ల లక్ష్మీ అనే మహిళ పాటించని చిట్కా అంటూ ఏదీ లేదు. వాళ్ల నానమ్మ చెప్పిన వాటి నుంచి ఈమధ్య పక్కింటి పిన్నిగారు చెప్పిన వైద్య నిపుణత అంతా చెవిమీదే ప్రదర్శించింది. నొప్పి తగ్గకపోగా మరింత ఎక్కువ యింది. తీరా డాక్టర్ దగ్గరికి మర్నాడు వెళితే, ఒక సాలీడు గారు తీరిగ్గా ఒళ్లు విరుచుకుంటూ చెవి గుహ లోంచి బయటకి వచ్చింది!
చాలాసేపటి నుంచి తలపోటుగా ఉంటే అనాసిన్ వేసుకోమని అనేకమంది సలహాలిస్తుంటారు. తప్ప కుండా పాటించి విశ్రాంతి తీసుకోవడం పరిపాటి. కొద్దిసేపటికి తగ్గిందని పనుల్లోకి వెళ్లడం సర్వ సాధారణం. కానీ తలపోటు తగ్గకుండా అలానే వేధిస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. చెవిలో ఏదో శబ్దం వస్తోంది దాని వల్లే నొప్పి తగ్గడం లేదని తెలిస్తే పుల్లలతో పొడుచుకోవడం, నూనె చుక్కలు వేసు కోవడం వంటి వంటింటి చిట్కాలు పాటించేస్తుంటారు. కానీ అలా చేస్తేనే ప్రమాదం. చెవిలోకి ఏ ఈగో, దోమో వెళ్లి కాపురం చేస్తోందనే అనుమానం వచ్చినా అటువంటి చిట్కాలు మాత్రం పాటించడం సబబు కాదు.
చెవిలోకి నీళ్లు వెళ్లడం, చిన్న చితకా కీటకాలు తెలియకుండానే వెళ్లడం జరుగుతూంటాయి. అందుకే రోజు లో ఒక్కసారయినా చెవి శుభ్రం చేసుకోవడం మీదా శ్రద్ధపెట్టాలని డాక్టర్లు అంటూన్నారు. కానీ ఇలాం టి సూచనలు అంతగా పాటించకపోవడం వల్లనే లక్ష్మి డాక్టర్ దగ్గరికి వెళ్లవలసి వచ్చింది. డాక్టర్ ఆమె చెవిని పరీక్షించాడు. చెవిలో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. దాని వల్లనే తలనొప్పి వచ్చింద నేది తెలు సుకుంది. డాక్టర్ ఆమె చెవిలోకి టార్చి వేసి పుల్లలాంటి పరికరాన్ని తీసుకుని మెల్ల గా చెవి మీద కొట్టారు. మరో అయిదు నిమిషాలకు ఊహించనివిధంగా ఒక సాలీడు.. చిన్నదే.. నెమ్మదిగా బయట పడింది. దాన్ని తీసి టేబుల్ మీద పడేసారు డాక్టర్.
లక్ష్మితో పాటు డాక్టర్కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇలాంటివి కొద్దిసేపు ఉన్నా ప్రమాదమే. అదృష్టమేమంటే సాలీడు వల్ల బెంగుళూరు మహిళకు ప్రాణహాని జరగలేదు. హమ్మయ్య పిల్లకి ఏమీ కాలేదనుకున్నారు బంధువులు. సాలీడుని చూసి, దాని రాకను గురించి తెలుసు కుని పిల్లలు ఇంకా నవ్వుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/spider-in-the-ear-39-142861.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.